India-Russia Deal: పాక్ గుండెల్లో గుబులు పుట్టించే డీల్.. ఎస్-400 క్షిపణులను కొనుగోలు చేయనున్న భారత్
- రూ.10 వేల కోట్ల డీల్..
- ఆపరేషన్ సింధూర్లో S-400 వ్యవస్థతో చావు దెబ్బ పాక్
India-Russia S-400 Deal: రష్యా – భారత్ స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమయం, సందర్భం వచ్చిన ప్రతిసారి ప్రపంచానికి ఈ రెండు దేశాల మధ్య ఉన్న మైత్రి కనిపిస్తూనే ఉంది. భారతదేశం త్వరలో రష్యా నుంచి S-400 వైమానిక రక్షణ వ్యవస్థ కోసం పెద్ద సంఖ్యలో క్షిపణులను కొనుగోలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఒప్పందం విలువ దాదాపు రూ.10 వేల కోట్లుగా నివేదించారు. భారత వైమానిక దళం S-400 వ్యవస్థ ఇప్పటికే పాకిస్థాన్పై తన ప్రభావాన్ని చూపింది. నాలుగు రోజుల ఘర్షణలో ఈ వ్యవస్థ ఐదు నుంచి ఆరు పాకిస్థాన్ యుద్ధ విమానాలను, ఒక గూఢచారి విమానాన్ని 300 కిలోమీటర్ల దూరం నుంచి కూల్చివేసింది. భారత వైమానిక దళం దీనిని గేమ్ ఛేంజర్గా అభివర్ణించింది.
READ ALSO: Govt Jobs 2025: లైఫ్ సెట్ చేసే ప్రభుత్వ ఉద్యోగాలు.. మరికొన్ని రోజులే ఛాన్స్.. వెంటనే అప్లై చేసుకోండి
Also Read
- LSG vs RR: టాస్ గెలిచిన లక్నో.. బ్యాటింగ్ ఎవరిదంటే?
- CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
- Tragedy: వయ్యారాలు ఒలకబోస్తూ 5 గురు స్త్రీలు.. ఏకాంతంగా కలిసేందుకు ఆహ్వానాలు.. చివరకు ఇలా..
- White Towel: ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలపై తెల్ల టవల్ ఎందుకు?.. దీని వెనుక ఉన్న స్టోరీ ఇదే!
అక్టోబర్ 23న సమావేశం..
భారత వైమానిక దళం రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకోవడానికి ఈ క్షిపణులను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఈ ఒప్పందంపై భారతదేశం – రష్యా మధ్య చర్చలు జరుగుతున్నాయి. రక్షణ మంత్రిత్వ శాఖ అక్టోబర్ 23న ఈ ఒప్పందంపై రష్యాతో చర్చించడానికి సమావేశం కానుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ భారత్- రష్యాతో 10,000 కోట్ల ఒప్పందం కుదుర్చుకోనుంది. భారతదేశం ఇప్పుడు తన వైమానిక దళానికి మరిన్ని S-400 స్క్వాడ్రన్లను జోడించాలని యోచిస్తోంది. ఇండియా ఇప్పటికే రష్యా నుంచి మూడు ఆపరేషనల్ స్క్వాడ్రన్లను అందుకుంది. నాల్గవ స్క్వాడ్రన్ డెలివరీ కావడానికి ముందే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైంది. మిగిలిన రెండు స్క్వాడ్రన్ల డెలివరీని వేగవంతం చేయాలని రష్యాను భారత్ అభ్యర్థించింది.
రెండు దేశాలు కూడా S-500 వైమానిక రక్షణ వ్యవస్థపై చర్చలు జరుపుతున్నాయి. భారతదేశం తన BVR (బియాండ్ విజువల్ రేంజ్) సామర్థ్యాలను మరింత పెంచుకోవడానికి రష్యా నుంచి కొత్త ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులను కొనుగోలు చేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అలాగే బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి సామర్థ్యాలను పెంచడం గురించి కూడా భారతదేశం, రష్యా చర్చించాయి. వాస్తవానికి ఈ డీల్ పాక్ గుండెల్లో గుబులు కలిగించేదిగా విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
READ ALSO: Bihar Elections 2025: బీహార్ సమరానికి కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు వీరే!
తాజావార్తలు
-
IPL 2026: ఓటమి లేకుండా దూసుకెళ్తున్న పంజాబ్ జట్టుకు బిగ్ షాక్.. స్టార్ బ్యాట్స్మెన్ దూరం..
-
Viral Video: ధోని కాళ్లు పట్టుకున్న ముంబై ఇండియన్స్ ఆటగాడు..
-
LSG vs RR: టాస్ గెలిచిన లక్నో.. బ్యాటింగ్ ఎవరిదంటే?
-
Magic Rava Bites Recipe: రవ్వతో కొత్త స్నాక్.. 15 నిమిషాల్లో ‘మ్యాజిక్ రవ్వ బైట్స్’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ..!
-
Royal Enfield Himalayan 440: రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త హిమాలయన్ 440 వచ్చేస్తోంది..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?