New EV Policy : త్వరలో ఇండియాలోకి టెస్లా కంపెనీ కార్లు.. మోడీ ప్రభుత్వ కొత్త ఎలక్ట్రిక్ వాహనాల విధానం వర్తిస్తుందా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New EV Policy : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీని ప్రోత్సహించడానికి, ప్రభుత్వం మార్చి 2024లో కొత్త ఈవీ విధానాన్ని ప్రకటించింది. ఇప్పుడు అది త్వరలో మారుతుందని భావిస్తున్నారు. తద్వారా టెస్లా వంటి కంపెనీలు వీలైనంత త్వరగా దేశంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు మార్గం సుగమం కానుంది. ప్రస్తుత విధానం ప్రకారం, ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసే విదేశీ కంపెనీలు మూడేళ్లలో కనీసం రూ.4,150 కోట్ల పెట్టుబడి పెట్టాలి. దీనితో పాటు, దేశం ఎలక్ట్రిక్ వాహనాల దిగుమతిపై రాయితీ కస్టమ్ సుంకం (ప్రస్తుత 110 శాతానికి బదులుగా 15 శాతం) ప్రయోజనాన్ని పొందబోతోంది. ప్లాంట్ ఏర్పాటుకు అనుమతి పొందిన తర్వాత ఐదు సంవత్సరాల పాటు ఈ ప్రయోజనం అందుబాటులో ఉంటుంది.
ప్రభుత్వ విధానాన్ని ఎప్పుడు అమలు చేస్తారు?
అయితే, ప్రభుత్వ ఈ విధానంపై ఆటోమొబైల్ కంపెనీలు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో, దానిని మార్చడం గురించి చర్చ మళ్లీ ప్రారంభమైంది. ఈ మార్పు కింద ఈవీ ప్లాంట్లో ఇప్పటికే చేసిన పెట్టుబడులను పాలసీలో చేర్చడం గురించి చర్చ జరుగుతోంది. గత సంవత్సరం ప్రకటించిన ఈ ప్రభుత్వ విధానాన్ని ఎప్పుడు అమలు చేస్తారు. తద్వారా టెస్లా వంటి కంపెనీలు వీలైనంత త్వరగా దాని ప్రయోజనాలను పొందగలవు. దీనిపై ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి మాట్లాడుతూ, SMEC (ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్ల తయారీని ప్రోత్సహించే పథకం) మార్గదర్శకాలు రెండు వారాల్లో పూర్తవుతాయని.. వచ్చే నెలలో విడుదల అవుతాయని చెప్పారు.
Also Read
- Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
- Trump: క్లైమాక్స్ చేరుకున్న అమెరికా, ఇరాన్ దేశాల ఉద్రిక్తతలు? ఇరాన్కు ట్రంప్ లాస్ట్ వార్నింగ్!
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Astrology: మే 21 గురువారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పూజ చేస్తే మేలు..
Read Also:Maharashtra: మహాయుతిలో ముసలం.. ప్రభుత్వ కార్యక్రమాలకు షిండే దూరం!
ఛార్జింగ్ స్టేషన్ పై పెట్టుబడిపై కూడా తగ్గింపు
ఈ ప్రభుత్వ విధానం ప్రకారం దరఖాస్తు చేసుకునే కంపెనీలు మూడు సంవత్సరాలలోపు దేశంలో తమ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలి. ఆపరేషన్ ప్రారంభించిన ఐదు సంవత్సరాలలోపు 50శాతం స్థానికీకరణ అంటే స్థానిక ఉత్పత్తిని సాధించడం తప్పనిసరి. ఛార్జింగ్ స్టేషన్లతో పాటు తయారీ ప్లాంట్లలో పెట్టుబడులకు మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం పరిశీలిస్తోందని ఒక సీనియర్ అధికారి బిజినెస్ స్టాండర్డ్ తో మాట్లాడుతూ తెలిపారు. దీని అర్థం ఇప్పుడు ఛార్జింగ్ స్టేషన్లపై చేసిన పెట్టుబడి కూడా 500 మిలియన్ డాలర్ల పెట్టుబడి నిబద్ధతలో భాగంగా పరిగణించబడుతుంది.
రాష్ట్ర ప్రభుత్వాలకు రుణం
బడ్జెట్లో ప్రకటించిన రూ.10,000 కోట్ల ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య నిధిని ఛార్జింగ్ స్టేషన్లతో పాటు ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఉపయోగించనున్నారు. దీనితో పాటు, సంబంధిత మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయడానికి రాష్ట్రాలకు వడ్డీ లేకుండా రూ.1.5 లక్షల కోట్ల రుణం ఇవ్వబడుతుంది.
Read Also:IPL 2025: ముంబై ఇండియన్స్ 2025 జెర్సీ విడుదల.. హార్దిక్ భావోద్వేగ సందేశం
తాజావార్తలు
-
Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
-
RBI: లోన్ తిరిగి చెల్లించకపోతే బ్యాంకు మీ మొబైల్ ఫోన్ను లాక్ చేస్తుందా? షాకిస్తున్న ఆర్బిఐ కొత్త ప్రతిపాదన
-
Trump: క్లైమాక్స్ చేరుకున్న అమెరికా, ఇరాన్ దేశాల ఉద్రిక్తతలు? ఇరాన్కు ట్రంప్ లాస్ట్ వార్నింగ్!
-
Brahma Muhurta Dreams: బ్రహ్మ ముహూర్తంలో ఎలాంటి కలలు వస్తే మంచిదో తెలుసా..?
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!