PM Modi in Mann ki Baat: అంతరిక్ష రంగంలో భారత్ అద్భుతాలు చేస్తోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi in Mann ki Baat: సైన్స్ అండ్ టెక్నాలజీలో దేశం సాధించిన ప్రగతి గురించి మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం తన నెలవారీ రేడియో ప్రసారమైన మన్ కీ బాత్లో భారతదేశం సౌర, అంతరిక్ష రంగంలో అద్భుతాలు చేస్తోందని అన్నారు. తన మన్ కీ బాత్ 94వ ఎపిసోడ్లో, ప్రధాన మంత్రి మాట్లాడుతూ, “మన దేశం సౌర, అంతరిక్ష రంగంలో అద్భుతాలు చేస్తోంది. దీపావళికి ఒక రోజు ముందు భారతదేశం ఏకకాలంలో 36 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది. ఈ ప్రయోగంతో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కచ్ నుంచి కోహిమా వరకు, మొత్తం దేశంలో డిజిటల్ కనెక్టివిటీ మరింత బలోపేతం అవుతుంది. ఉపగ్రహ ప్రయోగం సహాయంతో మారుమూల ప్రాంతాలు దేశంలోని ఇతర ప్రాంతాలతో మరింత సులభంగా అనుసంధానించబడతాయి.” అని ప్రధాని అన్నారు.
భారతదేశానికి క్రయోజెనిక్ రాకెట్ టెక్నాలజీని నిరాకరించిన ఆ పాత రోజులు కూడా తనకు గుర్తున్నాయని ప్రధాని మోడీ అన్నారు. కానీ భారతదేశ శాస్త్రవేత్తలు స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేయడమే కాకుండా నేడు దాని సహాయంతో డజన్ల కొద్దీ ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి పంపుతున్నారు. ఈ ప్రయోగంతో, గ్లోబల్ కమర్షియల్ మార్కెట్లో భారత్ బలమైన భాగస్వామిగా అవతరించింది.. దీంతో భారత్కు కొత్త అవకాశాల తలుపులు కూడా తెరుచుకున్నాయి.
Also Read
World’s Longest Train : 100బోగీలు, నాలుగు ఇంజన్లు.. 1.9కిలోమీటర్లతో ప్రపంచంలోనే పొడవైన రైలు
భారతదేశంలో అంతకుముందు అంతరిక్ష రంగం ప్రభుత్వ వ్యవస్థల పరిధిలోనే పరిమితమై ఉండేదని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశ యువత కోసం అంతరిక్ష రంగం తెరవబడినప్పటి నుంచి విప్లవాత్మక మార్పులు రావడం ప్రారంభించాయి. భారతీయ పరిశ్రమలు, స్టార్టప్లు ఈ రంగంలో కొత్త ఆవిష్కరణలు, కొత్త సాంకేతికతలను తీసుకురావడంలో నిమగ్నమై ఉన్నాయని ఆయన అన్నారు. అంతర్జాతీయ అంతరిక్ష సంస్థల సహకారం ఈ రంగంలో పెద్ద మార్పును తీసుకురాబోతోందని ప్రధాన మంత్రి అన్నారు. ప్రపంచం మొత్తం సౌరశక్తిని భవిష్యత్తుగా చూస్తోందని ప్రధాని మోడీ అన్నారు.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!