KL Rahul-LSG: కెప్టెన్గా అద్భుతం.. లక్నోలోనే రాహుల్!
- 2022లో ఎల్ఎస్జీ లీగ్లోకి ఎంట్రీ
- రాహుల్తో గోయెంకా గొడవ
- రాహుల్ కెప్టెన్సీ సూపర్ అంటున్న జాంటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jonty Rhodes About KL Rahul: 2022లో లక్నో సూపర్ జెయింట్స్కు (ఎల్ఎస్జీ) ప్రాంచైజీ ఇండియన్ ప్రీమియర్ లీగ్లోకి ఎంట్రీ ఇచ్చింది. గత మూడేళ్లుగా కేఎల్ రాహుల్ కెప్టెన్గా ఉన్నాడు. గత రెండేళ్లుగా ప్లేఆఫ్స్కు చేరుకున్న ఎల్ఎస్జీ.. ఈ సీజన్లో లీగ్ స్టేజ్కే పరిమితమైంది. అయితే ఐపీఎల్ 2024లో సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ సందర్భంగా రాహుల్తో ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్ గోయెంకా సీరియస్గా మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దాంతో రాహుల్ను కెప్టెన్సీని నుంచి తప్పించడం ఖాయమని వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల గోయెంకాను రాహుల్ కలవడం, తామంతా ఓ కుటుంబంలా ఉంటామని సంజీవ్ అనడం నెట్టింట ఊహాగానాలకు చెక్ పడింది.
తాజాగా ఎల్ఎస్జీ ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ చేసిన వ్యాఖ్యలను చూస్తే.. లక్నోలోనే రాహుల్ కొనసాగనున్నాడని అర్ధమవుతోంది. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాంటీ రోడ్స్ పలు విషయాలపై అతడు స్పందించాడు. ‘అత్యుత్తమ బ్రాండ్ కలిగిన ఫ్రాంచైజీని నడిపించడం సాధారణ విషయం కాదు. ఎల్ఎస్జీ రెండుసార్లు ప్లేఆఫ్స్కు చేరింది. కేఎల్ రాహుల్ కెప్టెన్సీ, జట్టును నడిపించే విధానం చాలా కాలంపాటు సాగుతుందనడంలో ఎలాటి సందేహం లేదు. రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ కెప్టెన్సీ రికార్డులను చూస్తే వారు ట్రోఫీలను గెలిచారు. ఎల్ఎస్జీ కూడా ఫైనల్కు చేరి ఓ టైటిల్ సాధిస్తే బాగుంటుందనేది మేనేజ్మెంట్ ఆకాంక్ష’ అని ఎల్ఎస్జీ ఫీల్డింగ్ కోచ్ పేర్కొన్నాడు.
Also Read
- Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
- Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..
Also Read: All Time IPL XI: ఆల్టైమ్ ఐపీఎల్ ప్లేయింగ్ ఎలెవన్.. రోహిత్కు దక్కని చోటు! కెప్టెన్గా..
‘ఆరంభంలో ముంబై ఇండియన్స్ ఒక్కసారి కూడా కప్ కొట్టలేదు. విజయాలు సాధించడం అలవాటు చేసుకున్నాక.. ఆ జట్ట వెనుదిరిగి చూడలేదు. లక్నో కూడా అదే పరిస్థితుల్లో ఉంది. కేఎల్ రాహుల్ కెప్టెన్గా అద్భుతమైన పనితీరు కనబరిచాడు. రాహుల్పై అందరికి నమ్మకం ఉంది. ఐపీఎల్ 2025లో కప్ సాధించేందుకే ప్రయత్నిస్తాం’ అని జాంటీ రోడ్స్ చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది చివరలో ఐపీఎల్ 2025 కోసం మెగా వేలం జరగనుంది. అప్పుడు జట్లన్నీ పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
ViewSonic Google TV Series: భారత్లో ViewSonic కొత్త Google TV సిరీస్ లాంచ్.. Android 14, HDR, Dolby Audio
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!