Paris Olympics 2024: క్వార్టర్ ఫైనల్కు భారత మహిళల ఆర్చరీ జట్టు..
- క్వార్టర్ ఫైనల్కు భారత మహిళల ఆర్చరీ జట్టు
- భజన కౌర్.. దీపిక కుమారిలతో పాటు అంకిత భకత్ అద్భుత ప్రదర్శన
- 1983 పాయింట్లు సాధించిన ముగ్గురు ఆర్చర్లు కలిసి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత మహిళల ఆర్చరీ జట్టు శుభారంభాన్ని అందించింది. దీంతో.. క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. భజన కౌర్, దీపిక కుమారిలతో పాటు అంకిత భకత్ అద్భుత ప్రదర్శన చేయడంతో భారత్ టాప్-4లో నిలిచింది. ఈ ముగ్గురు ఆర్చర్లు కలిసి 1983 పాయింట్లు సాధించారు. అంకిత భకత్ (666) పాయింట్లు చేసింది. భజన్ కౌర్ (659), దీపికా కుమారి (658) పాయింట్లు సాధించింది. వ్యక్తిగత విభాగంలో అంకిత తృటిలో టాప్-10లో చోటు దక్కించుకోలేకపోయింది.
Read Also: Africa: ఆఫ్రికాలో బోటు బోల్తా.. 15 మంది మృతి.. డజన్ల కొద్దీ గల్లంతు
Also Read
- Bengaluru: కన్నడ నటి ఇంట్లో వ్యాపారవేత్త మృతి.. మిస్టరీగా మారిన కేసు
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
- Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
మహిళల జట్టు క్వార్టర్ ఫైనల్లో భారత్ గెలిస్తే.. సెమీ ఫైనల్లో దక్షిణ కొరియాతో తలపడవచ్చు. క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ లేదా నెదర్లాండ్స్తో ఢీకొనే అవకాశం ఉంది. అయితే అసలు పోరు మాత్రం సెమీ ఫైనల్లోనే జరగనుంది. ఒకవేళ భారత జట్టు సెమీఫైనల్కు చేరితే దక్షిణ కొరియాతో తలపడనుంది. దక్షిణ కొరియా ఒలింపిక్ చరిత్రలో ఆర్చరీలో 27 బంగారు పతకాలు సాధించింది. ఇతర దేశాల కంటే 13 ఎక్కువ. మూడేళ్ల క్రితం టోక్యోలో వరుసగా తొమ్మిదో పతకాన్ని సాధించిన కొరియా జట్టు ఒలింపిక్స్లో అజేయంగా నిలిచింది.
Read Also: Vishnu Kumar Raju: 95 శాతం ఎమ్మెల్యేలపై తప్పుడు కేసులు.. అక్రమ కేసులపై హోంమంత్రి సమీక్ష చేయాలి..
టీమ్ ర్యాంకింగ్స్లో 1983 పాయింట్లతో భారత్ నాల్గవ స్థానంలో నిలిచింది. దక్షిణ కొరియా 2046 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. చైనా రన్నరప్గా నిలవగా, మెక్సికో మూడో స్థానంలో నిలిచింది. టీమ్ టేబుల్లో అగ్రస్థానంలో నిలిచిన నాలుగు జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్కు అర్హత సాధిస్తుండగా.. ఐదు నుంచి 12వ ర్యాంక్లో ఉన్న జట్లు రౌండ్ ఆఫ్ 16లో ఆడతాయి. ఫ్రాన్స్, నెదర్లాండ్స్ మధ్య జరిగే మ్యాచ్లో విజేతతో భారత్ క్వార్టర్స్లో తలపడనుంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
-
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
-
NRI: అంతిమ శ్వాస భారత్లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!