పీఎస్ యూ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) ప్రమోట్ చేసిన ఇండియా ఫస్ట్ లైప్ ఇన్యూరెన్స్ కంపెనీ పబ్లీకి ఇష్యూకి రానుంది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా దాదాపు 14.13 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ప్రమోటర్ సంస్థలలో బ్యాంక్ ఆఫ్ బరోడా 8.9 కోట్లకు పైగా షేర్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1,30,56,415 షేర్ల చొప్పున ఆఫర్ చేయనున్నాయి.
Also Read : Top Headlines @9AM: టాప్ న్యూస్
వాటాదారులలో కార్మెల్ పాయింట్ ఇన్వెస్ట్ మెంట్స్ ఇండియా 3.92 కోట్లకుపైగా షేర్లు విక్రయించనుంది. ఇండియా పస్ట్ లైఫ్ ఇన్యూరెన్స్ లో బ్యాంక్ ఆఫ్ బరోడా 65 శాతం వాటాను కలిగి ఉంది. వార్ బర్గ్ పింకస్ సంస్థ కార్మెల్ పాయింట్ కు 26 శాతం వాటా, యూనియన్ బ్యాంక్ కు 9 శాతం వాటా ఉంది. ఇష్యూకి ముందు ప్రిఫరెన్సియల్ పద్దతి లేదా ప్రయివేట్ ప్లేస్ మెంట్ ( రైట్ ఇష్యూ ) ద్వారా రూ. 100 కోట్ల వరకూ సమీకరించుకునే యోచనలో ఇండియా ఫస్ట్ ఇన్యూరెన్స్ కంపెనీ ఉంది. తాజాగా ఈక్విటి జారీ నిధులను మూలధన పటిష్టతకు వినియోగించనుంది. కంపెనీ గతేడాది అక్టోబర్ లో సెబీకి ప్రాస్పెక్టస్ ను దాఖలు చేసింది. దేశీయంగా మూడో పెద్ద పీఎస్ యూ బ్యాంక్ బీవోబీ, యూనియన్ బ్యాంక్ కంపెనీకి విస్తారిత బ్యాంకెస్యూరెన్స్ నెట్ వర్క్ ద్వారా మద్దతిస్తున్నాయి.
Also Read : Gyanvapi Case: జ్ఞానవాపి కేసులో శివలింగం కార్బన్ డేటింగ్పై స్పష్టత ఇవ్వాలని కోర్టు ఆదేశం