INDvsAUS 1st Test: రవిశాస్త్రి ఫైనల్ ఎలెవన్ ఇదే..ఓపెనర్లుగా వీరే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి టెస్టు గురవారం (ఫిబ్రవరి 9) నాగ్పూర్ వేదికగా ప్రారంభంకానుంది. ఇప్పటికే ఇరుజట్లు ప్రాక్టీస్లో చెమటోడ్చాయి. భారత గడ్డపై టెస్టు సిరీస్ గెలవాలన్న పట్టుదలతో ఆస్ట్రేలియా ఉండగా.. ఈ సిరీస్ గెలిచి ఛాంపియన్ షిప్ ఫైనల్లో అడుగుపెట్టాలని రోహిత్ సేన భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే రెండు టీమ్స్ టెస్టులో ఆడబోయే ఫైనల్ ఎలెవన్పై దృష్టిపెట్టాయి. 11మంది గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నాయి. ఈ క్రమంలోనే పలువురు మాజీలు కూడా టీమిండియా పైనల్ ఎలెవన్పై వారి మాట చెప్పారు. టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కూడా జట్టు ఇలా ఉంటే బాగుంటుంది అంటూ ఓ టీమ్ను ప్రకటించాడు. ఇందులో ఓపెనర్లుగా రోహిత్తో పాటు గిల్కు చోటిచ్చాడు. బౌలింగ్ విభాగంలో ముగ్గురు స్పిన్నర్లు జడేజా, అశ్విన్, కుల్దీప్లను తీసుకోవాలని సూచించాడు. పేసర్లుగా సిరాజ్, షమీకి ప్లేస్ ఇచ్చాడు. ఇక వికెట్ కీపర్లుగా జట్టులో ఉన్న తెలుగోడు కేఎస్ భరత్తో పాటు ఇషాన్ కిషన్లో ఎవరో ఒకరిని తీసుకోవాలని చెప్పాడు.
రవిశాస్త్రి ఫైనల్ ఎలెవన్
Also Read
- Covid Cases In AP: ఏపీలో ఆగని కరోనా కేసులు.. బాపట్లలో ఒకరికి కరోనా పాజిటివ్..
- CM Chandrababu: ఆర్టీజీఎస్ కేంద్రంలో సీఎం చంద్రబాబు సమీక్ష.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ప్రైవేటీకరణపై కీలక నిర్ణయం..
- Abhijeet Dipke: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే అరెస్ట్..
- India First Dengue Vaccine: శుభవార్త.. భారత్లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్కు ఆమోదం.. ఎవరికి? ఎన్ని డోసులు? పూర్తి వివరాలు
రోహిత్ శర్మ (కెప్టెన్), గిల్/రాహుల్, పుజారా, కోహ్లీ, సూర్యకుమార్, కేఎస్ భరత్/ఇషాన్ కిషన్, జడేజా, అశ్విన్, కుల్దీప్ యాదవ్, సిరాజ్, షమీ
ఇకపోతే. టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ కూడా తన పైనల్ ఎలెవన్ ప్రకటించాడు. కానీ ఇతడి తుది జట్టులో గిల్, కుల్దీప్కు చోటు దక్కకపోవడం గమనార్హం. రోహిత్, రాహుల్లను డీకే ఓపెనర్లుగా ఎంచుకోగా.. మూడు, నాలుగు స్థానాలకు పుజారా, కోహ్లీలను ఎంపిక చేశాడు. ఐదో స్థానంలో శుభ్మన్ గిల్కు బదులుగా సూర్యకుమార్ యాదవ్ని తీసుకున్నాడు. ఆరో బ్యాటర్గా ఇషాన్ కిషన్కు బదులు కేఎస్ భరత్ వైపు మొగ్గుచూపాడు. పిచ్ స్పిన్ అనుకూలంగా ఉంటుందని భావించి ముగ్గురు స్పిన్నర్లకు తన తుది జట్టులో అవకాశం కల్పించాడు డీకే. జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్లను ఎంచుకుని కుల్దీప్ యాదవ్ను పక్కన పెట్టాడు. సిరాజ్, షమీలను పేసర్లుగా తీసుకున్నాడు.
కార్తీక్ ఫైనల్ ఎలెవన్
రోహిత్ శర్మ, పుజారా, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కేఎస్ భరత్, అశ్విన్,అక్షర్ పటేల్, షమి, సిరాజ్.
కాగా.. భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా కూడా తన తుది జట్టుని ప్రకటించాడు. తన జట్టులోనూ గిల్కు చోటు దక్కలేదు.
ఆకాశ్ చోప్రా ఫైనల్ ఎలెవన్
రోహిత్, రాహుల్, పుజారా, కోహ్లీ, గిల్/సూర్యకుమార్, కేఎస్ భరత్/ఇషాన్ కిషన్, జడేజా, అశ్విన్, అక్షర్ పటేల్/కుల్దీప్ యాదవ్, షమీ, సిరాజ్.
Also Read: INDvsAUS Test: తుది జట్టు కూర్పుపై కెప్టెన్ రోహిత్ ఏమన్నాడంటే!
తాజావార్తలు
-
Monalisa: ‘నా జీవితం ప్రమాదంలో ఉంది’.. కుంభమేళా ఫేమ్ మోనాలిసా!
-
Covid Cases In AP: ఏపీలో ఆగని కరోనా కేసులు.. బాపట్లలో ఒకరికి కరోనా పాజిటివ్..
-
NBK సినిమాలో ఐశ్వర్య రాజేశ్? ఇప్పటి వరకు చేయని పాత్రలో క్రేజీ బ్యూటీ!
-
Tollywood : ఏం నమ్మి బడ్జెట్ పెడుతున్నారు ?
-
Rag Mayur : తెలుగు నటుడి సంచలనం.. బెస్ట్ యాక్టర్ అవార్డు గెలిచిన రాగ్ మయూర్!
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!