Paris Olympics 2024: క్వార్టర్ ఫైనల్కు భారత మహిళల ఆర్చరీ జట్టు..
- క్వార్టర్ ఫైనల్కు భారత మహిళల ఆర్చరీ జట్టు
- భజన కౌర్.. దీపిక కుమారిలతో పాటు అంకిత భకత్ అద్భుత ప్రదర్శన
- 1983 పాయింట్లు సాధించిన ముగ్గురు ఆర్చర్లు కలిసి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత మహిళల ఆర్చరీ జట్టు శుభారంభాన్ని అందించింది. దీంతో.. క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. భజన కౌర్, దీపిక కుమారిలతో పాటు అంకిత భకత్ అద్భుత ప్రదర్శన చేయడంతో భారత్ టాప్-4లో నిలిచింది. ఈ ముగ్గురు ఆర్చర్లు కలిసి 1983 పాయింట్లు సాధించారు. అంకిత భకత్ (666) పాయింట్లు చేసింది. భజన్ కౌర్ (659), దీపికా కుమారి (658) పాయింట్లు సాధించింది. వ్యక్తిగత విభాగంలో అంకిత తృటిలో టాప్-10లో చోటు దక్కించుకోలేకపోయింది.
Read Also: Africa: ఆఫ్రికాలో బోటు బోల్తా.. 15 మంది మృతి.. డజన్ల కొద్దీ గల్లంతు
Also Read
- Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
- Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్లోనే యువతి హత్య
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్పై సర్వత్రా ఆసక్తి
మహిళల జట్టు క్వార్టర్ ఫైనల్లో భారత్ గెలిస్తే.. సెమీ ఫైనల్లో దక్షిణ కొరియాతో తలపడవచ్చు. క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ లేదా నెదర్లాండ్స్తో ఢీకొనే అవకాశం ఉంది. అయితే అసలు పోరు మాత్రం సెమీ ఫైనల్లోనే జరగనుంది. ఒకవేళ భారత జట్టు సెమీఫైనల్కు చేరితే దక్షిణ కొరియాతో తలపడనుంది. దక్షిణ కొరియా ఒలింపిక్ చరిత్రలో ఆర్చరీలో 27 బంగారు పతకాలు సాధించింది. ఇతర దేశాల కంటే 13 ఎక్కువ. మూడేళ్ల క్రితం టోక్యోలో వరుసగా తొమ్మిదో పతకాన్ని సాధించిన కొరియా జట్టు ఒలింపిక్స్లో అజేయంగా నిలిచింది.
Read Also: Vishnu Kumar Raju: 95 శాతం ఎమ్మెల్యేలపై తప్పుడు కేసులు.. అక్రమ కేసులపై హోంమంత్రి సమీక్ష చేయాలి..
టీమ్ ర్యాంకింగ్స్లో 1983 పాయింట్లతో భారత్ నాల్గవ స్థానంలో నిలిచింది. దక్షిణ కొరియా 2046 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. చైనా రన్నరప్గా నిలవగా, మెక్సికో మూడో స్థానంలో నిలిచింది. టీమ్ టేబుల్లో అగ్రస్థానంలో నిలిచిన నాలుగు జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్కు అర్హత సాధిస్తుండగా.. ఐదు నుంచి 12వ ర్యాంక్లో ఉన్న జట్లు రౌండ్ ఆఫ్ 16లో ఆడతాయి. ఫ్రాన్స్, నెదర్లాండ్స్ మధ్య జరిగే మ్యాచ్లో విజేతతో భారత్ క్వార్టర్స్లో తలపడనుంది.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!