India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Women vs SA Women: బెనోనీ వేదికగా జరిగిన ఐదవ టీ20 మ్యాచ్లో దక్షిణాఫ్రికా మహిళల జట్టు 23 పరుగుల తేడాతో భారత మహిళల జట్టుపై ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో టీమ్ ఇండియా 132 పరుగులకే పరిమితమైంది.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్లో కెప్టెన్ లారా వోల్వార్డ్ మరోసారి అదరగొట్టింది. ఇన్నింగ్స్ ఆరంభం నుండి దూకుడుగా ఆడిన ఆమె 56 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 92 పరుగులు చేసి నాటౌట్గా నిలిచింది. ఓపెనర్ సునే లూస్ (23) తో కలిసి ఆమె మొదటి వికెట్కు 75 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ, రేణుక సింగ్, శ్రీ చరణి తలో రెండు వికెట్లు తీసి దక్షిణాఫ్రికాను మధ్య ఓవర్లలో కట్టడి చేసినప్పటికీ, వోల్వార్డ్ మెరుపులు ఆ జట్టుకు మంచిని స్కోరును అందించాయి.
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. షెఫాలీ వర్మ (4), జెమిమా రోడ్రిగ్స్ (1) తక్కువ పరుగులకే వెనుదిరగడంతో భారత్ కష్టాల్లో పడింది. అనుష్క శర్మ (17), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (22) ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేసినా, రన్ రేట్ పెంచే క్రమంలో వికెట్లు కోల్పోయారు. మధ్యలో భారతి ఫుల్మాలి 30 బంతుల్లో 40 పరుగులు (4 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి ఆశలు చిగురింపజేసినా, ఆమె అవుటయ్యాక భారత్ విజయం కష్టతరమైంది.
దక్షిణాఫ్రికా బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేసి భారత బ్యాటర్లను కట్టడి చేశారు. ముఖ్యంగా నోన్కులులేకో మ్లాబా 4 ఓవర్లలో కేవలం 15 పరుగులిచ్చి 2 వికెట్లు తీసి భారత పతనాన్ని శాసించింది. నడైన్ డి క్లెర్క్ కూడా రెండు వికెట్లు పడగొట్టి తన వంతు సహకారం అందించింది. ఆఖర్లో రిచా ఘోష్ 15 బంతుల్లో 25 పరుగులు చేసి నాటౌట్గా నిలిచినప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీనితో 5 టీ20ల సిరీస్ 4-1తో దక్షిణాఫ్రికా వశమైంది.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?