PM Modi in Mann ki Baat: అంతరిక్ష రంగంలో భారత్ అద్భుతాలు చేస్తోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi in Mann ki Baat: సైన్స్ అండ్ టెక్నాలజీలో దేశం సాధించిన ప్రగతి గురించి మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం తన నెలవారీ రేడియో ప్రసారమైన మన్ కీ బాత్లో భారతదేశం సౌర, అంతరిక్ష రంగంలో అద్భుతాలు చేస్తోందని అన్నారు. తన మన్ కీ బాత్ 94వ ఎపిసోడ్లో, ప్రధాన మంత్రి మాట్లాడుతూ, “మన దేశం సౌర, అంతరిక్ష రంగంలో అద్భుతాలు చేస్తోంది. దీపావళికి ఒక రోజు ముందు భారతదేశం ఏకకాలంలో 36 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది. ఈ ప్రయోగంతో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కచ్ నుంచి కోహిమా వరకు, మొత్తం దేశంలో డిజిటల్ కనెక్టివిటీ మరింత బలోపేతం అవుతుంది. ఉపగ్రహ ప్రయోగం సహాయంతో మారుమూల ప్రాంతాలు దేశంలోని ఇతర ప్రాంతాలతో మరింత సులభంగా అనుసంధానించబడతాయి.” అని ప్రధాని అన్నారు.
భారతదేశానికి క్రయోజెనిక్ రాకెట్ టెక్నాలజీని నిరాకరించిన ఆ పాత రోజులు కూడా తనకు గుర్తున్నాయని ప్రధాని మోడీ అన్నారు. కానీ భారతదేశ శాస్త్రవేత్తలు స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేయడమే కాకుండా నేడు దాని సహాయంతో డజన్ల కొద్దీ ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి పంపుతున్నారు. ఈ ప్రయోగంతో, గ్లోబల్ కమర్షియల్ మార్కెట్లో భారత్ బలమైన భాగస్వామిగా అవతరించింది.. దీంతో భారత్కు కొత్త అవకాశాల తలుపులు కూడా తెరుచుకున్నాయి.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
World’s Longest Train : 100బోగీలు, నాలుగు ఇంజన్లు.. 1.9కిలోమీటర్లతో ప్రపంచంలోనే పొడవైన రైలు
భారతదేశంలో అంతకుముందు అంతరిక్ష రంగం ప్రభుత్వ వ్యవస్థల పరిధిలోనే పరిమితమై ఉండేదని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశ యువత కోసం అంతరిక్ష రంగం తెరవబడినప్పటి నుంచి విప్లవాత్మక మార్పులు రావడం ప్రారంభించాయి. భారతీయ పరిశ్రమలు, స్టార్టప్లు ఈ రంగంలో కొత్త ఆవిష్కరణలు, కొత్త సాంకేతికతలను తీసుకురావడంలో నిమగ్నమై ఉన్నాయని ఆయన అన్నారు. అంతర్జాతీయ అంతరిక్ష సంస్థల సహకారం ఈ రంగంలో పెద్ద మార్పును తీసుకురాబోతోందని ప్రధాన మంత్రి అన్నారు. ప్రపంచం మొత్తం సౌరశక్తిని భవిష్యత్తుగా చూస్తోందని ప్రధాని మోడీ అన్నారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!