Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎక్కడపడితే అక్కడ మృగాళ్లు రెక్కలు విప్పుకుని మరీ మీద పడుతున్నారు… రాత్రి సమయంలో ఉద్యోగరీత్యా ఆడవాళ్లు బయటకు వెళ్లాలంటేనే గజగజా వణికిపోతున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కామాంధులు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా మహిళ కనిపిస్తే చాలు.. అఘాయిత్యానికి ఒడిగడుతున్నారు. తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్తుండగా ఓ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవరే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఇప్పుడు సిటీలో హాట్టాపిక్గా మారింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పనిచేస్తున్న ఓ ఇండిగో ఎయిర్లైన్స్ క్యాబిన్ క్రూ ఉద్యోగినిపై ఓ కామాంధుడు తెగబడ్డాడు. ఆమెను ఎయిర్ పోర్టుకు తీసుకు వెళ్లే క్యాబ్ డ్రైవరే అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
ప్రతిరోజూ ఉద్యోగులను డ్యూటీకి తీసుకెళ్లే క్యాబ్ డ్రైవర్పై ఆ ఉద్యోగినికి నమ్మకముంది. కానీ తనపై ఉన్న నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని మహిళను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
- Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
ఇండిగో ఎయిర్లైన్స్లో క్యాబిన్ క్రూగా పనిచేస్తున్న బాధితురాలు జులై 20న మధ్యాహ్నం డ్యూటీ కోసం శంషాబాద్ విమానాశ్రయానికి క్యాబ్లో బయలుదేరింది. క్యాబ్ డ్రైవర్ ఎర్రపోగు ప్రశాంత్ కుమార్ మార్గమధ్యంలో వాహనాన్ని దారి మళ్లించాడు. విమానాశ్రయం సమీపంలోని నిర్మాణంలో ఉన్న సాంక్టా మారియా స్కూల్ వద్ద ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ క్యాబ్ను ఆపిన నిందితుడు “టాయిలెట్కు వెళ్లి వస్తాను” అంటూ కిందకు దిగాడు. అనంతరం వెనుక సీటు వద్దకు వచ్చి బాధితురాలిపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఘటనతో తీవ్ర షాక్కు గురైన బాధితురాలు వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.
బాధితురాలి ఫిర్యాదు అందుకున్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ అవుట్పోస్ట్ పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలు, ఇతర కీలక సమాచారంతో నిందితుడు ప్రశాంత్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు తన నేరాన్ని ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం అతడిని రిమాండ్కు పంపింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు వెంటనే స్పందించి కేసు నమోదు చేశామని, నిందితుడిని వేగంగా అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఈ ఘటనతో శంషాబాద్ విమానాశ్రయం పరిసరాల్లో పనిచేసే మహిళా ఉద్యోగుల భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగుల రవాణా కోసం ఏర్పాటు చేసే క్యాబ్ సేవల్లో భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తాజావార్తలు
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
-
Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!