Site icon NTV Telugu

Indian Railways : రైలులో ప్రయాణించేటప్పుడు ఎంత మద్యం తీసుకెళ్లవచ్చు ?

Railway

Railway

Indian Railways : రైలులో ప్రయాణించే వారు తప్పని సరిగా రైల్వే నిబంధనలు పాటించాలి. కొంతమంది ప్రయాణికులు మద్యం సేవించి రైలులో ప్రయాణించడం… లేదా కొన్నిసార్లు ప్రయాణికులు రైలులో తమతో పాటు మద్యం తీసుకొని ప్రయాణించడం చాలాసార్లు కనిపిస్తుంది. రైలులో మద్యం తీసుకెళ్లడానికి నియమాలు ఉంటాయి ? అసలు రైలులో మద్యం తీసుకోవచ్చా?

Read Also:Karnataka Election Results Live Updates: పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపులో కాంగ్రెస్ ఆధిక్యం

రైలులో మద్యం తీసుకువెళ్లడం అనేది సదరు వ్యక్తి ప్రయాణించే రాష్ట్రంపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే అన్ని రాష్ట్రాలకు మద్యానికి సంబంధించి వారి స్వంత నియమాలు ఉన్నాయి. రైలు, మెట్రో లేదా బస్సు వంటి ఏ రవాణా సౌకర్యాల ద్వారా మద్యం ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి తీసుకురాబడదు. రైలులో మద్యం తీసుకెళ్లడం పూర్తిగా నిషిద్ధమని ఉత్తర రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (CPRO) దీపక్ కుమార్ చెప్పారు. ఎవరైనా రైలులో మద్యం సేవించి ప్రయాణిస్తే, వారిపై రైల్వే శాఖ కఠిన చర్యలు తీసుకుంటుంది. భారతీయ రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 165 ప్రకారం ఈ వ్యక్తులపై చర్య తీసుకోబడుతుంది. ఇది కాకుండా, రైలులో ఏదైనా ఇతర నిషేధిత వస్తువుతో ఎవరైనా కనిపిస్తే, అతనికి రూ. 500 జరిమానా కూడా విధించవచ్చు. మరోవైపు.. ఈ వస్తువు వల్ల ఏదైనా నష్టం జరిగితే, ఆ వ్యక్తి దానిని కూడా భర్తీ చేయాల్సి ఉంటుంది.

Read Also:Karnataka Election Results: కర్ణాటక ఎన్నికల కౌంటింగ్‌ షురూ.. ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ

ప్రస్తుతం దేశంలో బీహార్, గుజరాత్ వంటి అనేక మద్యపాన నిషేద రాష్ట్రాలు ఉన్నాయి. ఇక్కడ మద్యంతో పట్టుబడితే న్యాయపరమైన చిక్కుల్లో పడవచ్చు. ఇది కాకుండా, మద్యం బాటిల్ తెరిచి ఉంటే.. ఆ సందర్భంలో కూడా రైల్వే జరిమానా విధించవచ్చు. ఇది కాకుండా, రైలు ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి వెళుతున్నట్లయితే అది మద్యంకు సంబంధించి పన్ను ఎగవేత కేసు కూడా కావచ్చు. అటువంటి పరిస్థితిలో నేరస్థుడిని పోలీసులకు అప్పగిస్తారు. ఆ తర్వాత ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటుంది.

Exit mobile version