Indian-Origin Family: యూఎస్లో భారత సంతతికి చెందిన సంపన్న కుటుంబం అనుమానాస్పద మృతి
Indian-Origin Family: అమెరికాలో భారత సంతతికి చెందిన సంపన్న కుటుంబం అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోయింది. వారి మరణాలపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అమెరికాలో మసాచుసెట్స్లో వారి విలాసవంతమైన భవనంలో భారతీయ సంతతికి చెందిన సంపన్న దంపతులు, వారి కుమార్తె చనిపోయినట్లు మీడియా నివేదికలు తెలిపాయి. రాకేష్ కమల్(57), అతని భార్య టీనా(54), వారి 18 ఏళ్ల కుమార్తె అరియానా మృతదేహాలు వారి డోవర్ మాన్షన్లో రాత్రి 7:30 గంటలకు కనుగొనబడ్డాయని గురువారం నార్ఫోక్ డిస్ట్రిక్ట్ అటార్నీ (DA) మైఖేల్ మోరిస్సే చెప్పారు. డోవర్ మసాచుసెట్స్ రాజధాని బోస్టన్ డౌన్టౌన్కు నైరుతి దిశలో 32 కిలోమీటర్ల దూరంలో ఉంది.
Read Also: Truck Rams into Tea Shop: టీ దుకాణంలోకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఐదుగురు దుర్మరణం
2 రోజులుగా వారి ఇంటి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఒక బంధువు పోలీసులకు సమాచారం అందించగా.. ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రాకేశ్ కమల్ మృతదేహం వద్ద తుపాకీ కనిపించిందని అధికారులు వెల్లడించారు. ఈ సంఘటనను హత్య-ఆత్మహత్యగా పేర్కొనాలా వద్దా అని నిర్ణయించే ముందు, వైద్య పరీక్షల రిపోర్టుల కోసం వేచి ఉన్నామని మైఖేల్ మోరిస్సే చెప్పారు. హత్యలకు గల కారణాలపై ఊహాగానాలు చేసేందుకు జిల్లా నిరాకరించారు. ఈ జంట ఇటీవలి సంవత్సరాలలో ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నట్లు ఆన్లైన్ రికార్డులు చూపిస్తున్నాయి.
Read Also: Sai Pallavi: బీచ్ వ్యూని ఎంజాయ్ చేస్తున్న సాయి పల్లవి.. ఫుల్ ఖుష్లో ఫ్యాన్స్
ఈ దంపతులు 2016లో ఎడ్యునోవా పేరిట విద్యారంగానికి చెందిన ఓ సంస్థను ప్రారంభించారు. అయితే 2021లో దాని కార్యకలాపాలు నిలిచిపోయాయి. టీనా కమల్ ఎడ్యునోవా వెబ్సైట్లో కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా విధులు నిర్వహించినట్లు తెలిసింది. ఆమె హార్వర్డ్ విశ్వవిద్యాలయం, ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి పట్టాలు పొందింది. ఎడ్యునోవా వెబ్సైట్ ప్రకారం రాకేశ్.. బోస్టన్ విశ్వవిద్యాలయం, ఎంఐటీ సోలన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయాల నుంచి పట్టాలు పొందారు. హార్వర్డ్ పూర్వ విద్యార్థి అయిన టీనా.. మసాచుసెట్స్లోని అమెరికన్ రెడ్క్రాస్కు డైరెక్టర్ల బోర్డులో ఒకరిగా ఉన్నారు. ఆమె ఆన్లైన్ బయో ఆమె విద్య, సాంకేతిక పరిశ్రమలలో మూడు దశాబ్దాలకు పైగా పనిచేస్తున్నట్లు తెలిసింది.
ఆ దంపతులు నివసించే 11 పడక గదుల విలాసవంతమైన భవనం విలువ 5 మిలియన్ డాలర్లుగా ఉంటుందని తెలుస్తోంది. 19వేల చదరపు అడుగుల వైశాల్యంలో ఉన్న ఆ భవంతిని 2019లో ఆ దంపతులు కొనుగోలు చేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వారి ఆస్తులు కొన్ని జప్తు అయినట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
తాజావార్తలు
-
Shobha Karandlaje: ఏప్రిల్ 17 భారత మహిళలకు బ్లాక్ డే.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Silver Purity: పాపం తెలుసా.. వెండి కొంటున్న ప్రతి ముగ్గురిలో ఒకరు మోసపోతున్నారంట! ఎలాగో తెలుసా?
-
IPL Record: ఐపీఎల్ కింగ్ కోహ్లీ కాదు.. ఎవరో తెలుసా? విస్తుపోయే గణాంకాలు..
-
Chanakya Niti: విలువల ముసుగులో మోసపోకండి! ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో నేర్పిస్తున్న చాణక్య నీతి
-
Prashanth Neel 418: మైత్రీ – ప్రశాంత్ నీల్ ‘418’ టైటిల్ పోస్టర్ రిలీజ్ ..
ట్రెండింగ్
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?
-
Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!