Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime Stories Indias Biggest Robbery Rs 400 Crore Looted At Karnataka Goa Maharashtra Border

Big Robbery: దేశంలోనే భారీ దోపిడి.. రూ.400 కోట్లు కొట్టేసిన దొంగలు

Published Date :January 26, 2026 , 1:53 pm
By Kothuru Ram Kumar
Big Robbery: దేశంలోనే భారీ దోపిడి.. రూ.400 కోట్లు కొట్టేసిన దొంగలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Big Robbery: మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో భారీ దోపిడి జరిగింది. కర్ణాటక, మహారాష్ట్ర, గోవా సరిహద్దు ప్రాంతమైన బోర్లా ఘాట్లో 400 కోట్ల రూపాయలు కొట్టేసారు దోపిడి దొంగలు. డబ్బు తరలిస్తున్న రెండు కంటైనర్లను దోచుకున్నారు దొంగలు. దేశంలో ఇంతవరకు జరిగిన పెద్ద దారి దోపిడిలో ఇదే అతి పెద్దది. నాసిక్ కు చెందిన సందీప్ దత్త పాటీల్ ఇటివల మహారాష్ట్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మహారాష్ట్ర పోలీసుల నుంచి కర్ణాటక పోలీసులకు లేక వచ్చినట్టు బెగావి ఎస్పి రామరాజన్ తెలిపారు.

దోపిడి జరిగి కూడా మూడు నెలలకు పైగా గడిచిపోయింది. కానీ ఇప్పుడు హడావిడి చేస్తున్నారు పోలీసులు. గత ఏడాది అక్టోబర్ 16న తను కిడ్నాప్ చేసినట్టు మహారాష్ట్రలోని నాసిక్ పరిదిలో గల ఘోటి పోలీసులకు సందీప్ దత్త ఫిర్యాదు చేశాడు. విరాట్ గాంధీ ఆదేశాలతో విశాల్ నాయుడు మరికొందరు తనను కిడ్నాప్ చేసినట్టుగా చెప్పాడు. దీంతో నాసిక్ లో కేసు నమోదయింది. అయితే ఆలస్యంగా జనవరి 6న నాసిక్ ఎస్పీ నుంచి బెళగావి ఎస్పీ కి ఒక లేఖ వచ్చింది. దాని ద్వారానే భారీ నగదు దోపిడి అంశం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు ప్రత్యేక బృందాన్ని నాసిక్ కు పంపించారు బెళగావి పోలీసులు.

Abhishek Sharma: అదేం బ్యాటింగ్‌రా సామీ.. 10 బంతుల్లోనే 50 రన్స్ చేస్తాడు!

ఇక ఫిర్యాదు అందిన తర్వాత కేస్ నమోదు చేసిన మహారాష్ట్ర పోలీసులు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు మూడు నెలలు గడిచిన దర్యాప్తులో పురోగతి సాధించలేకపోయినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే కర్ణాటక పోలీసులు సాయం కోరుతూ లేఖ రాశారు. అయితే డబ్బు ఎవరిది..? కంటైనర్లో ఎక్కడి నుంచి ఎక్కడికి తర్లిస్తున్నారు..? వంటి వివరాలు మాత్రం కర్ణాటక పోలీసులకు ఇవ్వలేదు. దోపిడి జరిగినట్టు చెప్తున్నది గోవా మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు ప్రాంతం. అందువల్ల మూడు రాష్ట్రాల పోలీసులు సంయుక్తంగా తనికి చేయాల్సి ఉంది.

గోవా నుంచి బెళగావి మీదుగా మహారాష్ట్రకు నగదు రవాణ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నగదు ముంబై తానేలకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కిషోర్ శెట్టికి చెందిందా ప్రచారం జరుగుతోంది. మరొకవైపు గోవాకు చెందినటువంటి బాలాజీ ట్రస్ట్ అనే ధార్మిక సంస్థకు చెందిందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో జయేష్ కదం, విశాల్ నాయుడు, సునీల్ దమాల్, విరాట్ గాంధీ, జనార్ధన్ తాయిగుడెను నిందితులుగా నాసిక్ పోలీసులు గుర్తించారు. ఇటివల విరాట్ గాంధీని అరెస్ట్ చేసినట్టుగా బెళగా పోలీసులకు నాసిక్ పోలీసులు సమాచారం ఇచ్చారు.

Journalist Accreditation Rules: జర్నలిస్టుల అక్రిడిటేషన్ నిబంధనల్లో కీలక మార్పులు.. మహిళలకు 33% రిజర్వేషన్!

అయితే ఈ కేసులో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దోపిడికి గురైన సొమ్ము నిజంగా 400 కోట్లు కాదో స్పష్టత లేదు. కానీ ఈ దోపిడి బెవి జిల్లా పరిధిలో జరిగినట్టు నిర్ధారణ కావడం వల్ల ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తామంటున్నారు కర్ణాటక పోలీసులు. మహారాష్ట్ర పోలీసులకు సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు బెవఎస్పీ. దోపిడికి గురైన డబ్బు 2000 రూపాయల నోట్ల రూపంలో ఉందని తెలుస్తుంది. రద్దైన నోట్లే అయితే అవి చెల్లవు కనుక కేసు ఉండదని కొందరు చెప్తున్నారు. అయితే దీని వెనుక రాజకీయ ప్రమేయం ఉండొచ్చని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 400 crore robbery
  • Belagavi police investigation
  • Big Robbery
  • biggest robbery in India
  • Borla Ghat loot

తాజావార్తలు

  • PBKS vs GT : గుజరాత్‌పై పంజాబ్ కింగ్స్ ఘనవిజయం.. అరంగేట్రంలోనే అదరగొట్టిన కూపర్ కానోలీ.!

  • Oracle Layoffs Hit India: ఒరాకిల్‌లో భారీ లేఆఫ్స్‌.. భారత్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు బిగ్‌ షాక్..

  • CM Revanth Reddy : మానవత్వానికి పట్టాభిషేకం.. ట్యాంక్ బండ్ శివ కుటుంబానికి సీఎం భారీ భరోసా.!

  • Off The Record: వివాదాస్పదంగా బెందాళం అశోక్ తీరు.. గిరిజనులనుద్దేశించి నోటి దురద మాటలు..

  • Chery Fulwin T9L: చెరీ ఫుల్‌విన్ T9L హైబ్రిడ్ SUV లాంచ్.. 2000KM రేంజ్‌తో గేమ్ చేంజర్!

ట్రెండింగ్‌

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • పచ్చిమిర్చి కోశాక చేతులు మండుతున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం.!

  • 13000mAh భారీ బ్యాటరీ, 13.2 అంగుళాల 4K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ‘vivo Pad6 Pro’ విడుదల!

  • Lava సంచలనం.. రూ. 7,999లకే 50MP కెమెరా, IP54 రేటింగ్ తో ‘Bold N2 Pro’ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions