India-Russia Deal: పాక్ గుండెల్లో గుబులు పుట్టించే డీల్.. ఎస్-400 క్షిపణులను కొనుగోలు చేయనున్న భారత్
- రూ.10 వేల కోట్ల డీల్..
- ఆపరేషన్ సింధూర్లో S-400 వ్యవస్థతో చావు దెబ్బ పాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Russia S-400 Deal: రష్యా – భారత్ స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమయం, సందర్భం వచ్చిన ప్రతిసారి ప్రపంచానికి ఈ రెండు దేశాల మధ్య ఉన్న మైత్రి కనిపిస్తూనే ఉంది. భారతదేశం త్వరలో రష్యా నుంచి S-400 వైమానిక రక్షణ వ్యవస్థ కోసం పెద్ద సంఖ్యలో క్షిపణులను కొనుగోలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఒప్పందం విలువ దాదాపు రూ.10 వేల కోట్లుగా నివేదించారు. భారత వైమానిక దళం S-400 వ్యవస్థ ఇప్పటికే పాకిస్థాన్పై తన ప్రభావాన్ని చూపింది. నాలుగు రోజుల ఘర్షణలో ఈ వ్యవస్థ ఐదు నుంచి ఆరు పాకిస్థాన్ యుద్ధ విమానాలను, ఒక గూఢచారి విమానాన్ని 300 కిలోమీటర్ల దూరం నుంచి కూల్చివేసింది. భారత వైమానిక దళం దీనిని గేమ్ ఛేంజర్గా అభివర్ణించింది.
READ ALSO: Govt Jobs 2025: లైఫ్ సెట్ చేసే ప్రభుత్వ ఉద్యోగాలు.. మరికొన్ని రోజులే ఛాన్స్.. వెంటనే అప్లై చేసుకోండి
Also Read
- Asim Munir: ఇరాన్లో అసిమ్ మునీర్కు భంగపాటు.. ఒక్కరోజులోనే రిటర్న్
- Daggubati Purandeswari: 2024 ఫార్ములానే స్థానిక ఎన్నికల్లోనూ.. పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు
- Nepal Flash Floods: నేపాల్లో వరద విలయం.. 105 మంది భారతీయులు గల్లంతు..
- Marriage Not License: తల్లిదండ్రుల ఇంటికి వెళ్లేందుకు భర్త పర్మిషన్ అక్కర్లేదు.. హైకోర్టు కీలక తీర్పు
అక్టోబర్ 23న సమావేశం..
భారత వైమానిక దళం రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకోవడానికి ఈ క్షిపణులను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఈ ఒప్పందంపై భారతదేశం – రష్యా మధ్య చర్చలు జరుగుతున్నాయి. రక్షణ మంత్రిత్వ శాఖ అక్టోబర్ 23న ఈ ఒప్పందంపై రష్యాతో చర్చించడానికి సమావేశం కానుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ భారత్- రష్యాతో 10,000 కోట్ల ఒప్పందం కుదుర్చుకోనుంది. భారతదేశం ఇప్పుడు తన వైమానిక దళానికి మరిన్ని S-400 స్క్వాడ్రన్లను జోడించాలని యోచిస్తోంది. ఇండియా ఇప్పటికే రష్యా నుంచి మూడు ఆపరేషనల్ స్క్వాడ్రన్లను అందుకుంది. నాల్గవ స్క్వాడ్రన్ డెలివరీ కావడానికి ముందే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైంది. మిగిలిన రెండు స్క్వాడ్రన్ల డెలివరీని వేగవంతం చేయాలని రష్యాను భారత్ అభ్యర్థించింది.
రెండు దేశాలు కూడా S-500 వైమానిక రక్షణ వ్యవస్థపై చర్చలు జరుపుతున్నాయి. భారతదేశం తన BVR (బియాండ్ విజువల్ రేంజ్) సామర్థ్యాలను మరింత పెంచుకోవడానికి రష్యా నుంచి కొత్త ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులను కొనుగోలు చేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అలాగే బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి సామర్థ్యాలను పెంచడం గురించి కూడా భారతదేశం, రష్యా చర్చించాయి. వాస్తవానికి ఈ డీల్ పాక్ గుండెల్లో గుబులు కలిగించేదిగా విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
READ ALSO: Bihar Elections 2025: బీహార్ సమరానికి కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు వీరే!
తాజావార్తలు
-
Asim Munir: ఇరాన్లో అసిమ్ మునీర్కు భంగపాటు.. ఒక్కరోజులోనే రిటర్న్
-
Khelo India : తెలంగాణలో ఖేలో ఇండియా.. 6 వేల మంది క్రీడాకారుల సందడి
-
Daggubati Purandeswari: 2024 ఫార్ములానే స్థానిక ఎన్నికల్లోనూ.. పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు
-
Nepal Flash Floods: నేపాల్లో వరద విలయం.. 105 మంది భారతీయులు గల్లంతు..
-
Silver Cleaning Trick: వెండి ఆభరణాలపై నలుపు పోవాలా? ఇలా క్లీన్ చేస్తే కొత్తదానిలా మెరిసిపోతాయి!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..