NTV Telugu Site icon

IND vs BAN: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. తెలుగు కుర్రాడికి చోటు

Team India

Team India

బంగ్లాదేశ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత్ అక్టోబర్ 6 నుంచి బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్‌లకు విశ్రాంతి ఇవ్వగా, జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో పాల్గొన్న అభిషేక్ శర్మకు అవకాశం లభించింది. అలాగే.. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డికి చోటు దక్కింది.

Samsung Galaxy Tab S10: AI ఫీచర్లతో శాంసంగ్ కొత్త టాబ్లెట్‌లు విడుదల.. ఫీచర్లు ఇవే..!

బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు…
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, ర్యాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేష్ శర్మ (వికెట్ కీపర్), అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్.