Indian-Origin Family: యూఎస్లో భారత సంతతికి చెందిన సంపన్న కుటుంబం అనుమానాస్పద మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian-Origin Family: అమెరికాలో భారత సంతతికి చెందిన సంపన్న కుటుంబం అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోయింది. వారి మరణాలపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అమెరికాలో మసాచుసెట్స్లో వారి విలాసవంతమైన భవనంలో భారతీయ సంతతికి చెందిన సంపన్న దంపతులు, వారి కుమార్తె చనిపోయినట్లు మీడియా నివేదికలు తెలిపాయి. రాకేష్ కమల్(57), అతని భార్య టీనా(54), వారి 18 ఏళ్ల కుమార్తె అరియానా మృతదేహాలు వారి డోవర్ మాన్షన్లో రాత్రి 7:30 గంటలకు కనుగొనబడ్డాయని గురువారం నార్ఫోక్ డిస్ట్రిక్ట్ అటార్నీ (DA) మైఖేల్ మోరిస్సే చెప్పారు. డోవర్ మసాచుసెట్స్ రాజధాని బోస్టన్ డౌన్టౌన్కు నైరుతి దిశలో 32 కిలోమీటర్ల దూరంలో ఉంది.
Read Also: Truck Rams into Tea Shop: టీ దుకాణంలోకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఐదుగురు దుర్మరణం
Also Read
2 రోజులుగా వారి ఇంటి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఒక బంధువు పోలీసులకు సమాచారం అందించగా.. ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రాకేశ్ కమల్ మృతదేహం వద్ద తుపాకీ కనిపించిందని అధికారులు వెల్లడించారు. ఈ సంఘటనను హత్య-ఆత్మహత్యగా పేర్కొనాలా వద్దా అని నిర్ణయించే ముందు, వైద్య పరీక్షల రిపోర్టుల కోసం వేచి ఉన్నామని మైఖేల్ మోరిస్సే చెప్పారు. హత్యలకు గల కారణాలపై ఊహాగానాలు చేసేందుకు జిల్లా నిరాకరించారు. ఈ జంట ఇటీవలి సంవత్సరాలలో ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నట్లు ఆన్లైన్ రికార్డులు చూపిస్తున్నాయి.
Read Also: Sai Pallavi: బీచ్ వ్యూని ఎంజాయ్ చేస్తున్న సాయి పల్లవి.. ఫుల్ ఖుష్లో ఫ్యాన్స్
ఈ దంపతులు 2016లో ఎడ్యునోవా పేరిట విద్యారంగానికి చెందిన ఓ సంస్థను ప్రారంభించారు. అయితే 2021లో దాని కార్యకలాపాలు నిలిచిపోయాయి. టీనా కమల్ ఎడ్యునోవా వెబ్సైట్లో కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా విధులు నిర్వహించినట్లు తెలిసింది. ఆమె హార్వర్డ్ విశ్వవిద్యాలయం, ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి పట్టాలు పొందింది. ఎడ్యునోవా వెబ్సైట్ ప్రకారం రాకేశ్.. బోస్టన్ విశ్వవిద్యాలయం, ఎంఐటీ సోలన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయాల నుంచి పట్టాలు పొందారు. హార్వర్డ్ పూర్వ విద్యార్థి అయిన టీనా.. మసాచుసెట్స్లోని అమెరికన్ రెడ్క్రాస్కు డైరెక్టర్ల బోర్డులో ఒకరిగా ఉన్నారు. ఆమె ఆన్లైన్ బయో ఆమె విద్య, సాంకేతిక పరిశ్రమలలో మూడు దశాబ్దాలకు పైగా పనిచేస్తున్నట్లు తెలిసింది.
ఆ దంపతులు నివసించే 11 పడక గదుల విలాసవంతమైన భవనం విలువ 5 మిలియన్ డాలర్లుగా ఉంటుందని తెలుస్తోంది. 19వేల చదరపు అడుగుల వైశాల్యంలో ఉన్న ఆ భవంతిని 2019లో ఆ దంపతులు కొనుగోలు చేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వారి ఆస్తులు కొన్ని జప్తు అయినట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
తాజావార్తలు
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
-
Srinivasa Mangapuram Trailer: మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ట్రైలర్తోనే అంచనాలు పెంచేసిన జై కృష్ణ!
-
Tirupati Drugs Case : తిరుపతి డ్రగ్స్ కేసులో టీటీడీ ఉద్యోగి అరెస్ట్..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..