Tollywood Summer Releases 2026 : సమ్మర్ అన్ సీజన్గా మారిపోయిందా.. మెగా హీరోలు కూడా హ్యాండ్ ఇచ్చేశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సమ్మర్ అంటే ఒకప్పుడు కాసుల వర్షం. విద్యార్థులకు సెలవులు, కుటుంబీకులకు వినోదం.. వెరసి బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సాగేది. కానీ గత రెండేళ్లుగా టాలీవుడ్ ధోరణి చూస్తుంటే ‘సమ్మర్ సీజన్’ తన ప్రాభవాన్ని కోల్పోతున్నట్లు కనిపిస్తోంది. పెద్ద సినిమాలన్నీ వరుసగా వాయిదా పడుతుండటంతో నిర్మాతలు సమ్మర్ హాలిడేస్ను సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఏప్రిల్ 30న విడుదల కావాల్సిన ‘పెద్ది‘ సినిమా వాయిదా పడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. సాధారణంగా పెద్ద సినిమాలకు నెల రోజుల ముందే ఓవర్సీస్ బుకింగ్స్ జోరుగా సాగుతాయి. కానీ ‘పెద్ది’ విషయంలో ఇప్పటికీ ఎక్కడా బుకింగ్స్ ఓపెన్ కాకపోవడం ప్రమోషన్లలో వేగం లేకపోవడం సినిమా వాయిదా పడిందనే వార్తలకు బలం చేకూరుస్తోంది. దీనివల్ల ఏప్రిల్ చివరి వారంలో థియేటర్లు కళ తప్పే అవకాశం ఉంది.
ఈ ఏడాది వేసవి బరిలో నిలిచిన ఏకైక బిగ్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే. ఆయన నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై భారీ అంచనాలు ఉన్నప్పటికీ అది బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. భారీ నష్టాలను మిగిల్చిన ఈ సినిమా ఫలితం ఇండస్ట్రీని నిరాశకు గురిచేసింది. ఇక మెగా హీరోలు సైతం సమ్మర్కు వస్తామని చెప్పి చివరి నిమిషంలో చేతులెత్తేయడం గమనార్హం. అటు పెద్ది వాయిదా వేస్తె ఇటు చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం ‘విశ్వంభర’ కూడా వాయిదా పడటంతో మెగా ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. అటు నిఖిల్ నటించిన స్వయంభు కూడా ఏప్రిల్ రిలీజ్ వాయిదా వేసుకుని మే లో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఒకప్పుడు సమ్మర్ అంటే పోటీ పడి రిలీజ్ చేసే నిర్మాతలు 2023 నుండి సమ్మర్ లో సినిమాలు రిలీజ్ వాయిదా వేయడమే మేలని భావిస్తున్నారు. సినిమాలకు అసలైన సీజన్ సమ్మర్ అయినప్పటికీ ప్రస్తుతం IPL (Indian Premier League) మేనియా స్టార్ హీరోలను ఆలోచనలో పడేస్తోంది. సాయంత్రం వేళల్లో ప్రేక్షకులు ఐపీఎల్ మ్యాచ్లకు కట్టుబడిపోతుండటంతో కలెక్షన్లపై ప్రభావం పడుతుందనే భయం నిర్మాతల్లో కనిపిస్తోంది. అందుకే సమ్మర్ ఇప్పుడు అన్-సీజన్గా మారిపోతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read
- India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
తాజావార్తలు
-
India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
-
Anantha Sriram : రివ్యూస్ రాసేవాళ్ళకు ఏం అర్హత ఉంది?
-
India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
-
AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
-
Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!