Piyush Goyal: భారత్ ఎవరికీ తలవంచదు.. అమెరికా సుంకాల వేళ కీలక ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Piyush Goyal: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణం చూపి అగ్రరాజ్యం అమెరికా భారత్పై 50% సుంకాలను విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈనెల 27 నుంచి ఈ సుంకాలు అమలు అవుతున్నాయి. ఈక్రమంలో అమెరికా భారత్పై 50 శాతం సుంకాన్ని విధించడంపై దేశ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. తాజాగా కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పియూష్ గోయల్ అమెరికా ప్రతీకార సుంకాలపై కీలక ప్రకటన విడుదల చేశారు. ఇండియా అమెరికన్ సుంకాలకు తలవంచబోదని స్పష్టం చేశారు. ఈ అత్యవరస పరిస్థితుల్లో తాము కొత్త మార్కెట్లను కనుగొంటామని, ఎగుమతులను పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
READ ALSO: Kakani Govardhan Reddy: వీడియోలో ఉన్నది కోటంరెడ్డి మనుషులే..! ఈ కేసులో ఎవరిని ఇరికిస్తారో..?
Also Read
- Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
- Monsoon: తొలకరిపై అన్నదాతలకు ఐఎండీ గుడ్న్యూస్.. 2-3 రోజుల్లో కేరళకు రుతుపవనాలు
- Janasena: పవన్ సభకు అనుమతి నిరాకరణపై జనసేన ఆగ్రహం.. తెలంగాణ పోలీసుల వైఖరిని తప్పుబట్టిన పార్టీ
- Virat Kohli: ‘ఆస్ట్రేలియాలో కోహ్లీ ఒక ప్రభంజనం’.. ఆర్సీబీ గెలుపుపై ఆసీస్ డిప్యూటీ పీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
స్వేచ్ఛా వాణిజ్యానికి సిద్ధం..
భారతదేశం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ అన్నారు. అయితే అమెరికా ఒత్తిడికి మాత్రం తలొగ్గదని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలకు భారతదేశం “వంగి దండాలు పెట్టదు” దానికి బదులుగా కొత్త మార్కెట్లపై దృష్టిసారించి దేశీయ ఎగుమతులను పెంచుతుందన్నారు. ఈ సంవత్సరం దేశ ఎగుమతులు 2024-25 సంఖ్యను అధిగమిస్తాయని చెప్పారు. ప్రతి రంగానికి మద్దతు ఇవ్వడానికి, దేశ ఎగుమతులను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో అనేక కొత్త ప్రకటనలు చేస్తుందని చెప్పారు. భారత్ ఎల్లప్పుడూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సిద్ధంగా ఉంటుందని చెప్పారు.
ఇరుదేశాల సంబంధాలలో ఉద్రిక్తత..
ట్రంప్ ప్రతీకార సుంకాల దాడితో అమెరికా – భారత సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ ప్రతీకార సుంకాలను ఇండియా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ట్రంప్ అమెరికా పరిధిని పెంచాలని చూస్తున్నారు. కానీ భారతదేశం – అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఇప్పటివరకు విజయవంతం కాలేదు. ట్రంప్ ఒత్తిడికి తలొగ్గబోమని భారత్ ప్రధాని మోడీ బహిరంగంగా చెప్పారు. ఈక్రమంలో ప్రధాని ‘స్వదేశీ’ ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. అమెరికా అధ్యక్షుడి ప్రతీకార సుంకాల నిర్ణయం రష్యాపై ఒత్తిడి తీసుకురాడానికే అని యూఎస్ అధికార యంత్రాంగం చెప్తుంది. ఈ ప్రతీకార సుంకాలతో రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపవచ్చని వారు చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ ప్రతికార సుంకాలపై భారత్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.
READ ALSO: Anjali Raghav : భోజ్పురి స్టార్ పవన్ సింగ్ అనుచిత ప్రవర్తనపై.. స్పందించిన నటి
తాజావార్తలు
-
Buchi Babu: “నేను పెద్ది 100 సార్లు చూసి.. ఏడ్చేశా”.. పెద్ది మూవీపై బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Ram Charan : మీకోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే.. చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తా!
-
Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
-
Ram Charan : ఇలాంటి అద్భుతమైన కథ దొరికినప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం?
-
Janhvi Kapoor: ముద్దుముద్దు తెలుగుతో మురిపించిన జాన్వీ కపూర్.. ఫిదా అయిన చరణ్!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!