Test Cricket: టీమిండియా టెస్ట్ క్రికెట్ ముగిసినట్లేనా..?
- క్రికెట్ అభిమానులకు 2025 విషాదకరమైన సంవత్సరం..!..
- క్రికెట్కు చాలామంది దిగ్గజ క్రీడాకారులు గుడ్ బై..
- ఈ జాబితాలోకి ఛతేశ్వర్ పుజారా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Test Cricket: ప్రస్తుత క్రికెట్లో టీమిండియా అగ్రజట్టు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే, మూడు ఫార్మాట్లలో తిరుగులేని ప్రదర్శనలతో ఇటు స్వదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా సిరీస్లు గెలిచి.. ప్రపంచ క్రికెట్లో మొదటి ప్లేసులో నిలుస్తుంది. అయితే టెస్టుల్లో కొంతమంది ప్లేయర్ల వల్ల టీమిండియా టాప్-3 లో కొనసాగుతుంది. వాళ్లలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్ మరియు జడేజా లాంటి సీనియర్స్ వున్నారు. వీళ్లు ఎక్కడ ఆడినా.. సత్తా చాటుతుంటారు. దీంతో టెస్ట్ ఫార్మాట్లో భారత్ కొన్నేళ్లుగా అగ్ర స్థానాల్లో కొనసాగుతుంది. అయితే, 2025 సంవత్సరం క్రికెట్ అభిమానులకు ఒకరకంగా విషాదకరమైన సంవత్సరం అనే చెప్పాలి. ఎందుకంటే ఈ సంవత్సరంలోనే క్రికెట్కు చాలామంది దిగ్గజ క్రీడాకారులు గుడ్ బై చెప్పేశారు. ఇప్పుడు ఈ జాబితాలోకి ఛతేశ్వర్ పుజారా కూడా చేరాడు. తన వన్డే కెరీర్లో కేవలం 5 మ్యాచ్లు మాత్రమే ఆడిన పుజారా, టెస్ట్ క్రికెట్లో మాత్రం 103 మ్యాచ్లలో మొత్తం 7,195 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో పుజారా కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు.
Read Also: Sandalwood : టాలీవుడ్ ను చూసి ట్రాక్ తప్పుతున్న శాండిల్ వుడ్
Also Read
- Suryakumar Yadav: కెప్టెన్గా విజయాల పరంపర.. కట్ చేస్తే జట్టులో చోటే లేదు.. తొలిసారి స్పందించిన సూర్య.. సంచలన వ్యాఖ్యలు
- Nam vs SA: టీ20ల్లో సంచలనం.. సౌతాఫ్రికాను మరోసారి మట్టికరిపించిన నమీబియా.!
- Mallikarjun Kharge: ప్రధాని మోడీ, అమిత్షాకు ఖర్గే లేఖ.. వారిని కాపాడాలని విజ్ఞప్తి
- PM Modi: విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లో కీలక పర్యటన.!
కాగా, పుజారా రిటైర్మెంట్తో టీమిండియా టెస్ట్ క్రికెట్ ముగిసినట్లేనా అంటే అవుననే సమాధానాలు వినపడుతున్నాయి. ఎందుకంటే ఈ ఏడాది పుజారా కంటే ముందు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అశ్విన్ రిటైర్ అయ్యారు. అయితే ఈ ముగ్గురు కూడా ఇప్పటికి టీమిండియా విజయాలలో కీలకంగా వున్నారు. అంతేకాదు, టెస్టుల్లో టీమిండియా ఇన్నివిజయాలు సాధించిందంటే ఈ ముగ్గురు పాత్ర కచ్చితంగా ఉంటుంది. ఈ సీనియర్ ఆటగాళ్లలో ఒక్క జడేజానే టెస్టుల్లో కొనసాగుతున్నాడు. అతడి అనుభవమేంటో మొన్న జరిగిన ఇంగ్లాండ్ సిరీస్లో కూడా చూసారు. కాగా ఇప్పుడు పుజారా కూడా తప్పుకోవడంతో, టెస్టుల్లో ఆ స్థాయిలో ఆడే ప్లేయర్లు దొరకడం కష్టమని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడున్న యంగ్ ప్లేయర్లు ఒకట్రెండు సిరీసుల్లో అదరగొడుతున్నా… అన్ని ఫార్మా్ట్లలో వారు రాణిస్తారా? వారి ఆటతీరును సుదీర్ఘకాలం ప్రదర్శిస్తారా? లేదా? అనేది కూడా వేచిచూడాల్సిన విషయమే..
తాజావార్తలు
-
CM Vijay: పుజల్ జైలులో సీఎం విజయ్ సడన్ ఇన్స్పెక్షన్.. ఆసుపత్రి, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్ తనిఖీ
-
Suryakumar Yadav: కెప్టెన్గా విజయాల పరంపర.. కట్ చేస్తే జట్టులో చోటే లేదు.. తొలిసారి స్పందించిన సూర్య.. సంచలన వ్యాఖ్యలు
-
Nam vs SA: టీ20ల్లో సంచలనం.. సౌతాఫ్రికాను మరోసారి మట్టికరిపించిన నమీబియా.!
-
Devool Band 2: రూ.8 కోట్ల బడ్జెట్ తో రూ.100 కోట్లు కొల్లగొట్టిన మరాఠీ సినిమా.. లాభాలన్నీ రైతు కుటుంబాలకే ..
-
Nepal Floods: 5 వేల మీటర్ల ఎత్తున.. అసలేం జరిగింది? హిమాలయాల గుండెల్లో దాగిన మిస్టరీ!
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!