IND vs PAK: పాకిస్తాన్ పై ఇషాన్ కిషన్ మెరుపు బ్యాటింగ్.. యువరాజ్ సింగ్‌ రికార్డ్ బ్రేక్

  • ఇషాన్ కిషన్ పాకిస్తాన్ పై అద్భుతమైన ఇన్నింగ్స్
  • 27 బంతుల్లోనే అర్ధ సెంచరీ
  • 40 బంతుల్లో 10 ఫోర్లు, మూడు సిక్సర్లతో 77 పరుగులు
Ishan Kishan

Ishan Kishan

భారత్-పాక్ మధ్య మ్యాచ్ కొనసాగుతోంది. ఈ మ్యాచ్ లో ఓపెనర్ ఇషాన్ కిషన్ పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇషాన్ మెరుపు బ్యాటింగ్ తో పరుగుల వరద పారించాడు. ఇషాన్ కిషన్ పాకిస్తాన్ పై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి 27 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. 40 బంతుల్లో 10 ఫోర్లు, మూడు సిక్సర్లతో 77 పరుగులు చేశాడు. దీనితో, ఇషాన్ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ లలో భారతదేశం తరపున అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ సాధించిన యువరాజ్ సింగ్ రికార్డును బ్రేక్ చేశాడు.

Also Read:CM Revanth Reddy : నేనే రాజు, నేనే మంత్రి అన్న వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌ క్లారిటీ

మొదట బ్యాటింగ్ చేసిన టీం ఇండియాకు దారుణమైన ఆరంభం లభించింది. సల్మాన్ అఘా మొదటి ఓవర్ వేసి అభిషేక్‌ను తొలి ఓవర్‌లోనే అవుట్ చేశాడు. అభిషేక్ తన ఖాతా కూడా తెరవలేకపోయాడు. కానీ తర్వాత ఇషాన్ కిషన్, తిలక్ వర్మ ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. ఆరు ఓవర్ల తర్వాత, భారతదేశం స్కోరు 52-1. ఇషాన్ కిషన్ కేవలం 27 బంతుల్లోనే తన అర్ధశతకం చేరుకున్నాడు. ఆ తర్వాత, ఇషాన్ కేవలం సిక్సర్లు, ఫోర్లు మాత్రమే ఆడాడు. కానీ తొమ్మిదో ఓవర్‌లో ఇషాన్ కిషన్ 40 బంతుల్లో 77 పరుగుల వద్ద ఔటవడంతో భారత్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. సామ్ అయూబ్ వికెట్ పడగొట్టాడు.