ఇండియాలో కరోనా టెర్రర్ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 44,658 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,26,03,188 కి చేరగా ఇందులో 3,18,21,428 మంది ఇప్పటికే కోలుకున్నారు. 3,44,899 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 496 మంది మృతి చెందారు. దీంతో భారత్లో ఇప్పటి వరకు మొత్తం 4,36,861 మంది కరోనాతో మరణించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో 24 గంటల్లో 79,48,439 మందికి టీకాలు వేశారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు మొత్తం 61,22,08,542 మందికి టీకాలు వేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్లో పేర్కొన్నది.
ఇండియా కరోనా అప్డేట్..24 గంటల్లో 44,658 కేసులు
![COVID 19](https://d2zfbyesi0qka0.cloudfront.net/wp-content/uploads/2021/07/COVID-19-1024x768.jpg)
COVID 19