Gautam Gambhir: ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్.. గంభీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఇండియా-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే.. కేవలం దేశాలే కాదు. ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. అలాంటిది మొన్న అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ లో టీమిండియా పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. పోటాపోటీగా మ్యాచ్ కొనసాగుతుందనుకుంటే మ్యాచ్ కాస్తా వన్ సైడ్ అయిపోయింది. ఇక టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శన చూపించడంతో పాక్ ఆటగాళ్లు బౌలింగ్, బ్యాటింగ్ లోనూ విఫలమయ్యారు. గెలుపోటముల గురించి పక్కనబెడితే బాబర్ సేన కనీసం ఫైటింగ్ స్కిల్స్ చూపించకపోవడంతో ఆ టీమ్ అభిమానుల్ని బాధించింది. ఇలాంటి ఆటతీరు ఉపఖండంలో క్రికెట్కు మేలు చేయదని టీమిండియా మాజీ క్రికెటర్, లెజెండరీ బ్యాటర్ గౌతం గంభీర్ అన్నాడు.
Pepper X: మిర్చికే గాడ్ ఫాదర్.. యమ హాట్ గురూ..!
Also Read
- Kolkata: కోల్కతాలో బుల్డోజర్ల గర్జన.. అర్ధరాత్రి టీఎంసీ ఆఫీసు నేలమట్టం!
- Gen Z: జెన్ జీల ప్రభావం.. రాష్ట్రాల సీఎంలనే మార్చేశాయి.. విజయ్కు కలిసొచ్చింది ఇదే...
- MK Stalin: ఓడిన కొన్ని గంటలకే కొళత్తూరులో స్టాలిన్ పర్యటన.. ఫొటోలు వైరల్
- Story Board : దీదీ దూకుడుకి కళ్లెం పడ్డట్టేనా..? బెంగాల్ కూతురు భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?
ఈ వరల్డ్ కప్ లోనైనా పాకిస్తాన్ గెలవాలనే కసితో దిగినప్పటికీ.. 8వ సారి ఇండియా చేతిలో ఓటమిపాలైంది. మరోసారి పాకిస్థాన్పై టీమిండియా అద్భుతం చేసి చూపించిందని గంభీర్ తెలిపాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శన చూపించిందని గంభీర్ పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. ఇండియా-పాక్ ఈ టీమ్స్ ఎప్పుడు ఆడినా హోరాహోరీగా తలపడతాయని.. గెలుపు కోసం చివరి వరకు పోరాడతాయన్నాడు. కానీ ఈ మధ్య కాలంలో జరిగిన మ్యాచ్ ల్లో అలాంటి సందర్భాలు కనపడలేదని తెలిపాడు. పాక్పై భారత్దే పూర్తి డామినేషన్ కనిపిస్తోందన్నాడు. అయితే ఉపఖండ దేశాల్లో క్రికెట్కు ఇది చేటు చేస్తుందని గంభీర్ పేర్కొన్నాడు. ఇండియా-పాక్ల మధ్య సిరీస్లు ఉంటే తీవ్ర పోటీ ఉంటుందని మేమెప్పుడూ చెబుతుంటాం.. కానీ ఇప్పుడు ఇలాంటి మ్యాచ్ చూశాక మాత్రం ద్వైపాక్షిక సిరీస్ల్లోనూ పోటాపోటీగా ఉంటుందని చెప్పలేనని గంభీర్ చెప్పుకొచ్చాడు.
Ram Charan- Upasana : కూతురు క్లింకార తో రామ్ చరణ్, ఉపాసన ఫస్ట్ ఫారెన్ టూర్.. ఫోటోలు వైరల్..
ఇక బుమ్రా-షహీన్కు మధ్య పోలిక పెడుతుండటంపై గంభీర్ తనదైన శైలిలో స్పందించాడు. ఈ మ్యాచ్లో మధ్యాహ్నం 2 గంటల టైమ్లో ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బుమ్రా బౌలింగ్ వేసి ఫస్ట్ స్పెల్లోనే బ్యాటర్లను కట్టడి చేశాడని.. అతను సూపర్ అని గంభీర్ తెలిపాడు. అయితే ఇండియా-పాక్ మధ్య దైపాక్షిక సిరీస్లు జరగడం లేదు.. ఫ్యూచర్లో జరుగుతాయో లేదో చెప్పలేం.. కానీ పాక్ పెర్ఫార్మెన్స్ చూశాక బైలాటరల్ సిరీస్లు పెట్టినా వేస్ట్ అని.. అక్కడా భారత్ డామినేషన్ ఉంటుందని ఇన్డైరెక్ట్గా గంభీర్ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Kalita Majhi: ఇళ్లలో పనిమనిషి నుండి ఎమ్మెల్యేగా ఎదిగిన కలితా మాజీ.. ఈమె ఎవరు?
-
Kolkata: కోల్కతాలో బుల్డోజర్ల గర్జన.. అర్ధరాత్రి టీఎంసీ ఆఫీసు నేలమట్టం!
-
Salman Khan: సల్మాన్ ఖాన్ ‘SVC63’లో పవర్ఫుల్ విలన్..
-
Project Freedom: అమెరికా, ఇరాన్ల మధ్య వివాదంలో కీలక మలుపు.. ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’కు ట్రంప్ బ్రేక్
-
Sanju Samson: ‘చెట్టా’ కాదు.. ‘సంజూ’ అని పిలవండి! ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వేళ శామ్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!