T20 World Cup 2026: టీమిండియాకు 2012 ప్రపంచ కప్ గండం.. అప్పట్లాగే నెట్ రన్ రేట్ దెబ్బకొడుతుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup 2026: 2026 టీ20 ప్రపంచ కప్లో దక్షిణాఫ్రికా చేతిలో ఘోర పరాజయం ముటగట్టుకున్న భారత్, ప్రస్తుతం ఈ మెగా టోర్నీలో చాలా ఇబ్బందులను ఎదుర్కుంటుంది. ఈ ఓటమితో భారత్కు సెమీఫైనల్ చేరడం ఒక పెద్ద సవాలుగా మారింది. ప్రస్తుతం టీమిండియా నెట్ రన్ రేట్ -3.800 గా ఉంది. ఇది అభిమానులను తీవ్రంగా ఆందోళన కలిగిస్తుంది.
READ ALSO: WhatsApp Supreme Court Case: సుప్రీంకోర్టులో యూ-టర్న్ తీసుకున్న వాట్సాప్..
Also Read
- Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
- T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
- Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
- OTR: కరీంనగర్ కారు పార్టీలో అలజడి.. 'రెడ్ జోన్' వార్నింగ్తో లీడర్ల ఉరుకులు పరుగులు..
భారత్ ముందున్న మ్యాచులు ఇవే..
సెమీస్ చేరాలంటే టీమిండియా తన నెక్ట్స్ రెండు మ్యాచ్ల్లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితిలో ఉంది. భారత్ ఫిబ్రవరి 26న జింబాబ్వేతో, మార్చి 1న వెస్టిండీస్తో తలపడబోతుంది. టీమిండియా సెమీస్ చేరాలంటే ఉన్న ఛాన్స్లు ఏమిటంటే.. దక్షిణాఫ్రికా తన మిగిలిన రెండు మ్యాచ్ల్లోనూ (జింబాబ్వే, విండీస్) గెలవాలి. అప్పుడు భారత్ తన రెండు మ్యాచ్లు గెలిస్తే, రన్ రేట్ తో సంబంధం లేకుండా నేరుగా సెమీస్ కి వెళ్తుంది. ఒకవేళ వెస్టిండీస్ జట్టు.. జింబాబ్వే, దక్షిణాఫ్రికాపై గెలిస్తే.. అప్పుడు భారత్, విండీస్, సౌతాఫ్రికా మూడూ తలో రెండు విజయాలతో సమానంగా ఉంటాయి. అప్పుడు ఎవరి రన్ రేట్ బాగుంటే వారే సెమీస్ కి వెళ్తారు. ప్రస్తుతం భారత్ రన్ రేట్ మైనస్లో ఉండటం పెద్ద సమస్యగా మారింది.
2012 నాటి సీన్ రిపీట్ అవుతుందా..
సరిగ్గా 14 ఏళ్ల క్రితం (2012లో) టీమిండియాకు ఇలాగే జరిగింది. అప్పుడు సూపర్-8లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ భారీ తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత పాకిస్థాన్, దక్షిణాఫ్రికాపై గెలిచినప్పటికీ.. ఆస్ట్రేలియా కంటే తక్కువ రన్ రేట్ ఉండటంతో భారత్ సెమీస్ చేరకుండానే ఇంటికి వచ్చేసింది. ఆ టోర్నీలో భారత్ 3 మ్యాచ్ల్లో 2 గెలిచినా రన్ రేట్ వల్ల సెమీస్కు చేరకుండా తిరిగి రావాల్సి వచ్చింది. పాకిస్థాన్, ఆస్ట్రేలియా మెరుగైన రన్ రేట్తో సెమీస్కి వెళ్లాయి. ఆ మెగా టోర్నీలో చివరికి వెస్టిండీస్ కప్పు కొట్టింది. సొంత గడ్డపై జరుగుతున్న ఈ టోర్నీలో భారత్ ఒక్క మ్యాచ్ గెలిస్తే సరిపోదు, రన్ రేట్ను కూడా భారీగా మెరుగుపరుచుకోవాలి. ముఖ్యంగా వెస్టిండీస్, జింబాబ్వేపై భారీ తేడాతో గెలిస్తేనే సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. లేదంటే 2012 నాటి కథే మళ్లీ పునరావృతం అవుతుందని అంటున్నారు.
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!