Site icon NTV Telugu

Indian Railways: రైల్వే టికెట్‌ ఛార్జీల పెంపు.. ఎంతంటే..?

Indian Railways

Indian Railways

ఇండియన్ రైల్వేస్ షాకింగ్ న్యూస్ చెప్పింది. ఏసీ, నాన్ ఏసీ మెయిల్, ఎక్స్‌ప్రెస్ సహా సుదూర రైళ్ల ఛార్జీలను పెంచింది. వివిధ కేటగిరీల రైళ్లలో ధరలు పెరిగాయి. మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల ఛార్జీలు కిలోమీటరుకు 1 పైసా చొప్పున పెరగనుండగా.. ఏసీ కేటగిరీ ఛార్జీలు కిలోమీటరుకు 2 పైసలు పెరుగుతాయి. ఈ కొత్త మార్పు జూలై 1, 2025 నుంచి అమల్లోకి వస్తుంది. సబర్బన్, సీజన్ రైలు టిక్కెట్లలో ఎటువంటి మార్పు ఉండదు. 500 కిలోమీటర్ల వరకు సెకండ్‌ క్లాస్‌ ప్రయాణానికి ఈ పెంపు వర్తించదు. 500ల కి.మి దాటితేనే పెరుగుదల వర్తిస్తుంది.

READ MORE: Donald Trump: తొలిసారి మిత్ర దేశం ఇజ్రాయెల్‌కు వార్నింగ్ ఇచ్చిన ట్రంప్..

ఉదాహరణకు… ప్రస్తుతం ఢిల్లీ నుంచి పాట్నాకు రాజధాని రైలు ఛార్జీ రూ.2485 కాగా, ఏప్రిల్ 1 నుంచి ఇది రూ.2505కి పెరుగుతుంది. అంటే కిలోమీటరుకు 2 పైసలు పెరిగింది. ఢిల్లీ నుంచి పాట్నాకు దూరం దాదాపు 1000 కిలోమీటర్లు. అదేవిధంగా.. ఢిల్లీ – పాట్నా మధ్య నడుస్తున్న సంపూర్ణ క్రాంతి ఎక్స్‌ప్రెస్ 3A ఛార్జీ ప్రస్తుతం రూ.1350 ఉండగా, జూలై 1 నుంచి దాదాపు రూ.20 పెరుగుతుంది. అంటే.. ఛార్జీ రూ.1370కి పెరుగుతుంది. అదే సమయంలో.. ఢిల్లీ-పాట్నా స్లీపర్ క్లాస్ ఛార్జీ ప్రస్తుతం రూ.510గా ఉంది. ఇది 10 రూపాయలు పెరుగి రూ. 520కి చేరుతుంది.

READ MORE: DGCA : దేశంలోని ప్రధాన ఎయిర్ పోర్టుల్లో ‘సర్వేలెన్స్’..

Exit mobile version