IPL 2025: దమ్ముంటే ప్రతిఒక్కరినీ కాపాడుకోండి.. జైపూర్ స్టేడియానికి బాంబు బెదిరింపులు!
- జైపూర్ స్టేడియానికి బాంబు బెదిరింపులు
- దమ్ముంటే ప్రతిఒక్కరినీ కాపాడుకోండి అంటూమెయిల్
- మెయిల్పై విచారణ చేస్తున్న అధికారులు
- మే 16న పంజాబ్ కింగ్స్తో రాజస్థాన్ మ్యాచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జైపుర్లోని సవాయ్ మాన్సింగ్ క్రికెట్ స్టేడియంకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ‘వీలైతే ప్రతిఒక్కరినీ కాపాడుకోండి’ అంటూ గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో రాజస్థాన్ స్పోర్ట్స్ కౌన్సిల్కు ఓ మెయిల్ వచ్చింది. స్టేడియం అధికారులు వెంటనే జైపుర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ‘ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా మేం జైపుర్ స్టేడియంలో బాంబు పేలుడు నిర్వహిస్తాం. మీకు వీలైతే ప్రతిఒక్కరినీ కాపాడుకోండి’ అంటూ మెయిల్ వచ్చిందని తెలిపారు. దీంతో భద్రతా దళాలు స్టేడియం చుట్టుపక్కల సెక్యూరిటీని కట్టుదిట్టం చేశాయి. మెయిల్పై అధికారులు విచారణ చేస్తున్నారు.
ప్రస్తుతం భారత్లో ఐపీఎల్ 2025 కొనసాగుతోంది. జైపుర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ టీమ్ మ్యాచ్లు ఆడుతోంది. మే 16న పంజాబ్ కింగ్స్తో రాజస్థాన్ తన చివరి లీగ్ మ్యాచ్ను జైపుర్లో ఆడనుంది. బాంబు బెదిరింపుల నేపథ్యంలో ఈ మ్యాచ్కు కట్టుదిట్టమైన భద్రత ఉండనుంది. జైపూర్కు బాంబు బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. గత కొన్ని నెలలుగా జైపూర్కు ఇలాంటి బెదిరింపులు చాలా వచ్చాయి. ఏప్రిల్ 3న జైపూర్ జిల్లా కలెక్టరేట్ను పేల్చివేస్తామని బెదిరింపు వచ్చింది. ఫిబ్రవరి 20న ఎస్ఎంఎస్ మెడికల్ కాలేజీని పిలుస్తామని బెదిరింపులు వచ్చాయి. అక్టోబర్ 4న జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంకు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. వరుస బెదిరింపులు నగర భద్రత గురించి ఆందోళనలను రేకెత్తించాయి.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
Also Read: Rohit Sharma: అంతా చెత్త.. భారత్ కామెంటేటర్లపై రోహిత్ సంచలన వ్యాఖ్యలు!
పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం దాడులు చేసిన సంగతి తెలిసిందే. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో ఉగ్ర స్థావరాలను కుప్పకూల్చింది. ఆపరేషన్ సిందూర్లో దాదాపు 100 మందిని మట్టుబెట్టినట్లు కేంద్రం అధికారికంగా తెలిపింది. ఆపరేషన్ సిందూర్తో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. ఈ సమయంలో పాకిస్థాన్ బెదిరింపులకు పాల్పడుతోంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!