TS Governor: గవర్నర్ కు అయోధ్య అక్షింతలు అందజేసిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ తొలి పౌరురాలు తమిళ సై సౌందర రాజన్ కి అయోధ్య రాముల వారి అక్షింతలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు అందజేశారు. జనవరి ఒకటవ తేదీ నుంచి 15వ తారీకు వరకు నిర్వహించే జన సంపర్క అభియాన్ కార్యక్రమాన్ని జనవరి 1న ఇవాళ (సోమవారం) రాష్ట్ర గవర్నర్ చేత ప్రారంభించారు. అయోధ్యలో భవ్యమైన రామ మందిర నిర్మాణంతో వందల ఏళ్ల నాటి హిందువుల కల సహకారమవుతోందనీ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు పేర్కొన్నారు. ప్రపంచంలోని ప్రతి హిందువుకు రాముల వారి అక్షింతలు అందజేసి, మందిర దర్శనానికి ఆహ్వానం పలుకుతున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే తొలిరోజు రాష్ట్ర ప్రథమ పౌరురాలు గవర్నర్ కి సంప్రదాయబద్ధంగా బొట్టుపెట్టి , అక్షింతలు, కుంకుమ, పసుపు, గాజులు అందజేసి రామమందిరా దర్శనానికి ఆహ్వానం పలికినట్లు వివరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. దర్శనానికి తప్పకుండా వస్తానని చెబుతూ.. ఆనందంతో అక్షింతలు స్వీకరించినట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జైశ్రీరామ్ నినాదాలతో రాజ్ భవన్ లో హోరెత్తించారు. రామ లక్ష్మణ జానకి.. జై బోలో హనుమాన్ కి అంటూ ప్రతిగా అక్కడ ఉన్నటువంటి హిందూ బంధువులు అందరూ కూడా నినాదించడం విశేషం.
Read Also: Manchu Manoj: మనోజ్ అన్నా.. మెగా అల్లుడునే దింపావా..?
Also Read
- KKR Vs GT: పక్కా వ్యూహంతో బరిలోకి కోల్కతా నైట్ రైడర్స్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జీటీ..
- MS Dhoni: బిగ్ అప్డేట్.. సన్రైజర్స్తో మ్యాచ్కి ధోనీ ఎంట్రీ..
- Jihadi drug: భారత్లో తొలిసారి పట్టుబడ్డ ‘‘జిహాదీ డ్రగ్’’.. ఇది ఎంత ప్రమాదకరమంటే..
- Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
ఇక, రాజకీయాలకు అతీతంగా ప్రతి హిందువును అయోధ్య రామ జన్మభూమి దర్శనానికి ఆహ్వానిస్తున్నట్లు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు చెప్పారు. జనవరి 15వ తేదీ వరకు కోట్లాదిమంది హిందువులను కలిసి అక్షింతలు అందజేసి అయోధ్యకు ఆహ్వానం పలుకుతున్నామని చెప్పారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన నగరాలతో పాటు ప్రతి గ్రామము, బస్తీ, పల్లె, తండా, గిరిజన ప్రదేశాలకు కూడా రాముడి అక్షింతలు చేరాయని.. వాటిని పంపిణీ ఈ రోజుతో ప్రారంభమైందని ట్రస్ట్ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు, విశ్వహిందూ పరిషత్ బాధ్యులు సురేందర్ రెడ్డితో పాటు పలువురు ఉన్నారు.
తాజావార్తలు
-
KKR Vs GT: పక్కా వ్యూహంతో బరిలోకి కోల్కతా నైట్ రైడర్స్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జీటీ..
-
MS Dhoni: బిగ్ అప్డేట్.. సన్రైజర్స్తో మ్యాచ్కి ధోనీ ఎంట్రీ..
-
Jihadi drug: భారత్లో తొలిసారి పట్టుబడ్డ ‘‘జిహాదీ డ్రగ్’’.. ఇది ఎంత ప్రమాదకరమంటే..
-
Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
-
Peddi: పెద్ది సినిమాలో విక్కీ కౌశల్ తండ్రి?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..