ఆంధ్రప్రదేశ్లో 16 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. సీఐడీ ఐజీగా వినీత్ బ్రిజ్ లాల్, ఐజీ పీఅండ్ ఎల్గా ఎం రవి ప్రకాశ్ బదిలీ అయ్యారు. పీహెచ్డీ రామకృష్ణను ఇంటెలిజెన్స్ ఐజీగా బదిలీ చేశారు. ఫకీరప్పను ఇంటెలిజెన్స్ ఎస్పీ గా బదిలీ చేశారు. ఆర్ ఎన్ అమ్మిరెడ్డికి డీజీపీ కార్యాలయంలో డీఐజీ అడ్మిన్గా పోస్టింగ్ ఇచ్చారు. సీహెచ్ విజయరావుకి రోడ్ సేఫ్టీ అథారిటీగా డీఐజీ పోస్టింగ్ ఇచ్చారు.
READ MORE: Pawan Kalyan: ఉప ముఖ్యమంత్రి పవన్కు వైద్యుల విజ్ఞప్తి
సిద్ధార్ద్ కౌషల్కి శాంతి భద్రతల ఏఐజీగా పోస్టింగ్ ఇచ్చారు. మేరీ ప్రశాంతిని విశాఖ శాంతి భద్రతల డీసీపీ2గా నియమించారు. తుహిన్ సిన్హాను అనకాపల్లి ఎస్పీగా, ఎం.దీపీకను ఏపీఎస్పీ 3 బెటాలియన్ కమాండెంట్గా, జి.రాధికకు ఒంగోలులోని పోలీసు ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపాల్గా పోస్టింగ్ ఇచ్చారు. ఆరిఫ్ హఫీజ్కి ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఎస్పీగా పోస్టింగ్ ఇవ్వగా… కేఎస్ఎస్వీ సుబ్బారెడ్డిని పీటీఓ ఎస్పీగా నియమించారు. బాపూజీ అట్టాడను పోలీసు హెడ్ క్వార్టర్స్లో రిపోర్టు చేయాలని ఆదేశాలిచ్చారు. కే. తిరుమలేశ్వర్ రెడ్డిని ఎన్టీఆర్ కమిషనరేట్లో క్రైమ్ డీసీపీగా, కేవీ శ్రీనివాసరావును పోలీసు హెడ్ క్వార్టర్స్లో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.