Ind vs Pak : ప్రపంచ కప్లో పాకిస్థాన్పై అత్యధిక పరుగులు ఆటగాళ్లు వీరే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ind vs Pak : అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో నేడు భారత్ వర్సెస్ పాకిస్థాన్ క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్కు ముందు ఇరు దేశాల క్రికెట్ ప్రేమికుల్లో విపరీతమైన ఉత్సాహం కనిపిస్తోంది. ప్రపంచకప్ చరిత్రలో భారత్ ప్రతిసారీ పాకిస్థాన్ను ఓడించింది. పాకిస్థాన్పై భారత్ రికార్డు 7–0. భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 బ్యాట్స్మెన్ గురించి తెలుసుకుందాం.
1. సచిన్ టెండూల్కర్
క్రికెట్ గాడ్ గా పిలువబడే సచిన్ టెండూల్కర్ 1992 ప్రపంచకప్ నుండి 2011 ప్రపంచకప్ వరకు మొత్తం 5 మ్యాచ్లు ఆడాడు. పాకిస్థాన్పై సచిన్ 5 ఇన్నింగ్స్ల్లో అత్యధికంగా 313 పరుగులు చేశాడు. ఈ సమయంలో సచిన్ సగటు 78.25గా ఉంది. ఈ ఐదు ఇన్నింగ్స్ల్లో సచిన్ 3 సార్లు హాఫ్ సెంచరీలు సాధించాడు.
Also Read
- Tilak Varma: మా కొంప ముంచింది అదొక్కటే.. ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేసిన తిలక్ వర్మ..
- EPFO New Rules: ఉద్యోగులకు శుభవార్త.. 100 శాతం PF విత్డ్రా చేయొచ్చు..! ఎప్పుడంటే..?
- Trump: ఈ రాత్రి ఇరాన్ను ఊహించలేని దెబ్బ కొడతాం.. ఖర్గ్ కూడా స్వాధీనం చేసుకుంటాం.. ట్రంప్ వార్నింగ్
- India Loss: ముక్కోణపు వన్డే సిరీస్.. 4 పరుగుల తేడాతో భారత్-ఎపై అఫ్గానిస్థాన్-ఎ విజయం
2. విరాట్ కోహ్లీ
భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. విరాట్ 2011 ప్రపంచకప్ నుండి 2019 ప్రపంచకప్ వరకు మూడు మ్యాచ్ల 3 ఇన్నింగ్స్లలో పాకిస్తాన్పై మొత్తం 193 పరుగులు చేశాడు. ఈ సమయంలో విరాట్ కోహ్లీ సగటు 64.33గా ఉంది. ఈ సమయంలో విరాట్ ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీ సాధించాడు.
Read Also:YS Vijayamma: బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసానికి వైఎస్ విజయమ్మ..
3. రోహిత్ శర్మ
ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మూడో స్థానంలో ఉన్నాడు. 2015 నుంచి 2019 వరకు జరిగిన ప్రపంచకప్లో 2 మ్యాచ్లు ఆడిన రోహిత్ శర్మ 2 ఇన్నింగ్స్ల్లో పాకిస్థాన్పై మొత్తం 155 పరుగులు చేశాడు. ఈ సమయంలో రోహిత్ గరిష్ట స్కోరు 140 పరుగులు. కాగా, రోహిత్ సగటు 77.50గా ఉంది.
4. మహ్మద్ అజారుద్దీన్
పాకిస్థాన్పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ నాలుగో స్థానంలో ఉన్నాడు. 1992 నుంచి 1999 వరకు జరిగిన ప్రపంచకప్లో పాకిస్థాన్తో జరిగిన 3 మ్యాచ్ల్లో అజారుద్దీన్ మూడు ఇన్నింగ్స్ల్లో 118 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 59 పరుగులు కాగా అతని సగటు 39.33.
Read Also:Russia Arms Treaty: రష్యాకు ఉత్తరకొరియా ఆయుధాలు.. నిజాలను బయటపెట్టిన అమెరికా
5. సురేష్ రైనా
టీమ్ ఇండియా మాజీ మిడిలార్డర్ బ్యాట్స్మెన్ సురేశ్ రైనా 2011 ప్రపంచకప్ నుండి 2015 ప్రపంచకప్ వరకు పాకిస్థాన్తో జరిగిన రెండు మ్యాచ్లలో రెండు ఇన్నింగ్స్లలో మొత్తం 110 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని అత్యధిక స్కోరు 74 పరుగులు. అయితే అతని సగటు 110.
తాజావార్తలు
-
Tilak Varma: మా కొంప ముంచింది అదొక్కటే.. ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేసిన తిలక్ వర్మ..
-
EPFO New Rules: ఉద్యోగులకు శుభవార్త.. 100 శాతం PF విత్డ్రా చేయొచ్చు..! ఎప్పుడంటే..?
-
Trump: ఈ రాత్రి ఇరాన్ను ఊహించలేని దెబ్బ కొడతాం.. ఖర్గ్ కూడా స్వాధీనం చేసుకుంటాం.. ట్రంప్ వార్నింగ్
-
Mandadi: సుహాస్, సూరిల ‘మండాడి’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
India Loss: ముక్కోణపు వన్డే సిరీస్.. 4 పరుగుల తేడాతో భారత్-ఎపై అఫ్గానిస్థాన్-ఎ విజయం
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!