Food Inflation: వ్యవసాయ దేశానికి నేపాల్, ఆఫ్రికా నుండి పప్పులు, టమాటాలు దిగుమతులా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Food Inflation: ద్రవ్యోల్బణానికి బ్రేక్ వేసేందుకు భారత్ ఇప్పుడు నేపాల్ నుంచి టమాటాలు, ఆఫ్రికా నుంచి పప్పులను కొనుగోలు చేయనుంది. ఇందుకోసం నేపాల్, ఆఫ్రికా దేశాలతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. విశేషమేమిటంటే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని పార్లమెంట్ హౌస్లో తెలియజేశారు. పెరుగుతున్న టమాటా ధరలను అరికట్టేందుకు నేపాల్ నుంచి భారత్ పెద్ద ఎత్తున టమాటాలను దిగుమతి చేసుకుంటుందని చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసి, లక్నో, కాన్పూర్లలో టమాటా, సరుకులు మొదట దిగుమతి అవుతాయి. దీంతో టమాటా ధరలు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
అదే సమయంలో నేపాల్ కూడా భారత్కు టమాటాలను ఎగుమతి చేసేందుకు ఆసక్తి చూపుతోంది. భారత్కు టమాటా ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి షబ్నం శివకోటి తెలిపారు. దీని కోసం భారతదేశం మార్కెట్ను సులభంగా యాక్సెస్ చేయడంలో సహాయం చేయాలి. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. నేపాల్ వారం రోజుల క్రితం నుంచి భారత్కు టమాటాలను పంపిస్తోంది. కానీ ఈ ఎగుమతి తక్కువ స్థాయిలోనే జరుగుతోంది. అయితే ఇప్పుడు నేపాల్ నుంచి భారత్కు పెద్ద ఎత్తున టమాటాలు పంపనున్నారు.
Also Read
- Petrol Diesel Purchase: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక వారికి బంకుల్లో నో పెట్రోల్, డీజిల్!
- Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
- Cyber Crime: ఆన్లైన్ డేటింగ్ ఉచ్చులో మహిళా న్యాయమూర్తి.. జడ్జిగారి 'రోమాన్స్ స్కామ్' కథ వింటే నోరెళ్లబెడతారు!
- Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
Read Also:Special Offer Passengers: అయ్.. ఒక్క రూపాయికే హైదరాబాద్ టు విజయవాడ ప్రయాణం.. కానీ..!
భారత్లో వర్షాల కారణంగా టమాటా పంట దెబ్బతింది. దీంతో టమాటా చాలా ఖరీదైంది. కిలో రూ.20 నుంచి 30 వరకు లభించే టమాట కిలో రూ.120 నుంచి 160 వరకు విక్రయిస్తున్నారు. సరఫరా తగ్గడంతో టమాటా రాక తగ్గిందని వాపోతున్నారు. నేపాల్ నుండి దిగుమతి చేసుకునే టమాటాల ధరలలో మెరుగుదల ఉండవచ్చు. ఎందుకంటే భారత్లాగే నేపాల్లో కూడా రైతులు పెద్ద ఎత్తున టమాటాలు పండిస్తారు. ఖాట్మండు, లలిత్పూర్, భక్తపూర్ జిల్లాలలో పెద్దమొత్తంలో టమాటాల ఉత్పత్తి ఉంది. విశేషమేమిటంటే జూన్ చివరి వారం నుంచి భారత్లో టమాటా ఖరీదు కాగా, నేపాల్లో నెలన్నర క్రితం తక్కువ ధరతో రైతులు 70 వేల కిలోల టమాటాలను రోడ్లపై పడేశారు. ఆ సమయంలో నేపాల్లోని హోల్సేల్ మార్కెట్లో టమాటాలు కిలో రూ.10 కంటే తక్కువ ధరకు వచ్చాయి.
టమాటానే కాదు పెసలు, పచ్చిమిర్చి కూడా ఎగుమతి చేస్తామని వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రతినిధి శివకోటి చెప్పారు. కానీ, టమాటాలను ఎగుమతి చేయడానికి బదులుగా నేపాల్ కూడా భారతదేశం నుండి బియ్యం, చక్కెరను పంపాలని డిమాండ్ చేసింది. వాస్తవానికి, భారత ప్రభుత్వం ఇటీవల బాస్మతీయేతర బియ్యం ఎగుమతిని నిషేధించింది. దీని కారణంగా నేపాల్లో బియ్యం ధరలు గణనీయంగా పెరిగాయి. నేపాల్ లక్ష టన్నుల బియ్యం, 10 లక్షల టన్నుల వరి, 50 వేల టన్నుల చక్కెరను పంపాలని భారతదేశాన్ని అభ్యర్థించింది.
Read Also:Cow Attack: బాలికపై ఆవు దాడి, కాపాడుకోలేక తల్లడిల్లిన తల్లి.. నెట్టింట వీడియో వైరల్
టమాటా మాదిరిగానే కందిపప్పు కూడా చాలా ఖరీదైనది. ఢిల్లీతోపాటు పలు రాష్ట్రాల్లో కంది పప్పు కిలో రూ.140 నుంచి 160 వరకు విక్రయిస్తున్నారు. పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి, ప్రభుత్వం పప్పులను దిగుమతి చేస్తుంది. ఇందుకోసం ఆఫ్రికన్ దేశం మొజాంబిక్ తో భారత ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. పప్పుదినుసుల దిగుమతికి సంబంధించి డీల్ కుదిరిందని చెబుతున్నారు. మొజాంబిక్ మార్చి 31, 2024 వరకు ఎటువంటి షరతులు, పరిమితులు లేకుండా కంది, మినపపప్పులను భారతదేశంలోకి దిగుమతి చేసుకుంటుంది. పప్పుల ధరలను తగ్గించడానికి ప్రభుత్వం మార్చి 3, 2023 నుండి కందిపప్పులపై 10 శాతం దిగుమతి సుంకాన్ని తొలగించింది.
తాజావార్తలు
-
Petrol Diesel Purchase: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక వారికి బంకుల్లో నో పెట్రోల్, డీజిల్!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఒక్కరోజులోనే షాకిచ్చిన బులియన్ మార్కెట్!
-
Cyber Crime: ఆన్లైన్ డేటింగ్ ఉచ్చులో మహిళా న్యాయమూర్తి.. జడ్జిగారి ‘రోమాన్స్ స్కామ్’ కథ వింటే నోరెళ్లబెడతారు!
-
Ben Stokes-ECB: పూర్తిస్థాయి నిషేధంపై ఆలోచిస్తున్నాం.. బాంబ్ పేల్చిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు!
ట్రెండింగ్
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..