Russia Ukraine Conflict: రష్యా సైన్యం తరపున పోరాడుతూ.. ఉక్రెయిన్ దళాలకు పట్టుబడ్డ భారతీయుడు..
- రష్యా సైన్యం తరపున పోరాడుతూ
- ఉక్రెయిన్ దళాలకు పట్టుబడ్డ భారతీయుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా ఉక్రెయిన్ మధ్య వార్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధంలో రష్యా సైన్యం తరపున పోరాడుతున్న ఓ భారతీయుడు ఉక్రెయిన్ దళాలకు పట్టబడ్డాడు. మజోతి సాహిల్ మొహమ్మద్ హుస్సేన్ (22) ను ఉక్రెయిన్ దళాలు పట్టుకున్నాయి. గుజరాత్లోని మోర్బి నివాసి మజోతి సాహిల్ మొహమ్మద్ హుస్సేన్ యుద్ధభూమిలో కేవలం మూడు రోజులు గడిపిన తర్వాత 63వ మెకనైజ్డ్ బ్రిగేడ్కు లొంగిపోయాడని ఉక్రెయిన్ సైనిక అధికారులు తెలిపినట్లు సమాచారం. కైవ్లోని భారత మిషన్ ధృవీకరిస్తోందని ANI నివేదిక తెలిపింది.
Also Read:Railways: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై బుక్ అయిన టికెట్ తేదీలను కూడా మార్చుకోవచ్చు..
Also Read
- Bigg Boss 10: బిగ్ బాస్ సెట్ వర్క్ మొదలు.. ఆరోజు నుంచే షో.!
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు 3 రోజుల ఈడీ కస్టడీ..!
- Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ 'స్పైసీ చిల్లీ ఎగ్'.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
- Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
హుస్సేన్ మొదట్లో రష్యాకు చదువుకోవడానికి వెళ్లాడని, కానీ తరువాత మాదకద్రవ్యాల సంబంధిత ఆరోపణలపై అరెస్టు అయ్యాడు. అతనికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించారని ఉక్రేనియన్ సైన్యం టెలిగ్రామ్ పోస్ట్లో ఆరోపించింది . జైలుకు వెళ్లకుండా ఉండటానికి, అతను యుద్ధంలో చేరాడు అని బ్రిగేడ్ ఒక ప్రకటనలో తెలిపింది. బ్రిగేడ్ విడుదల చేసిన వీడియోలో, హుస్సేన్ రష్యన్ భాషలో మాట్లాడుతూ జైలు శిక్షను తప్పించుకోవడానికి తాను రష్యన్ సైన్యంలో చేరానని అంగీకరించినట్లు కనిపిస్తోంది.
వైరల్ అవుతున్న వీడియోలో, అక్టోబర్ 1న ఫ్రంట్ లైన్లకు పంపబడే ముందు తాను కేవలం 16 రోజుల ప్రాథమిక శిక్షణ మాత్రమే పొందానని హుస్సేన్ వివరించాడు. తన కమాండర్తో విభేదాల తర్వాత, అతను లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. “నేను రెండు లేదా మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉక్రేనియన్ కందకంలో చిక్కుకున్నాను” అని అతను చెప్పాడు.
పిటిఐ నివేదిక ప్రకారం, హుస్సేన్ మాట్లాడుతూ, “నేను వెంటనే నా రైఫిల్ను కింద పెట్టి, నాకు పోరాడటం ఇష్టం లేదని చెప్పాను. నాకు సహాయం కావాలి” అని కోరినట్లు వెల్లడించాడు.
Also Read:Mask Man Harish : మీరు బండ ఆంటీనా.. రిపోర్టర్ పై మాస్క్ మ్యాన్ ఫైర్
కాగా భారత పౌరులను రష్యన్ సైన్యంలోకి నియమించుకునేందుకు ఒత్తిడి చేశారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. రష్యా సైన్యంలో పనిచేస్తున్న 27 మంది భారతీయులను విడుదల చేసి స్వదేశానికి రప్పించాలని భారత్ మాస్కోపై ఒత్తిడి తెచ్చిందని గత నెలలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. అధికారిక గణాంకాల ప్రకారం, 2022లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి 150 మందికి పైగా భారతీయులను నియమించుకున్నారు. గత సంవత్సరం రష్యా పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ అంశాన్ని లేవనెత్తారు. ఇప్పటివరకు, ఈ వివాదంలో సుమారు 12 మంది భారతీయులు మరణించారు, 96 మందిని రష్యన్ అధికారులు విడుదల చేశారు.
తాజావార్తలు
-
Bigg Boss 10: బిగ్ బాస్ సెట్ వర్క్ మొదలు.. ఆరోజు నుంచే షో.!
-
Akkineni Multistarrer: అక్కినేని మల్టీస్టారర్కు బ్రేక్.. నాగార్జున, చైతూ, అఖిల్ సినిమా ఎందుకు ఆగిపోయింది?
-
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు 3 రోజుల ఈడీ కస్టడీ..!
-
Airtel Perplexity Pro: ఎయిర్టెల్ యూజర్లకు అలర్ట్.. రేపటిలోగా ఈ పని చేయకపోతే ఖాతా నుంచి డబ్బు కట్!
-
Explainer: ఇరు సైన్యాల మధ్య నలిగిపోయిన భారతీయ సిబ్బంది.. ఆ రాత్రి అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!