Site icon NTV Telugu

India vs New Zealand: 2021, 2016, 2023 చేదు జ్ఞాపకాలు.. గతంలో చేసిన ఈ 3 తప్పులు మళ్ళీ చేస్తే కప్పు కష్టమే!

India Vs New Zealand T20 World Cup

India Vs New Zealand T20 World Cup

India vs New Zealand: నేడు న్యూజిలాండ్ vs ఇండియా తుది పోరుకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం సిద్ధమైంది. కోట్లాది మంది ఫ్యాన్స్ ఈ మ్యాచ్‌ కోసం ఎదురు చూస్తున్నారు. సాయంత్రం 7 గంటల నుంచి అందరూ టీవీలకు, ఫోన్లకు అతుక్కుపోనున్నారు. ఈ కప్పు ఎలాగైనా టీమిండియా కైవసం చేసుకోవాలని అందరూ ఆశిస్తున్నారు. మరో వైపు.. ఇంత వరకు టీ20 కప్పును కూడా సొంతం చేసుకోని న్యూజిలాండ్ ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దని ప్లాన్ చేస్తోంది. ఇక టీమిండియా ఇప్పటివరకు టీ20 వరల్డ్ కప్ మ్యాచుల్లో న్యూజిలాండ్‌పై మూడు సార్లు ఓడిపోయింది. ఎపుడు ఎలా ఓడింది. ఈ మూడు సందర్భాల్లో ఎలాంటి తప్పులు చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం..

READ MORE: Dhurandhar 2 :ధురంధర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ సెన్సేషన్!

2021లో జరిగిన టీ20 వరల్డ్ కప్‌ మ్యాచ్‌లో భారత్ బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చి అతిపెద్ద పొరపాటు చేసింది. ఆ మ్యాచ్‌లో రోహిత్ శర్మను మూడో స్థానంలో పంపింది. ఇషాన్ కిషన్‌కు ఓపెనర్‌గా అవకాశం ఇచ్చింది. ఆ నిర్ణయం జట్టుపై ప్రతికూల ప్రభావం చూపింది. ఫలితంగా భారత్ కేవలం 110 పరుగులకే పరిమితమైంది. ఈసారి కూడా ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్‌పై సందేహాలు ఉన్నప్పటికీ ఫైనల్ వంటి కీలక మ్యాచ్‌లో బ్యాటింగ్ బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చడం ప్రమాదకరంగా భావిస్తున్నారు. ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగితే మంచిదని అందరూ భావిస్తున్నారు.

READ MORE: Team India playing XI: వరుణ్, అభిషేక్ విషయంలో సంచలన నిర్ణయం.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ లీక్!

ఇక న్యూజిలాండ్ స్పిన్నర్లు భారత్‌పై ఎప్పుడూ మంచి ప్రదర్శన చేస్తుంటారు. 2016 ప్రపంచకప్‌లో మిచెల్ సాంట్నర్, ఇష్ సోధీ కలిసి భారత్‌ను కేవలం 79 పరుగులకే ఆలౌట్ చేశారు. స్పిన్ బౌలర్లను ఎదుర్కొంటూ పరుగులు చేయకుండా కేవలం బౌండరీలను సాధించే క్రమంలో అనవసరంగా రన్‌రేట్ పెరిగిపోయింది. దీంతో చివర్లో ఒత్తిడి పెరిగి వికెట్లు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇది న్యూజిలాండ్‌పై భారత్‌ చేసిన రెండో తప్పు. ఈ పరిస్థతి ఇప్పుడు రిపీట్ కాకుండా ఉండాంటే.. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ధైర్యంగా ఆడాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే.. సూర్యకుమార్, తిలక్ వర్మతో సహా భారత మిడిల్ ఆర్డర్ కుంగిపోకూడదు.

READ MORE: IND vs NZ Final 2026: నేడు భారత్, న్యూజిలాండ్‌ ఫైనల్‌.. ప్లేయింగ్ 11, పిచ్ రిపోర్ట్, హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇవే!

2023లో భారత్‌కు అహ్మదాబాద్ స్టేడియం కలసి రాలేదు. 2023 ODI ప్రపంచ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఆధిపత్య భారత జట్టు ఓటమి పాలైంది. ఆ మ్యాచ్‌లో పిచ్ పరిస్థితులను సరిగా అంచనా వేయకపోవడం, అజేయ జట్టుగా భావించి కొంత నిర్లక్ష్యం చూపించడం వంటి అంశాలు భారత్‌కు చేదు అనుభవంగా మారాయి. ఇప్పుడు జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో సూర్యకుమార్ పూర్తి నిబద్ధతతో ఉండాలి. ఈసారి అలాంటి పొరపాటు జరగకుండా ముందుగానే అన్ని విషయాల్లో స్పష్టమైన ప్రణాళిక అవసరం. ఈ మూడు తప్పులను రిపీట్ చేయకపోతే.. ఈ సారి కప్పు మనదే అని నిపుణులు చెబుతున్నారు.

Exit mobile version