Russia Ukraine Conflict: రష్యా సైన్యం తరపున పోరాడుతూ.. ఉక్రెయిన్ దళాలకు పట్టుబడ్డ భారతీయుడు..
- రష్యా సైన్యం తరపున పోరాడుతూ
- ఉక్రెయిన్ దళాలకు పట్టుబడ్డ భారతీయుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా ఉక్రెయిన్ మధ్య వార్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధంలో రష్యా సైన్యం తరపున పోరాడుతున్న ఓ భారతీయుడు ఉక్రెయిన్ దళాలకు పట్టబడ్డాడు. మజోతి సాహిల్ మొహమ్మద్ హుస్సేన్ (22) ను ఉక్రెయిన్ దళాలు పట్టుకున్నాయి. గుజరాత్లోని మోర్బి నివాసి మజోతి సాహిల్ మొహమ్మద్ హుస్సేన్ యుద్ధభూమిలో కేవలం మూడు రోజులు గడిపిన తర్వాత 63వ మెకనైజ్డ్ బ్రిగేడ్కు లొంగిపోయాడని ఉక్రెయిన్ సైనిక అధికారులు తెలిపినట్లు సమాచారం. కైవ్లోని భారత మిషన్ ధృవీకరిస్తోందని ANI నివేదిక తెలిపింది.
Also Read:Railways: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై బుక్ అయిన టికెట్ తేదీలను కూడా మార్చుకోవచ్చు..
Also Read
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Apple Products: బిగ్షాక్ ఇచ్చిన యాపిల్.. వాటి ధరలు భారీగా పెంపు.. లక్ష వరకు పెరిగిన రేట్లు..
హుస్సేన్ మొదట్లో రష్యాకు చదువుకోవడానికి వెళ్లాడని, కానీ తరువాత మాదకద్రవ్యాల సంబంధిత ఆరోపణలపై అరెస్టు అయ్యాడు. అతనికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించారని ఉక్రేనియన్ సైన్యం టెలిగ్రామ్ పోస్ట్లో ఆరోపించింది . జైలుకు వెళ్లకుండా ఉండటానికి, అతను యుద్ధంలో చేరాడు అని బ్రిగేడ్ ఒక ప్రకటనలో తెలిపింది. బ్రిగేడ్ విడుదల చేసిన వీడియోలో, హుస్సేన్ రష్యన్ భాషలో మాట్లాడుతూ జైలు శిక్షను తప్పించుకోవడానికి తాను రష్యన్ సైన్యంలో చేరానని అంగీకరించినట్లు కనిపిస్తోంది.
వైరల్ అవుతున్న వీడియోలో, అక్టోబర్ 1న ఫ్రంట్ లైన్లకు పంపబడే ముందు తాను కేవలం 16 రోజుల ప్రాథమిక శిక్షణ మాత్రమే పొందానని హుస్సేన్ వివరించాడు. తన కమాండర్తో విభేదాల తర్వాత, అతను లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. “నేను రెండు లేదా మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉక్రేనియన్ కందకంలో చిక్కుకున్నాను” అని అతను చెప్పాడు.
పిటిఐ నివేదిక ప్రకారం, హుస్సేన్ మాట్లాడుతూ, “నేను వెంటనే నా రైఫిల్ను కింద పెట్టి, నాకు పోరాడటం ఇష్టం లేదని చెప్పాను. నాకు సహాయం కావాలి” అని కోరినట్లు వెల్లడించాడు.
Also Read:Mask Man Harish : మీరు బండ ఆంటీనా.. రిపోర్టర్ పై మాస్క్ మ్యాన్ ఫైర్
కాగా భారత పౌరులను రష్యన్ సైన్యంలోకి నియమించుకునేందుకు ఒత్తిడి చేశారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. రష్యా సైన్యంలో పనిచేస్తున్న 27 మంది భారతీయులను విడుదల చేసి స్వదేశానికి రప్పించాలని భారత్ మాస్కోపై ఒత్తిడి తెచ్చిందని గత నెలలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. అధికారిక గణాంకాల ప్రకారం, 2022లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి 150 మందికి పైగా భారతీయులను నియమించుకున్నారు. గత సంవత్సరం రష్యా పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ అంశాన్ని లేవనెత్తారు. ఇప్పటివరకు, ఈ వివాదంలో సుమారు 12 మంది భారతీయులు మరణించారు, 96 మందిని రష్యన్ అధికారులు విడుదల చేశారు.
తాజావార్తలు
-
India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
-
AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
-
Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
-
Apple Products: బిగ్షాక్ ఇచ్చిన యాపిల్.. వాటి ధరలు భారీగా పెంపు.. లక్ష వరకు పెరిగిన రేట్లు..
-
Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!