IRCTC: ట్రైన్ టికెట్ కు డబ్బులు లేకపోయినా.. జీరో పేమెంట్తో ఇలా బుక్ చేసుకోవచ్చు!
- ప్రయాణికులకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్
- బుక్ నౌ, పే లేటర్ అనే సర్వీస్ ను ప్రారంభించింది
- జీరో పేమెంట్తో టికెట్ ఇలా బుక్ చేసుకోవచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సామాన్యుడి విమానంగా పేరుగాంచిన ట్రైన్ జర్నీకి విశేషమైన ఆదరణ ఉంటుంది. తక్కువ ప్రయాణ ఛార్జీలు, సమయం ఆదా అవుతుండడంతో రైలు ప్రయాణానికే మొగ్గు చూపుతుంటారు. ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించేందుకు భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు మరో కొత్త సర్వీస్ ను ప్రారంభించింది. బుక్ నౌ, పే లేటర్ అనే సర్వీస్ ను ప్రారంభించింది. ఈ సేవతో మీరు డబ్బులు లేకపోయినా టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఒక్క రూపాయి చెల్లించకుండానే జీరో పేమెంట్ తో ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు.
అయితే ప్రయాణికులు బుకింగ్ చేసుకున్న కొన్ని రోజుల తర్వాత అంటే 14 రోజులలోపు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అదనంగా ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. బుక్ నౌ, పే లేటర్ సదుపాయంతో ఇకపై మీరు ఎక్కడికైనా ప్రయాణించాలనుకున్నప్పుడు, టికెట్ బుక్ చేసుకునేందుకు తగినంత డబ్బు లేకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న ప్రయాణికులకు మాత్రమే ఈ సౌకర్యం లభిస్తుంది.
Also Read
- UP Encounter: సూర్య హత్య, అసద్ ఎన్కౌంటర్.. యోగి సర్కార్పై ఎస్పీ విమర్శలు..
- Vaibhav Sooryavanshi: భవిష్యత్ అంతా వైభవ్దే.. వరల్డ్ కప్లో సూర్యవంశీకి చోటు..
- RCB Vs GT: నిప్పలు చెరుగుతున్న బెంగళూరు బౌలర్లు.. పెవిలియన్కు చేరిన ఓపెనర్స్..
- RCB vs GT Final: గుజరాత్ బ్యాటింగ్.. బెంగళూరు బౌలింగ్.. గుజరాత్ టీంలో కీలక మార్పులు..
టికెట్ ఇలా బుక్ చేసుకోవచ్చు..
టిక్కెట్ను బుక్ చేసుకోవడానికి, ముందుగా IRCTC యాప్ లేదా సైట్కి వెళ్లి లాగిన్ కావాలి. బుక్ నౌ అనే ఆప్షన్ అక్కడ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసిన తర్వాత, కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు సంబంధించిన వివరాలను, క్యాప్చా కోడ్ను ఎంటర్ చేయాలి. దీని తర్వాత పేమెంట్ పేజీ ఓపెన్ అవుతుంది. దీనిలో క్రెడిట్, డెబిట్, BHIM యాప్, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపు చేసి టిక్కెట్ను బుక్ చేసుకోవచ్చు.
పే లేటర్ ఫీచర్ ను యూజ్ చేసుకోవాలనుకునే కస్టమర్లు ముందు ఈ పేలేటర్ ప్లాట్ ఫామ్ లో రిజిస్టర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న వారికి మాత్రమే పేమెంట్ ఆప్షన్ పేజీలో పే లేటర్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇలా జీరో పేమెంట్ తో టికెట్ బుక్ చేసుకున్న వ్యక్తి 14 రోజుల్లో డబ్బులు చెల్లించాలి. లేకపోతే 3.5 శాతం సర్వీస్ ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
UP Encounter: సూర్య హత్య, అసద్ ఎన్కౌంటర్.. యోగి సర్కార్పై ఎస్పీ విమర్శలు..
-
Viral News: 10 మంది అక్కాచెల్లెళ్ల పెళ్లిళ్ల కోసం తమ్ముడు ఏం చేశాడో తెలిస్తే సెల్యూట్ చేస్తారు..!
-
Vaibhav Sooryavanshi: భవిష్యత్ అంతా వైభవ్దే.. వరల్డ్ కప్లో సూర్యవంశీకి చోటు..
-
Indian Navy Recruitment 2026: భారత నావికాదళంలో బీటెక్ క్యాడెట్ ఎంట్రీకి దరఖాస్తులు.. అర్హత, ఎంపిక వివరాలు ఇవే
-
Gopichand 34 : పట్టాలెక్కిన గోపీచంద్ 34వ మూవీ… షూటింగ్ అప్డేట్
ట్రెండింగ్
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!