Russia Ukraine Conflict: రష్యా సైన్యం తరపున పోరాడుతూ.. ఉక్రెయిన్ దళాలకు పట్టుబడ్డ భారతీయుడు..
- రష్యా సైన్యం తరపున పోరాడుతూ
- ఉక్రెయిన్ దళాలకు పట్టుబడ్డ భారతీయుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా ఉక్రెయిన్ మధ్య వార్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధంలో రష్యా సైన్యం తరపున పోరాడుతున్న ఓ భారతీయుడు ఉక్రెయిన్ దళాలకు పట్టబడ్డాడు. మజోతి సాహిల్ మొహమ్మద్ హుస్సేన్ (22) ను ఉక్రెయిన్ దళాలు పట్టుకున్నాయి. గుజరాత్లోని మోర్బి నివాసి మజోతి సాహిల్ మొహమ్మద్ హుస్సేన్ యుద్ధభూమిలో కేవలం మూడు రోజులు గడిపిన తర్వాత 63వ మెకనైజ్డ్ బ్రిగేడ్కు లొంగిపోయాడని ఉక్రెయిన్ సైనిక అధికారులు తెలిపినట్లు సమాచారం. కైవ్లోని భారత మిషన్ ధృవీకరిస్తోందని ANI నివేదిక తెలిపింది.
Also Read:Railways: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై బుక్ అయిన టికెట్ తేదీలను కూడా మార్చుకోవచ్చు..
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
హుస్సేన్ మొదట్లో రష్యాకు చదువుకోవడానికి వెళ్లాడని, కానీ తరువాత మాదకద్రవ్యాల సంబంధిత ఆరోపణలపై అరెస్టు అయ్యాడు. అతనికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించారని ఉక్రేనియన్ సైన్యం టెలిగ్రామ్ పోస్ట్లో ఆరోపించింది . జైలుకు వెళ్లకుండా ఉండటానికి, అతను యుద్ధంలో చేరాడు అని బ్రిగేడ్ ఒక ప్రకటనలో తెలిపింది. బ్రిగేడ్ విడుదల చేసిన వీడియోలో, హుస్సేన్ రష్యన్ భాషలో మాట్లాడుతూ జైలు శిక్షను తప్పించుకోవడానికి తాను రష్యన్ సైన్యంలో చేరానని అంగీకరించినట్లు కనిపిస్తోంది.
వైరల్ అవుతున్న వీడియోలో, అక్టోబర్ 1న ఫ్రంట్ లైన్లకు పంపబడే ముందు తాను కేవలం 16 రోజుల ప్రాథమిక శిక్షణ మాత్రమే పొందానని హుస్సేన్ వివరించాడు. తన కమాండర్తో విభేదాల తర్వాత, అతను లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. “నేను రెండు లేదా మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉక్రేనియన్ కందకంలో చిక్కుకున్నాను” అని అతను చెప్పాడు.
పిటిఐ నివేదిక ప్రకారం, హుస్సేన్ మాట్లాడుతూ, “నేను వెంటనే నా రైఫిల్ను కింద పెట్టి, నాకు పోరాడటం ఇష్టం లేదని చెప్పాను. నాకు సహాయం కావాలి” అని కోరినట్లు వెల్లడించాడు.
Also Read:Mask Man Harish : మీరు బండ ఆంటీనా.. రిపోర్టర్ పై మాస్క్ మ్యాన్ ఫైర్
కాగా భారత పౌరులను రష్యన్ సైన్యంలోకి నియమించుకునేందుకు ఒత్తిడి చేశారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. రష్యా సైన్యంలో పనిచేస్తున్న 27 మంది భారతీయులను విడుదల చేసి స్వదేశానికి రప్పించాలని భారత్ మాస్కోపై ఒత్తిడి తెచ్చిందని గత నెలలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. అధికారిక గణాంకాల ప్రకారం, 2022లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి 150 మందికి పైగా భారతీయులను నియమించుకున్నారు. గత సంవత్సరం రష్యా పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ అంశాన్ని లేవనెత్తారు. ఇప్పటివరకు, ఈ వివాదంలో సుమారు 12 మంది భారతీయులు మరణించారు, 96 మందిని రష్యన్ అధికారులు విడుదల చేశారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..