Rajasthan Honeytrap Case: రాజస్థాన్లో ISI గూఢచారి అరెస్ట్.. రెండేళ్లుగా ఆర్మీ రహస్య సమాచారం లీక్..
Rajasthan Honeytrap Case: భారతదేశంలో ఉంటూ పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ కోసం గూఢచర్యం చేస్తున్న వ్యక్తిని శనివారం అరెస్ట్ చేశారు. రాజస్థాన్ అల్వార్కు చెందిన ఒక యువకుడిని ఐఎస్ఐ కోసం గూఢచర్యం చేస్తున్నారని రాజస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్టు చేశారు. ఆ యువకుడిపై ఆపరేషన్ సింధూర్ నుంచి నిఘా ఉంచినట్లు, ఈ రోజు ఆ యువకుడిని అధికారిక రహస్యాల చట్టం, 1923 కింద అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
పాక్ మహిళ హనీట్రాప్లో యువకుడు..
రాజస్థాన్లోని అల్వార్ అత్యంత సున్నితమైన, వ్యూహాత్మకంగా ముఖ్యమైన ప్రాంతం. అల్వార్లోని గోవింద్గఢ్ నివాసి అయిన మంగత్ సింగ్ కార్యకలాపాలు అనుమానాస్పదంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆయన చర్యలను నిశితంగా గమనించిన రాజస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారులు.. మంగత్ సింగ్ను పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ కోసం గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై అరెస్టు చేశారు. అల్వార్ కంటోన్మెంట్ ప్రాంతంలో నిఘా ఉంచిన సమయంలో గోవింద్గఢ్ నివాసి అయిన మంగత్ సింగ్ కార్యకలాపాలు అనుమానాస్పదంగా కనిపించినట్లు అధికారులు చెప్పారు. ఈ యువకుడిని ఇషా శర్మ అనే పాకిస్థానీ మహిళా హ్యాండ్లర్ హనీ-ట్రాప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. జైపూర్లోని ప్రత్యేక పోలీస్ స్టేషన్లో అధికారిక రహస్యాల చట్టం 1923 కింద మంగత్ సింగ్పై కేసు నమోదు చేయగా, రాజస్థాన్లోని CID ఇంటెలిజెన్స్ యువకుడిని అరెస్టు చేసింది.
సోషల్ మీడియా ద్వారా సమాచారం అందజేత..
గత రెండు ఏళ్లుగా మంగత్ సింగ్ సోషల్ మీడియా ద్వారా పాక్ నిఘా సంస్థకు చెందిన హ్యాండ్లర్లతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆపరేషన్ సింధూర్కు ముందు, తరువాత ఇషా శర్మ అనే పాకిస్థానీ మహిళా హ్యాండ్లర్తో మంగత్ సింగ్ సంప్రదింపులు జరిపారు. ఇషా శర్మ పన్నిన హనీట్రాప్లో పడి డబ్బు కోసం ఆకర్షితుడై, అల్వార్ నగరంలోని కీలకమైన కంటోన్మెంట్ ప్రాంతం, దేశవ్యాప్తంగా ఉన్న ఇతర వ్యూహాత్మక ప్రదేశాల గురించి కీలకమైన సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమెతో పంచుకున్నాడని అధికారులు చెప్పారు. జైపూర్లోని సెంట్రల్ ఇంటరాగేషన్ సెంటర్లో వివిధ నిఘా సంస్థలు విచారించిన తర్వాత, యువకుడి మొబైల్ ఫోన్ను పరిశీలించిన అనంతరం.. అక్టోబర్ 10, 2025న జైపూర్లోని ప్రత్యేక పోలీస్ స్టేషన్లో యువకుడిపై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత రాజస్థాన్లోని సిఐడి ఇంటెలిజెన్స్ అధికారులు అతన్ని అరెస్టు చేశారు.
READ ALSO: Pakistan TLP: పాక్ నెత్తిన భస్మాసుర అస్త్రం.. దిక్కు తోచని స్థితిలో దాయాది
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!