Schools Close: ఢిల్లీలో తీవ్ర ఎండలు.. నోయిడాలో పాఠశాలలు మూసివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు దంచికొడుతున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తుండగా, ఢిల్లీలో మాత్రం ఎండలు ఠారెత్తిస్తున్నాయి. దీంతో.. ఢిల్లీలోని ఎన్సీఆర్లో ఎండ వేడిమికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు.. వేడి, తీవ్రమైన వేడి దృష్ట్యా.. గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో (నోయిడా-గ్రేటర్ నోయిడా) పాఠశాలలను మూసివేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు మూసి ఉంచాలని అధికారులు తెలిపారు.
నోయిడాలో ఇంతకుముందు 8వ తరగతి చదువుకునే విద్యార్థుల వరకు మూసివేయాలని ఆదేశాలు ఉన్నాయి. కానీ ఎండ తీవ్రత దృష్ట్యా 12వ తరగతి వరకు మూసివేయనున్నారు. కాగా.. ఈ ఆర్డర్ అన్ని బోర్డు పాఠశాలలకు వర్తిస్తుందని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా స్కూల్ ఇన్స్పెక్టర్ ధరమ్వీర్ సింగ్ తెలిపారు. అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ ఉత్తర్వును పాటించాలని కోరారు.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
- Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
Bank FD: సీనియర్ సిటిజన్లకు అత్యధిక వడ్డీ రేటు అందిస్తున్న బ్యాంకులేవో తెలుసా?
నోయిడాలోని గౌతమ్బుద్ధ నగర్లో రోజురోజుకూ వేడి పెరుగుతోంది. సోమవారం గరిష్టంగా ఉష్ణోగ్రత 46 డిగ్రీలు దాటింది. అంతేకాకుండా.. రోజంతా వేడిగాలులు వీచాయి. వేడి గాలుల కారణంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4-5 గంటల వరకు ఇళ్ల నుంచి బయటకు వచ్చిన ప్రజలు అవస్థలు పడ్డారు. కాగా.. మే 24 వరకు తీవ్రమైన వేడిగాలులు కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు.. ఉష్ణోగ్రత వరుసగా నాలుగో రోజు 45 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంది. పగటిపూట గంటకు 14 కిలోమీటర్ల వేగంతో గాలి వీచి వేడిని పెంచింది.
ఎండల తీవ్రత దృష్ట్యా.. జిల్లాలో 8వ తరగతి వరకు ఉన్న అన్ని పాఠశాలలను మే 25 వరకు మూసివేయాలని డీఎం ఇందర్ విక్రమ్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతల దృష్ట్యా వేడిగాలులు ప్రబలుతున్నాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎండల దృష్ట్యా పిల్లలలో సమస్యలు తలెత్తవచ్చు. ఈ కారణంగా.. అన్ని పాఠశాలలను 2024 మే 20 నుండి మే 25 వరకు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
- Tags
- closed
- Delhi
- Intense sun
- Noida
- Schools
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!