Gautam Gambhir: ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్.. గంభీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియా-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే.. కేవలం దేశాలే కాదు. ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. అలాంటిది మొన్న అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ లో టీమిండియా పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. పోటాపోటీగా మ్యాచ్ కొనసాగుతుందనుకుంటే మ్యాచ్ కాస్తా వన్ సైడ్ అయిపోయింది. ఇక టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శన చూపించడంతో పాక్ ఆటగాళ్లు బౌలింగ్, బ్యాటింగ్ లోనూ విఫలమయ్యారు. గెలుపోటముల గురించి పక్కనబెడితే బాబర్ సేన కనీసం ఫైటింగ్ స్కిల్స్ చూపించకపోవడంతో ఆ టీమ్ అభిమానుల్ని బాధించింది. ఇలాంటి ఆటతీరు ఉపఖండంలో క్రికెట్కు మేలు చేయదని టీమిండియా మాజీ క్రికెటర్, లెజెండరీ బ్యాటర్ గౌతం గంభీర్ అన్నాడు.
Pepper X: మిర్చికే గాడ్ ఫాదర్.. యమ హాట్ గురూ..!
Also Read
- Bihar: ప్రశాంత్ కిషోర్కు పోటీగా బీజేపీ నుంచి అభిషేక్ కుమార్.. బంకీపూర్ బైపోల్స్లో టఫ్ ఫైట్
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. భూములిచ్చేవారికి కౌలు రూ.40 వేలు..
- Head Coach: గౌతమ్ గంభీర్కు బిగ్ షాక్.. టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ వచ్చేశారు..
- Trump: ఓ వైపు ఖమేనీ అంత్యక్రియలు.. ఇంకోవైపు టర్కీలో ట్రంప్ పర్యటన.. సర్వత్రా ఉత్కంఠ
ఈ వరల్డ్ కప్ లోనైనా పాకిస్తాన్ గెలవాలనే కసితో దిగినప్పటికీ.. 8వ సారి ఇండియా చేతిలో ఓటమిపాలైంది. మరోసారి పాకిస్థాన్పై టీమిండియా అద్భుతం చేసి చూపించిందని గంభీర్ తెలిపాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శన చూపించిందని గంభీర్ పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. ఇండియా-పాక్ ఈ టీమ్స్ ఎప్పుడు ఆడినా హోరాహోరీగా తలపడతాయని.. గెలుపు కోసం చివరి వరకు పోరాడతాయన్నాడు. కానీ ఈ మధ్య కాలంలో జరిగిన మ్యాచ్ ల్లో అలాంటి సందర్భాలు కనపడలేదని తెలిపాడు. పాక్పై భారత్దే పూర్తి డామినేషన్ కనిపిస్తోందన్నాడు. అయితే ఉపఖండ దేశాల్లో క్రికెట్కు ఇది చేటు చేస్తుందని గంభీర్ పేర్కొన్నాడు. ఇండియా-పాక్ల మధ్య సిరీస్లు ఉంటే తీవ్ర పోటీ ఉంటుందని మేమెప్పుడూ చెబుతుంటాం.. కానీ ఇప్పుడు ఇలాంటి మ్యాచ్ చూశాక మాత్రం ద్వైపాక్షిక సిరీస్ల్లోనూ పోటాపోటీగా ఉంటుందని చెప్పలేనని గంభీర్ చెప్పుకొచ్చాడు.
Ram Charan- Upasana : కూతురు క్లింకార తో రామ్ చరణ్, ఉపాసన ఫస్ట్ ఫారెన్ టూర్.. ఫోటోలు వైరల్..
ఇక బుమ్రా-షహీన్కు మధ్య పోలిక పెడుతుండటంపై గంభీర్ తనదైన శైలిలో స్పందించాడు. ఈ మ్యాచ్లో మధ్యాహ్నం 2 గంటల టైమ్లో ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బుమ్రా బౌలింగ్ వేసి ఫస్ట్ స్పెల్లోనే బ్యాటర్లను కట్టడి చేశాడని.. అతను సూపర్ అని గంభీర్ తెలిపాడు. అయితే ఇండియా-పాక్ మధ్య దైపాక్షిక సిరీస్లు జరగడం లేదు.. ఫ్యూచర్లో జరుగుతాయో లేదో చెప్పలేం.. కానీ పాక్ పెర్ఫార్మెన్స్ చూశాక బైలాటరల్ సిరీస్లు పెట్టినా వేస్ట్ అని.. అక్కడా భారత్ డామినేషన్ ఉంటుందని ఇన్డైరెక్ట్గా గంభీర్ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Meta: సోషల్ మీడియా చరిత్రలోనే నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్! మెటాకు ఏకంగా రూ.120 లక్షల కోట్ల జరిమానా..
-
Bihar: ప్రశాంత్ కిషోర్కు పోటీగా బీజేపీ నుంచి అభిషేక్ కుమార్.. బంకీపూర్ బైపోల్స్లో టఫ్ ఫైట్
-
CM Revanth Reddy : కడియంపై కొండా సురేఖ ఫిర్యాదు.. సీఎం రేవంత్కు లేఖ.!
-
AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. భూములిచ్చేవారికి కౌలు రూ.40 వేలు..
-
Weight Loss Tablets: లావుగా ఉన్నవారికి గుడ్ న్యూస్.. వెయిట్ లాస్ డ్రగ్ అమ్మకాలు షూరు.. ఆ మ్యాజిక్ పిల్ కథేంటో చూడండి!
ట్రెండింగ్
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!