India-Russia Deal: పాక్ గుండెల్లో గుబులు పుట్టించే డీల్.. ఎస్-400 క్షిపణులను కొనుగోలు చేయనున్న భారత్
- రూ.10 వేల కోట్ల డీల్..
- ఆపరేషన్ సింధూర్లో S-400 వ్యవస్థతో చావు దెబ్బ పాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Russia S-400 Deal: రష్యా – భారత్ స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమయం, సందర్భం వచ్చిన ప్రతిసారి ప్రపంచానికి ఈ రెండు దేశాల మధ్య ఉన్న మైత్రి కనిపిస్తూనే ఉంది. భారతదేశం త్వరలో రష్యా నుంచి S-400 వైమానిక రక్షణ వ్యవస్థ కోసం పెద్ద సంఖ్యలో క్షిపణులను కొనుగోలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఒప్పందం విలువ దాదాపు రూ.10 వేల కోట్లుగా నివేదించారు. భారత వైమానిక దళం S-400 వ్యవస్థ ఇప్పటికే పాకిస్థాన్పై తన ప్రభావాన్ని చూపింది. నాలుగు రోజుల ఘర్షణలో ఈ వ్యవస్థ ఐదు నుంచి ఆరు పాకిస్థాన్ యుద్ధ విమానాలను, ఒక గూఢచారి విమానాన్ని 300 కిలోమీటర్ల దూరం నుంచి కూల్చివేసింది. భారత వైమానిక దళం దీనిని గేమ్ ఛేంజర్గా అభివర్ణించింది.
READ ALSO: Govt Jobs 2025: లైఫ్ సెట్ చేసే ప్రభుత్వ ఉద్యోగాలు.. మరికొన్ని రోజులే ఛాన్స్.. వెంటనే అప్లై చేసుకోండి
Also Read
- US-India-Russia: చమురు విషయంలో రష్యా హామీ.. అమెరికా ముందు భారత్ కీలక డిమాండ్..
- Monsoon Alert: భారతీయులకు శుభవార్త.. 5 రోజుల ముందే అండమాన్ను తాకనున్న తొలకరి జల్లు
- AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. వారానికి ఒకరోజు ‘నో వెహికల్ డే’!
- Uttar Pradesh: టీ-షర్ట్, ప్యాంట్ వేసుకోవడంపై గొడవ.. భార్యను చంపిన భర్త ఆత్మహత్య..
అక్టోబర్ 23న సమావేశం..
భారత వైమానిక దళం రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకోవడానికి ఈ క్షిపణులను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఈ ఒప్పందంపై భారతదేశం – రష్యా మధ్య చర్చలు జరుగుతున్నాయి. రక్షణ మంత్రిత్వ శాఖ అక్టోబర్ 23న ఈ ఒప్పందంపై రష్యాతో చర్చించడానికి సమావేశం కానుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ భారత్- రష్యాతో 10,000 కోట్ల ఒప్పందం కుదుర్చుకోనుంది. భారతదేశం ఇప్పుడు తన వైమానిక దళానికి మరిన్ని S-400 స్క్వాడ్రన్లను జోడించాలని యోచిస్తోంది. ఇండియా ఇప్పటికే రష్యా నుంచి మూడు ఆపరేషనల్ స్క్వాడ్రన్లను అందుకుంది. నాల్గవ స్క్వాడ్రన్ డెలివరీ కావడానికి ముందే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైంది. మిగిలిన రెండు స్క్వాడ్రన్ల డెలివరీని వేగవంతం చేయాలని రష్యాను భారత్ అభ్యర్థించింది.
రెండు దేశాలు కూడా S-500 వైమానిక రక్షణ వ్యవస్థపై చర్చలు జరుపుతున్నాయి. భారతదేశం తన BVR (బియాండ్ విజువల్ రేంజ్) సామర్థ్యాలను మరింత పెంచుకోవడానికి రష్యా నుంచి కొత్త ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులను కొనుగోలు చేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అలాగే బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి సామర్థ్యాలను పెంచడం గురించి కూడా భారతదేశం, రష్యా చర్చించాయి. వాస్తవానికి ఈ డీల్ పాక్ గుండెల్లో గుబులు కలిగించేదిగా విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
READ ALSO: Bihar Elections 2025: బీహార్ సమరానికి కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు వీరే!
తాజావార్తలు
-
Adani Group: అదానీ వేల కోట్ల సామ్రాజ్యంలోకి మరొక కంపెనీ.. ఇకపై జీవీకే ఎనర్జీ అదానీ సొంతం!
-
US-India-Russia: చమురు విషయంలో రష్యా హామీ.. అమెరికా ముందు భారత్ కీలక డిమాండ్..
-
Monsoon Alert: భారతీయులకు శుభవార్త.. 5 రోజుల ముందే అండమాన్ను తాకనున్న తొలకరి జల్లు
-
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. వారానికి ఒకరోజు ‘నో వెహికల్ డే’!
-
Akash Ambani: జియో సామ్రాజ్యానికి కొత్త బాస్.. అంబానీ వారసుడి చేతికి జియో ప్లాట్ఫామ్స్ పగ్గాలు!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?