FCRA Bill: ‘మా చట్టాల గురించి మీకెందుకు?’.. అమెరికాకు భారత్ ఘాటు సమాధానం
- FCRA సవరణ బిల్లు మా అంతర్గత వ్యవహారం..
- అమెరికాకు తేల్చి చెప్పిన భారత్..
- ఇటీవల రిపబ్లికన్ పార్టీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
FCRA Bill: విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) సవరణ బిల్లుపై ఇటీవల అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రిలీ మూర్ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. FCRA బిల్లు తమ అంతర్గత విషయమని స్పష్టం చేసింది. చట్టాల రూపకల్పన పూర్తిగా భారత అంతర్గత వ్యవహారమని, విదేశీ నిధుల నియంత్రణకు అమెరికాతో పాటు అనేక దేశాల్లో కూడా ప్రత్యేక చట్టాలు ఉన్నాయనే విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) స్పష్టం చేసింది.
అమెరికా వెస్ట్ వర్జీనాయాకు చెందిన రిపబ్లికన్ ఎంపీ రీలి మూర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదయమ్యాయి. ఆయన FCRA సవరణ బిల్లును విమర్శించారు. ఈ బిల్లు క్రైస్తవ సంస్థలపై ప్రత్యక్ష దాడితో సమానమని, క్రైస్తవ సంస్థలపై ప్రభావం చూపే అవకాశముందని ఆరోపించారు. చర్చిలు, మతపరమైన సేవా సంస్థల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందని, ఇది భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో విదేశీ నిధుల నియంత్రణకు చట్టపరమైన వ్యవస్థలు ఉన్నాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.
Also Read
- 19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
- PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
- APJAC: డీఏలు ఎందుకు ప్రకటించడం లేదు.? ప్రభుత్వ శ్వేతపత్రంపై ఏపీజేఏసీ ఫైర్.!
- Harish Rao: నిరుద్యోగులపై ఎందుకింత కక్ష? సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
ఎన్డీయే ప్రభుత్వం తీసుకురాబోతున్న FCRA సవరణ బిల్లు భారత్తో పాటు అమెరికాలో సంచలనంగా మారింది. ఈ బిల్లు ద్వారా విదేశాల నుంచి ఎన్జీవోలకు, ఇతర స్వచ్చంద సంస్థలకు వచ్చే నిధులపై జవాబుదారీతనం మరింత పెరుగుతుంది. నిధులు ఎందుకు వచ్చాయి.? ఎక్కడ ఖర్చు చేశారు? ఏ పని కోసం వినియోగించారు? అనే వివరాలను కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా కోరుతుంది. ఒక వేళ అవకతవకలకు పాల్పడితే FCRA రిజిస్ట్రేషన్ రద్దు చేసే అధికారంతో పాటు, ఆ నిధుల్ని స్వాధీనం చేసుకునే అధికారాలు ఈ బిల్లు ద్వారా ప్రభుత్వానికి సంక్రమిస్తాయి. ముఖ్యంగా, మతమార్పిడి, ఉగ్రవాదం, దేశ సార్వభౌమత్వ, ప్రజాస్వామ్య వ్యవస్థలు, ప్రజా భద్రతపై ప్రతికూల ప్రభావం పడకుండా చూడటమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశ్యం.
Bi-Weekly Media Briefing by the Official Spokesperson (August 07, 2026)
https://t.co/rT0CbgPosI— Randhir Jaiswal (@MEAIndia) August 7, 2026
తాజావార్తలు
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
-
APJAC: డీఏలు ఎందుకు ప్రకటించడం లేదు.? ప్రభుత్వ శ్వేతపత్రంపై ఏపీజేఏసీ ఫైర్.!
-
Rishabh Pant: అర్ధరాత్రి సీఎం సాయం కోరిన రిషబ్ పంత్.. స్పందించిన పుష్కర్ సింగ్ ధామి
-
Bharat Bhhagya Viddhaata: తుపాకుల మోతలో ప్రాణాలను పణంగా పెట్టిన రియల్ హీరోలు.. ఓటీటీలోకి ‘భారత్ భాగ్య విధాత’
ట్రెండింగ్
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!