Israel-Iran War: 17 మంది ఇండియన్స్ ఉన్న ఇజ్రాయెల్ నౌకను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్పై దాడి చేస్తామని ఇరాన్ ప్రకటించిడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతుంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ బిలియనీర్కు చెందిన ఎమ్ఎస్సి ఎరిస్ కంటెయినర్ షిప్ను గల్ఫ్ ఆఫ్ హార్ముజ్ దగ్గర ఇరాన్ నేవీ స్వాధీనం చేసుకుంది. పోర్చుగల్ జెండాతో ప్రయాణిస్తున్న ఈ నౌకలో 25 మంది సిబ్బంది ఉండగా.. వీరిలో 17 మంది భారతీయులు ఉన్నారు. వీరి విడుదల కోసం భారత ప్రభుత్వం ఇరాన్తో ఇప్పటికే సందప్రదింపులు కొనసాగిస్తుంది.
Read Also: Memantha Siddham: సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు నేడు విరామం
Also Read
- New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
- Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
- Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
- Mohammad Kaif: ‘రిటైర్మెంట్ ముచ్చట ముగిసింది.. విమర్శకుల ముక్కు కట్ అయింది’: మహ్మద్ కైఫ్
కాగా, ఇజ్రాయెల్ నౌకను తీసుకెళుతున్నట్లు ఇరాన్ నేవీ ప్రకటించింది. నౌక డెక్పై ఇరాన్ కమాండోలు కూర్చున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇజ్రాయెల్ బిలియనీర్ వ్యాపారవేత్తకు చెందిన జోడియాక్ మారిటైమ్ గ్రూపు ఈ నౌక నిర్వహణ కార్యక్రమాలు చేస్తుంది. అయిత, హెలికాప్టర్ ద్వారా ఇరాన్ నేవీ సిబ్బంది నౌకపై దాడి చేసి లోపలికి ప్రవేశించినట్లు తెలుస్తుంది. హర్మూజ్ జలసంధి వైపు వెళ్తుండగా చివరి సారిగా ఎంఎస్సీ ఎయిరిస్ను గుర్తించారు. ఈ ఘటన తర్వాత ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి దీనిపై స్పందించారు.
Read Also: Ambedkar Jayanti: అంబేడ్కర్ కు నివాళులు ఆర్పించిన సీఎం యోగి ఆదిత్యనాథ్..
ఇరాన్ గార్డ్స్ను ఉగ్రవాదులుగా గుర్తించాలని ప్రపంచ దేశాలను ఇజ్రాయెల్ కోరింది. ఇరాన్లో ప్రస్తుతం క్రిమినల్స్ పాలన కొనసాగుతోంది.. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి పైరేట్ ఆపరేషన్లను ఆ దేశం నిర్వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హమాస్ లాంటి ఉగ్రవాద సంస్థలకు కూడా ఇరాన్ సపోర్ట్ ఇవ్వడంతో మండిపడ్డారు. కాగా, ఇటీవల సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడులు చేయగా.. ఈ దాడిలో ఏడుగురు ఇరాన్ ఆర్మీ ఉన్నతాధికారులు చనిపోయారు. ఈ ఘటనతో ఆగ్రహించిన ఇరాన్, ఇజ్రాయెల్పై దాడులు చేస్తామని చెప్పింది.
తాజావార్తలు
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!