Site icon NTV Telugu

ఇండియా కరోనా అప్డేట్.. కొత్తగా 30,773 కేసులు

మన దేశంలో క‌రోనా కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా క‌రోనా బులిటెన్‌ను విడుద‌ల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో 30,773 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,34,48,163 కి చేరింది. ఇందులో 3,26,71,167 మంది కోలుకొని డిశ్చార్జ్‌కాగా, 3,32,158 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక‌, గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 309 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వ‌ర‌కు మొత్తం 4,44,838 మంది క‌రోనాతో మృతి చెందారు. ఒక్క రోజులో దేశంలో 38,945 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

Exit mobile version