NTV Telugu Site icon

U-19 World Cup 2025: అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ విజేత భారత్..

India

India

అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ విజేతగా భారత్ నిలిచింది. వరుసగా రెండోసారి అండర్-19 వరల్డ్ కప్ గెలిచింది భారత్.. 9 వికెట్ల తేడాతో భారత జట్టు విజయం సాధించింది. 11.2 ఓవర్లలోనే 83 పరుగుల టార్గెట్‌ను భారత్ బ్యాటర్లు రీచ్ అయ్యారు. బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ భారత జట్టు దుమ్మురేపింది. సౌతాఫ్రికాను 82 పరుగులకే భారత్ బౌలర్లు ఆలౌట్ చేశారు. మరోవైపు.. బ్యాటింగ్, బౌలింగ్‌లో తెలుగమ్మాయి గొంగడి త్రిష అదరగొట్టింది. 32 బంతుల్లో 44 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది త్రిష. బౌలింగ్‌లోనూ మూడు వికెట్లతో రాణించింది త్రిష