World Richest Cricketer: 2019లో రిటైర్మెంట్.. ఇప్పుడు వరల్డ్ రిచెస్ట్ క్రికెటర్! ఏకంగా 70 వేల కోట్లు
- 22 ఏళ్లకే క్రికెట్కు రిటైర్మెంట్
- ఏకంగా 70 వేల కోట్లకు అధిపతి
- వరల్డ్ రిచెస్ట్ క్రికెటర్ సచిన్ కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరల్డ్ రిచెస్ట్ క్రికెటర్ అనగానే.. సగటు క్రికెట్ అభిమానికి సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీలే గుర్తుకొస్తారు. ఈ భారత క్రికెటర్ల నికర విలువ వెయ్యి కోట్లకు పైనే ఉంటుంది. అయితే విరాట్, ధోనీ, సచిన్ కంటే ఎన్నో రెట్లు ధనవంతుడైన భారత క్రికెటర్ కూడా ఉన్నాడు. ఎంతలా అంటే అతను ఓ ఐపీఎల్ జట్టును కూడా సునాయాసంగా కొనుగోలు చేయగలడు. అతడు మీరెవరో కాదు.. 2019లో 22 ఏళ్లకే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆర్యమన్ విక్రమ్ బిర్లా.
వరల్డ్ రిచెస్ట్ క్రికెటర్ల జాబితాలో ఆర్యమన్ బిర్లా అగ్ర స్థానంలో ఉన్నాడు. అతడు రూ.70 వేల కోట్లకు అధిపతి. ప్రముఖ వ్యాపారవేత్త కుమార్ మంగళం బిర్లా కుమారుడే ఈ ఆర్యమన్. 1997లో జన్మించిన అతడు.. వ్యాపార రంగంతో పాటు క్రికెట్లోనూ రాణించాడు. 2019లో 22 ఏళ్ల వయసులో క్రికెట్కు వీడ్కోలు పలికిన ఆర్యమన్.. అనంతరం వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాడు. 2023లో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటెయిల్ లిమిటెడ్కు డైరెక్టర్గా ఎన్నికయ్యాడు. ఆదిత్య బిర్లా మేనేజ్మెంట్ కార్పొరేషన్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్కు కూడా డైరెక్టర్గా ఉన్నాడు. ఆర్యమన్ బిర్లా నికర ఆస్తి విలువ రూ.70 వేల కోట్లకు పైనే.
Also Read
- Yashasvi Jaiswal: ‘అలా ప్రవర్తించకూడదు’.. జైస్వాల్పై ఐసీసీ చర్యలు తప్పవు?
- IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
- Monday Horoscope: వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు ఎవరికి..? నేటి ద్వాదశ రాశుల పూర్తి సమాచారం ఇలా.!
- Yashasvi Jaiswal: కొలంబో టెస్టులో హైడ్రామా.. జైస్వాల్–ఫెర్నాండో ఫైట్.. అసలు ఏం జరిగిందంటే?
Also Read: Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా వేలంలో ఉంటే.. రూ.520 కోట్లు కూడా సరిపోవు!
ఆర్యమన్ బిర్లా 2017లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. మధ్యప్రదేశ్ తరఫున 9 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు, 4 లిస్ట్-ఏ మ్యాచ్లు ఆడాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 414 పరుగులు చేసిన అతడు.. లిస్ట్-ఏలో 36 పరుగులే చేశాడు. కెరీర్ మొత్తంలో ఒక శతకం (103 నాటౌట్) బాదాడు. దేశవాళీ క్రికెట్లో రాణించిన ఆర్యమన్ను 2018లో ఐపీఎల్ ప్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. రెండేళ్లు జట్టుతోనే ఉన్నా.. తుది జట్టులో మాత్రం ఆడే అవకాశం రాలేదు. 2019లో ఆర్ఆర్ అతడిని వదిలేసింది. గాయాలతో ఇబ్బంది పడుతున్న ఆర్యమన్.. 2019లో క్రికెట్కు వీడ్కోలు పలికాడు. క్రికెట్లో సక్సెస్ కాకపోయినా అతడు ఇప్పుడు బాగా వ్యాపారవేతగా ఉన్నాడు.
తాజావార్తలు
-
Hollywood: హాలీవుడ్ దెబ్బకు బాలీవుడ్ బెంబేలు .. ‘స్పైడర్ మ్యాన్’ దూకుడుతో మారుతున్న బాక్సాఫీస్ లెక్కలు
-
Yashasvi Jaiswal: ‘అలా ప్రవర్తించకూడదు’.. జైస్వాల్పై ఐసీసీ చర్యలు తప్పవు?
-
Karn Sharma Retirement: నాలుగు ఐపీఎల్ టైటిళ్ల హీరో రిటైర్మెంట్.. భారత్, ఐపీఎల్, దేశవాళీ క్రికెట్కు గుడ్బై!
-
Rahul Ramakrishna: అలాంటి పాత్రలు చేయడం ఇష్టం లేదు.. విజయ్ దేవరకొండ నా కాల్స్ తీసుకోవడం మానేశాడు..
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!