Asian Games 2023 BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఏషియన్ గేమ్స్ 2023లో టీమిండియా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BCCI confirmed the participation of India Cricket Teams in Asian Games 2023: శుక్రవారం (జూలై 7) ముంబైలో జరిగిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏషియన్ గేమ్స్ 2023కు భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లను పంపాలని నిర్ణయించారు. అయితే చైనాకు మహిళల పూర్తి స్థాయి జట్టును పంపాలని నిర్ణయించగా.. పురుషుల ద్వితీయ శ్రేణి జట్టును పంపాలని బోర్డు నిర్ణయించింది. చైనాలోని హాంగ్జౌలో జరగనున్న ఏషియన్ గేమ్స్ సెప్టెంబర్ మరియు అక్టోబర్ మధ్య జరుగుతాయి.
ప్రస్తుతం భారత మహిళల జట్టుకు ఎలాంటి ఐసీసీ టోర్నీలు లేవు. అందుకే ఏషియన్ గేమ్స్ 2023లో రెగ్యులర్ జట్టును బీసీసీఐ బరిలోకి దింపుతోంది. సెప్టెంబర్ 19 నుంచి మహిళల క్రీడలు ఆరంభం అవుతాయి. మరోవైపు భారత్లోనే అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ 2023 జరుగనుంది. ఈ నేపథ్యంలో భారత పురుషుల బీ జట్టు పాల్గొంటుంది. పురుషుల ఆట సెప్టెంబర్ 28 నుంచి ప్రారంభమవుతుంది. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్కి కెప్టెన్సీ అప్పగించవచ్చు. అయితే ప్రస్తుతం ఈ నిర్ణయానికి సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం లేదు.
Also Read
- Ganesh Chaturthi 2026: బొజ్జ గణపయ్య ప్రతిష్ఠకు శుభ ముహూర్తం.. పూజా సామగ్రి.. పూజా విధానం ఇదే!
- Women's Asia Cup Final 2026: టీమిండియా ఛాంపియన్స్.. కానీ ట్రోఫీ ఎక్కడ? నఖ్వీతో మళ్లీ వివాదం
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
- Astrology: సెప్టెంబర్ 14 సోమవారం దినఫలాలు.. వినాయక చవితి రోజు ఈ రాశుల వారికి అన్నీ శుభాలే..!
Also Read: Ben Stokes Record: బెన్ స్టోక్స్ అరుదైన రికార్డు.. దిగ్గజాల సరసన చోటు!
2010, 2014 ఆసియా క్రీడల్లో క్రికెట్ ఉన్నా.. భారత్ మాత్రం పాల్గొనలేదు. బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, శ్రీలంక క్రికెట్ జట్లు పాల్గొన్నా.. బీసీసీఐ మాత్రం తమ జట్లను పంపించలేదు. అయితే ఇప్పుడు భారత ఒలింపిక్ సంఘం ఒత్తిడి తేవడంతో ద్వితీయ శ్రేణిని పంపించేందుకు నిర్ణయం తీసుకుంది. చివరిసారి 2014లో ఇంచియాన్లో క్రికెట్ మ్యాచులు జరిగాయి.
ఐపీఎల్ 2023 సీజన్లో కొత్తగా తీసుకొచ్చిన ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధనను దేశవాళీ టీ20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ అమలు చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. టాస్కు ముందు ప్లేయింగ్ ఎలెవన్తో పాటు నలుగురు ఆటగాళ్ల పేర్లను కూడా ఇరు జట్లు ప్రకటించాల్సి ఉంటుంది. ఇరు జట్టు ఈ నలుగురు ప్రత్యామ్నాయ ఆటగాళ్లలో ఒకరిని మాత్రమే ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా ఎంచుకోవాలి. అక్టోబర్ 16న నుంచి సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ ఆరంభం కానుంది.
Also Read: Okaya EV Scooters Offers: ఒకయా ఈవీ స్కూటర్లపై భారీ తగ్గింపు.. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్!
తాజావార్తలు
-
Ganesh Chaturthi 2026: బొజ్జ గణపయ్య ప్రతిష్ఠకు శుభ ముహూర్తం.. పూజా సామగ్రి.. పూజా విధానం ఇదే!
-
Women’s Asia Cup Final 2026: టీమిండియా ఛాంపియన్స్.. కానీ ట్రోఫీ ఎక్కడ? నఖ్వీతో మళ్లీ వివాదం
-
Women’s Asia Cup 2026: ష్రీ చరణి బౌలింగ్ దెబ్బకు శ్రీలంక విలవిల.. మహిళల ఆసియా కప్ ఛాంపియన్గా భారత్
-
Abir Singh Debut: సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ కొడుకు హీరోగా ఎంట్రీ.. ‘టార్జాన్’ రాబోతున్న అబీర్, తోడుగా ఆ హీరో!
-
Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!