Iran: 17గంటల తర్వాత దొరికిన హెలికాఫ్టర్ శిథిలాలు..ఇరాన్ అధ్యక్షుడి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం కూలిపోయింది. ఘటన జరిగి చాలా గంటలు గడిచిన తర్వాత హెలికాప్టర్ ఆచూకీ లభించినట్లు తెలుస్తోంది. సహాయక బృందం ప్రమాద స్థలానికి చేరుకుందని అధికారులు తెలిపారు. పలు ఇరాన్ మీడియా ఛానెల్లు రైసీ హెలికాప్టర్ శకలాలను రెస్క్యూ టీమ్లు కనుగొన్నాయని చెప్పాయి. అయితే, అధ్యక్షుడు, అతని సహచరులు ప్రాణాలతో బయటపడ్డారా లేదా అనే దానిపై రెడ్ క్రెసెంట్ సమాచారం అందించలేదు. మరో ఇరానీ మీడియా ప్రమాద స్థలంలో ఎవరూ సజీవంగా ఉన్నట్లు ఎటువంటి సంకేతాలు కనుగొనబడలేదని తేల్చింది.
ప్రెసిడెంట్ రైసీతో హెలికాప్టర్లో ఎవరు ఉన్నారు?
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో పాటు హెలికాప్టర్లో విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్, తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ మాలెక్ రహ్మతి, తబ్రిజ్ రాయల్ ఇమామ్ మొహమ్మద్ అలీ అల్హాషెమ్, ఒక పైలట్, సెక్యూరిటీ చీఫ్ , ఒక సెక్యూరిటీ గార్డు కూడా ఉన్నారని ఇరాన్ వార్తా సంస్థ తస్నిమ్ తెలిపింది.
Also Read
- Tilak Varma: "నమ్మకమే నా బలం.." అలా ఆడడం అంటే ఎంతో ఇష్టం..!
- Mumbai Indians Win: తిలక్ వర్మ తుఫాన్ ఇన్నింగ్స్ దెబ్బ.. పంజాబ్ అబ్బా..
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
Read Also:Mexico : మెక్సికోలో చెలరేగిన ఎన్నికల హింస.. 14 మంది మృతి
ప్రమాదం గురించి తదుపరి సమాచారం అందుబాటులో లేదు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో పాటు, ఇరాన్ విదేశాంగ మంత్రి హోస్సేన్ అమీర్-అబ్దుల్లాహియాన్ కూడా కాన్వాయ్ హెలికాప్టర్లో ఉన్నారు. ఇరాన్ అధ్యక్షుడి కాన్వాయ్లో మూడు హెలికాప్టర్లు ఉన్నాయి. వీటిలో రెండు హెలికాప్టర్లు వారి గమ్యస్థానంలో సురక్షితంగా ల్యాండ్ చేయబడ్డాయి. పైలట్ హెలికాప్టర్పై నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదానికి దారితీసింది. సహాయక చర్యల కోసం 16 బృందాలను రంగంలోకి దించారు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63 ఏళ్లు) తూర్పు అజర్బైజాన్కు వెళ్తున్నారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్కు 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న అజర్బైజాన్ సరిహద్దు నగరం జోల్ఫా సమీపంలో ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్తో కలిసి ఆనకట్టను ఆయన ప్రారంభించాల్సి ఉంది. అరస్ నదిపై ఇరు దేశాలు నిర్మించిన మూడో డ్యామ్ ఇది. అధ్యక్షుడి కాన్వాయ్లో తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ కూడా ఉన్నారు.
ఇబ్రహీం రైసీ ఎవరు?
రైసీ ఇరాన్లో మతతత్వ పాలనకు గట్టి మద్దతుదారు. రైసీ ఇరాన్ సుప్రీం అయతుల్లా ఖమేనీకి సన్నిహిత సహచరుడు. అతని వారసుడిగా గుర్తించబడ్డాడు. అతను 1988లో ఖైదీలను సామూహికంగా ఉరితీసినందుకు అమెరికా, ఇతర దేశాల నుండి ఆంక్షలను ఎదుర్కొంటున్నాడు. గతంలో ఇరాన్ న్యాయవ్యవస్థను నడిపాడు. 2021 అధ్యక్ష ఎన్నికల్లో రైసీ తన ప్రత్యర్థులందరినీ దూరం పెట్టి తక్కువ ఓటింగ్తో గెలుపొందడం వివాదాస్పదమైంది. అధికారం చేపట్టినప్పటి నుంచి దేశంలో నైతిక చట్టాలను కఠినతరం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను ఉక్కుపాదంతో అణచివేశారు.
Read Also:Prasanth Varma : రణ్ వీర్ తో సైలెంట్ గా షూటింగ్ మొదలు పెట్టిన ప్రశాంత్ వర్మ..?
తాజావార్తలు
-
Peddi: ‘పెద్ది’ రిలీజ్కు భారీ షాక్..
-
Delhi Work From Home: ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. పొదుపు చర్యల జాబితా విడుదల
-
Jasprit Bumrah: “ఇక మిగిలింది వన్డే కెప్టెన్సీనే.. కానీ!”.. కెప్టెన్గా తొలి విజయంపై జస్ప్రీత్ బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Dragon: నేషనల్ మీడియా సమక్షంలో ‘డ్రాగన్’ ఫస్ట్ గ్లింప్స్ లాంచ్!
-
Tilak Varma: “నమ్మకమే నా బలం..” అలా ఆడడం అంటే ఎంతో ఇష్టం..!
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!