Medicine Price : ఫార్మా కంపెనీలపై ‘రూల్స్’ కత్తి.. భారీగా పెరగనున్న మందుల ధరలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medicine Price : భారతదేశాన్ని ప్రపంచ ఔషధ కర్మాగారం అంటారు. చౌక ఔషధాలను తయారు చేయడంలో భారతదేశానికి సాటి మరేదేశం లేదు. అయితే రాబోయే రోజుల్లో ఇది మారే అవకాశం కనిపిస్తోంది. దేశంలో ప్రజల చికిత్స ఖర్చు పెరగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే మందుల ధరలు త్వరలో భారీగా పెరిగే అవకాశం ఉంది. వాస్తవానికి మందుల కొరత కారణంగా కొంతకాలం తర్వాత వాటి ధరలు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఫార్మాస్యూటికల్ కంపెనీల కోసం కొన్ని నియమాలను రూపొందించింది. అవి తమ ఫ్యాక్టరీలను నిర్వహించే ప్రామాణిక పద్ధతులకు (SOPలు) సంబంధించినవి. ఈ నిబంధనల కారణంగా దేశంలో చౌకగా మందులను తయారు చేస్తున్న అనేక చిన్న కంపెనీలు ఫ్యాక్టరీ మూసివేత ముప్పును ఎదుర్కొంటున్నాయి.
Read Also:kodi Pandalu: సై అంటున్న కోడి పుంజులు.. సిద్ధమైన బరులు
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీల పని విధానాలకు సంబంధించి సవరించిన నిబంధనల ‘షెడ్యూల్-ఎం’కి సంబంధించి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇటీవల నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఫార్మాస్యూటికల్ కంపెనీలకు ఎంత పెద్ద ఆఫీసు ఉండాలి, ఎంత పెద్ద ఫ్యాక్టరీ ఉండాలి, ఏ ప్లాంట్లు, ఏ పరికరాలు వాడాలి అనే విషయాలు ఇందులో ఉన్నాయి. వీటన్నింటికి సంబంధించిన వివరాలను అందించారు. డ్రగ్స్ ఉత్పత్తికి మంచి పద్ధతులు ఏవి అనే సమాచారం కూడా ఇవ్వబడింది. ఇది మాత్రమే కాదు, ఔషధ కంపెనీలు ప్రతి సంవత్సరం నాణ్యత సమీక్ష, నాణ్యత రిస్క్ మేనేజ్మెంట్ను కూడా సమీక్షించవలసి ఉంటుంది. దీంతో దేశంలోని పలు చిన్న, మధ్య తరహా ఔషధ కంపెనీలు మూతపడే ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఈ నిబంధనలను అనుసరించడానికి ఆ కంపెనీలకు తగినంత వనరులు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో మందుల కొరత తప్పదు. దీంతో మందుల ధరలు పెరగనున్నాయి.
Read Also:Asifabad: కాగజ్ నగర్ పులులు చంపిన కేసు.. ముగ్గురు నిందితుల్లో ఒకరు 11 ఏళ్ల బాలుడు
మైక్రో, స్మాల్ అండ్ మీడియం (ఎంఎస్ఎంఈ) ఫార్మాస్యూటికల్ కంపెనీలకు ‘షెడ్యూల్-ఎం’ని తప్పనిసరి చేస్తామని గతేడాది జూలైలో ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా స్పష్టం చేశారు. దశలవారీగా దీన్ని అమలు చేయనున్నారు. ఏడాదికి రూ. 250 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ని కలిగి ఉన్న కంపెనీలు ఆగస్టు 1, 2023 నాటికి ఈ నిబంధనలను పాటించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతోంది. చిన్న కంపెనీలకు ఒక సంవత్సరం సమయం లభిస్తుంది. చిన్న తరహా ఫార్మాస్యూటికల్ కంపెనీలకు ‘షెడ్యూల్-ఎం’ని అమలు చేయడం చాలా కష్టమైన పని అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్తో అనుబంధంగా ఉన్న ‘లఘు ఉద్యోగ్ భారతి’ అనే సంస్థ పేర్కొంది. కంపెనీలు నాణ్యతపై నియమాలను అనుసరించవచ్చు, కానీ అప్గ్రేడ్ చేయడానికి మూలధనం అవసరం. చాలా కంపెనీలు తమ వ్యాపారాన్ని మూసివేయవలసి ఉంటుంది.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..