IPL 2025: దమ్ముంటే ప్రతిఒక్కరినీ కాపాడుకోండి.. జైపూర్ స్టేడియానికి బాంబు బెదిరింపులు!
- జైపూర్ స్టేడియానికి బాంబు బెదిరింపులు
- దమ్ముంటే ప్రతిఒక్కరినీ కాపాడుకోండి అంటూమెయిల్
- మెయిల్పై విచారణ చేస్తున్న అధికారులు
- మే 16న పంజాబ్ కింగ్స్తో రాజస్థాన్ మ్యాచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జైపుర్లోని సవాయ్ మాన్సింగ్ క్రికెట్ స్టేడియంకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ‘వీలైతే ప్రతిఒక్కరినీ కాపాడుకోండి’ అంటూ గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో రాజస్థాన్ స్పోర్ట్స్ కౌన్సిల్కు ఓ మెయిల్ వచ్చింది. స్టేడియం అధికారులు వెంటనే జైపుర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ‘ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా మేం జైపుర్ స్టేడియంలో బాంబు పేలుడు నిర్వహిస్తాం. మీకు వీలైతే ప్రతిఒక్కరినీ కాపాడుకోండి’ అంటూ మెయిల్ వచ్చిందని తెలిపారు. దీంతో భద్రతా దళాలు స్టేడియం చుట్టుపక్కల సెక్యూరిటీని కట్టుదిట్టం చేశాయి. మెయిల్పై అధికారులు విచారణ చేస్తున్నారు.
ప్రస్తుతం భారత్లో ఐపీఎల్ 2025 కొనసాగుతోంది. జైపుర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ టీమ్ మ్యాచ్లు ఆడుతోంది. మే 16న పంజాబ్ కింగ్స్తో రాజస్థాన్ తన చివరి లీగ్ మ్యాచ్ను జైపుర్లో ఆడనుంది. బాంబు బెదిరింపుల నేపథ్యంలో ఈ మ్యాచ్కు కట్టుదిట్టమైన భద్రత ఉండనుంది. జైపూర్కు బాంబు బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. గత కొన్ని నెలలుగా జైపూర్కు ఇలాంటి బెదిరింపులు చాలా వచ్చాయి. ఏప్రిల్ 3న జైపూర్ జిల్లా కలెక్టరేట్ను పేల్చివేస్తామని బెదిరింపు వచ్చింది. ఫిబ్రవరి 20న ఎస్ఎంఎస్ మెడికల్ కాలేజీని పిలుస్తామని బెదిరింపులు వచ్చాయి. అక్టోబర్ 4న జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంకు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. వరుస బెదిరింపులు నగర భద్రత గురించి ఆందోళనలను రేకెత్తించాయి.
Also Read
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
Also Read: Rohit Sharma: అంతా చెత్త.. భారత్ కామెంటేటర్లపై రోహిత్ సంచలన వ్యాఖ్యలు!
పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం దాడులు చేసిన సంగతి తెలిసిందే. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో ఉగ్ర స్థావరాలను కుప్పకూల్చింది. ఆపరేషన్ సిందూర్లో దాదాపు 100 మందిని మట్టుబెట్టినట్లు కేంద్రం అధికారికంగా తెలిపింది. ఆపరేషన్ సిందూర్తో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. ఈ సమయంలో పాకిస్థాన్ బెదిరింపులకు పాల్పడుతోంది.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!