తెలుగు చిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ అయితే ఉంది. మల్టీస్టారర్ చిత్రాలకు సక్సెస్ రేటు కూడా చాలా ఎక్కువ ఉంది.అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ మరియు శోభన్ బాబు లాంటి హీరోలు చాలా సినిమాల్లో మల్టీ స్టారర్ హీరోలుగా కనిపించి మంచి విజయాలను కూడా అందుకున్నారు…ఆ కాలంలో మల్టీస్టారర్ చిత్రాలు బాగా వచ్చాయి. ఆ తర్వాత వాటి ట్రెండ్ కాస్త తగ్గినా.. ఇప్పుడు మళ్లీ కూడా ఊపందుకున్నాయి. ముఖ్యంగా `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` తర్వాత టాలీవుడ్ లో వరుసగా మల్టీస్టారర్ చిత్రాలు పడుతూనే ఉన్నాయని చెప్పవచ్చు.
ఎఫ్ 2, ఎఫ్ 3, ఆర్ఆర్ఆర్, ఆచార్య, భీమ్లా నాయక్, బంగార్రాజు మరియు వాల్తేరు వీరయ్య ఇప్పటికే ఎన్నో మల్టీస్టారర్ చిత్రాలు వచ్చాయి.. ఇంకా కూడా వస్తూ ఉన్నాయి. అయితే గతంలో పలువురు హీరోల కాంబోలో ఆగిపోయిన మల్టీస్టారర్స్ కూడా ఉన్నాయి. విక్టరీ వెంకటేష్, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ఓ బ్లాక్ బస్టర్ మల్టీస్టార్ ఆగిపోయింది.బాలీవుడ్ లో 1994 సంవత్సరంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మల్టీస్టారర్ `అందాజ్ అప్నా అప్నా. ఇందులో అమిర్ ఖాన్ మరియు సల్మాన్ ఖాన్ హీరోలుగా అయితే నటించారు. రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వం వహించిన అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ సినిమా అది.రవీనా టాండన్, కరిష్మా కపూర్, పరేష్ రావల్ మరియు శక్తి కపూర్ తదితరులు ఇందులో ముఖ్య పాత్రలను పోషించారు. అప్పట్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ గా నిలిచింది. అమిర్ ఖాన్ మరియు సల్మాన్ ఖాన్ తమదైన కామెడీతో ప్రేక్షకులను తెగ ఎంటర్టైనర్ చేశారు. అయితే ఇదే చిత్రాన్ని తెలుగులో వెంకటేష్ మరియు చిరంజీవి కాంబోలో రీమేక్ చేయాలని ప్రముఖ డైరెక్టర్ ఈవీవీ సత్య నారాయణ కూడా భావించారట. ఇందులో భాగంగానే వెంకటేష్,చిరంజీవి ఇద్దరినీ కూడా సంప్రదించి విషయం చెప్పారని తెలుస్తుంది.. అయితే ఇద్దరు హీరోలు ఈవీవీకి ఒకే చెప్పారని తెలుస్తుంది.. అయితే అప్పటికే చిరంజీవి, వెంకటేష్ కు వేరే సినిమా కమిట్మెంట్స్ ఉండడం వల్ల ఈ మల్టీస్టారర్ వాయిదా పడుతూ నే వచ్చింది. చివరకు బాగా ఆలస్యం అవ్వడంతో.. ఈవీవీ సత్య నారాయణ ఈ మల్టీస్టారర్ ను పక్కన పెట్టేశారని సమాచారం.అలా చిరంజీవి, వెంకటేష్ కాంబోలో ఓ బ్లాక్ బస్టర్ మల్టీస్టారర్ మిస్ అయింది.