Iran Afghanistan Conflict: ఇరాన్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య మొదలైన యుద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran Afghanistan Conflict: ప్రపంచంలోని రెండు దేశాలైన రష్యా, ఉక్రెయిన్ మధ్య ఏడాదికి పైగా యుద్ధం జరుగుతోంది. దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పడింది. అదే సమయంలో, రెండు మతోన్మాద ఇస్లామిక్ దేశాలైన ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధ పరిస్థితి ఏర్పడుతున్నట్లు కనిపిస్తోంది. ఇక్కడ పోరు నీటి గురించే కావడమే పెద్ద విషయం. మీడియా కథనాల ప్రకారం ఆదివారం, సరిహద్దులో ఇరు దేశాల సైన్యాలు ఘర్షణ పడ్డాయి. ఇందులో నలుగురు జవాన్ల మృతి చెందారు. చనిపోయిన వారిలో ముగ్గురు ఇరాన్ సైనికులు కాగా, ఒకరు తాలిబన్ సైనికులు.
ఇస్లామిక్ రిపబ్లిక్ సరిహద్దులో జరిగిన ఈ ఎన్కౌంటర్ గురించి ఇరాన్ ప్రభుత్వ ఏజెన్సీ IRNA సమాచారం ఇచ్చింది. సమాచారం ప్రకారం, వారి మధ్య కాల్పులు ఇరాన్లోని సిస్తాన్, బలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లోని నిమ్రోజ్ ప్రావిన్స్ సరిహద్దులో జరిగాయి.
Also Read
- Kochi Flight: గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నం.. హడలెత్తిపోయిన ప్రయాణికులు
- AP DSC 2026: టీచర్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్న్యూస్.. త్వరలో కొత్త డీఎస్సీ..
- Varuna Yagam: నాగార్జున సాగర్లో సీఎం రేవంత్ రెడ్డి వరుణ యాగం.. ముహూర్తం ఖరారు..
- FCRA Bill: 'మా చట్టాల గురించి మీకెందుకు?'.. అమెరికాకు భారత్ ఘాటు సమాధానం
Read Also:Train Accident: రైలు ప్రమాదంలో టిక్కెట్ లేని ప్రయాణికులకు కూడా పరిహారం
వివాదం ఏమిటి?
వాస్తవానికి హెల్మాండ్ నది నీటి విషయంలో రెండు దేశాల మధ్య వివాదం ఉంది. ఈ నీటిపై ఇద్దరూ తమ హక్కులను చాటుకున్నారు. కొన్ని మీడియా కథనాల ప్రకారం, రెండు దేశాల మధ్య ఈ వివాదం చాలా తీవ్రంగా మారింది. ఇరాన్ హెల్మాండ్లో నీటి కొరత పై తాలిబాన్లను నిందించింది. ఆ సమయంలోనే ఇరాన్కు నీటి సరఫరాను ఆపలేదని తాలిబాన్ చెబుతోంది.
ఇరాన్ను తాలిబాన్ హెచ్చరించింది
ఆఫ్ఘన్ తాలిబాన్ ఇరాన్ను హెచ్చరించింది. కేవలం 24 గంటల్లో ఇరాన్పై విజయం సాధించగలమని తాలిబాన్ కమాండర్ హమీద్ ఖొరాసాని అన్నారు. దీనితో పాటు, ఇరాన్ మొదట కాల్పులు ప్రారంభించిందని తాలిబాన్ ఆరోపిస్తోంది. తాలిబానీ కమాండర్ అబ్దుల్ హమీద్ ఖొరాసానీ ఒక వీడియో ట్వీట్ చేసాడు. ఇందులో ఇరాన్ రెచ్చగొట్టే చర్యకు దిగిందని ఆరోపించారు. ఆఫ్ఘనిస్తాన్ అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించకూడదని ఇరాన్ హెచ్చరించింది.
Read Also:Rahul Gandhi: ఇది గాంధీ-గాడ్సేల మధ్య పోరాటం.. మోడీ వెనక చూసి కార్ నడుపుతున్నాడు..
ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు అధికారాన్ని చేజిక్కించుకున్నారు
నిజానికి ఆగస్టు 2021 నుండి, తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్పై నియంత్రణలో ఉంది. ఆయన 2001 నుంచి అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కానీ అమెరికా తాలిబాన్లను కాబూల్ నుండి తరిమికొట్టింది. అదే సమయంలో, 2021 సంవత్సరంలో US సైన్యం వారి స్వదేశానికి తిరిగి వచ్చినప్పుడు, తాలిబాన్ మళ్లీ కాబూల్ను స్వాధీనం చేసుకుని తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
తాజావార్తలు
-
Kochi Flight: గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నం.. హడలెత్తిపోయిన ప్రయాణికులు
-
AP DSC 2026: టీచర్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్న్యూస్.. త్వరలో కొత్త డీఎస్సీ..
-
Varuna Yagam: నాగార్జున సాగర్లో సీఎం రేవంత్ రెడ్డి వరుణ యాగం.. ముహూర్తం ఖరారు..
-
FCRA Bill: ‘మా చట్టాల గురించి మీకెందుకు?’.. అమెరికాకు భారత్ ఘాటు సమాధానం
-
Sarfaraz Khan: నేను ఇమడలేకపోతున్నాను.. కానీ పోరాడతా’.. సర్ఫరాజ్ పోస్ట్ వైరల్.. అసలు అర్థం ఇదేనా?
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!