Ishan Kishan: కెప్టెన్గా ఇషాన్ కిషన్.. జట్టులో విరాట్, షమీ, జైస్వాల్..!
- ఆగస్టు 28 నుంచి దులీప్ ట్రోఫీ 2025
- ఈస్ట్ జోన్ జట్టుకు కెప్టెన్గా ఇషాన్ కిషన్
- ఈస్ట్ జోన్ జట్టులో ఐదుగురు టీమిండియా ప్లేయర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ishan Kishan Captai For East Zone in Duleep Trophy 2025: దేశవాళీ క్రికెట్ పండుగకు సమయం ఆసన్నమైంది. దులీప్ ట్రోఫీ 2025 ఆగస్టు 28 నుంచి ప్రారంభమవుతుంది. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 11న జరుగుతుంది. ట్రోఫీ కొసం ఈస్ట్ జోన్ జట్టును ఈరోజు ప్రకటించారు. ఈస్ట్ జోన్ జట్టుకు టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. అతడికి డిప్యూటీగా ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న అభిమన్యు ఈశ్వరన్ వ్యవహరించనున్నాడు. అభిమన్యు ఇంకా భారత్ అరంగేట్రం చేయని విషయం తెలిసిందే. ఈస్ట్ జోన్ జట్టులో ఐదుగురు టీమిండియా ప్లేయర్స్ ఉండడం విశేషం. ఇషాన్ సహా ముఖేష్ కుమార్, ఆకాశ్దీప్, మొహమ్మద్ షమీ, రియాన్ పరాగ్ జట్టులో ఉన్నారు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 12 సెంచరీలు చేసిన యువ బ్యాట్స్మన్ విరాట్ సింగ్ కూడా ఈస్ట్ జోన్ జట్టుకు ఎంపికయ్యాడు. అభిమన్యు ఈశ్వరన్ గత 10 టెస్టులకు టీమిండియాలో ఉన్నా ప్లేయింగ్ 11లో చోటు దక్కలేదు. ఇప్పుడు మరోసారి దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించి.. బీసీసీఐ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాలని చూస్తున్నాడు. ఫిట్నెస్ సమస్యలతో ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక కాని సీనియర్ పీసర్ మొహమ్మద్ షమీ ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్స్ రియాన్ పరాగ్ కూడా ఉన్నాడు. ఇంగ్లండ్ కౌంటీల్లో విశేషంగా రాణించిన ఇషాన్ కిషన్.. ,మరలా జాతీయ జట్టులో చోటు కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇక యువ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ రిజర్వ్ ప్లేయర్గా ఉన్నాడు.
Also Read
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్దేవ్పై కంగనా ఫైర్
- School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
- Amit shah: రేపు తమిళనాడులో దక్షిణాది ముఖ్యమంత్రులతో అమిత్ షా భేటీ.. ఆ 3 అంశాలపై చర్చ
- India vs Sri Lanka Test: మానవ్ సుతార్ సంచలనం.. అశ్విన్, హర్భజన్ రికార్డులు బద్దలు..!
Also Read: Anil Ravipudi: నా కెరీర్లో చేసిన విభిన్న ప్రయత్నం.. నేషనల్ అవార్డుపై స్పందించిన అనిల్ రావిపూడి!
ఈస్ట్ జోన్ జట్టు:
ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్/కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, సందీప్ పట్నిక్, విరాట్ సింగ్, డానిష్ దాస్, శ్రీరామ్ పాల్, శరణ్దీప్ సింగ్, కుమార్ కుషాగ్రా, రియాన్ పరాగ్, ఉత్కర్ష్ సింగ్, మనీషి, సూరజ్ జైస్వాల్, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్, మహ్మద్ షమీ.
స్టాండ్బై ప్లేయర్లు:
ముఖ్తార్ హుస్సేన్, ఆశీర్వాద్ స్వైన్, వైభవ్ సూర్యవంశీ, స్వస్తిక్ సమాల్, సుదీప్ కుమార్ ఘరామి, రాహుల్ సింగ్.
తాజావార్తలు
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
-
Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్దేవ్పై కంగనా ఫైర్
-
School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
-
Telegram: టెలిగ్రామ్ యూజర్లకు బంపర్ ఆఫర్.. ఇక ప్రతి ఒక్కరికీ ఫ్రీ వెబ్సైట్, డొమైన్! CEO సంచలన ప్రకటన..
-
Amit shah: రేపు తమిళనాడులో దక్షిణాది ముఖ్యమంత్రులతో అమిత్ షా భేటీ.. ఆ 3 అంశాలపై చర్చ
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!