Test Cricket: టీమిండియా టెస్ట్ క్రికెట్ ముగిసినట్లేనా..?
- క్రికెట్ అభిమానులకు 2025 విషాదకరమైన సంవత్సరం..!..
- క్రికెట్కు చాలామంది దిగ్గజ క్రీడాకారులు గుడ్ బై..
- ఈ జాబితాలోకి ఛతేశ్వర్ పుజారా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Test Cricket: ప్రస్తుత క్రికెట్లో టీమిండియా అగ్రజట్టు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే, మూడు ఫార్మాట్లలో తిరుగులేని ప్రదర్శనలతో ఇటు స్వదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా సిరీస్లు గెలిచి.. ప్రపంచ క్రికెట్లో మొదటి ప్లేసులో నిలుస్తుంది. అయితే టెస్టుల్లో కొంతమంది ప్లేయర్ల వల్ల టీమిండియా టాప్-3 లో కొనసాగుతుంది. వాళ్లలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్ మరియు జడేజా లాంటి సీనియర్స్ వున్నారు. వీళ్లు ఎక్కడ ఆడినా.. సత్తా చాటుతుంటారు. దీంతో టెస్ట్ ఫార్మాట్లో భారత్ కొన్నేళ్లుగా అగ్ర స్థానాల్లో కొనసాగుతుంది. అయితే, 2025 సంవత్సరం క్రికెట్ అభిమానులకు ఒకరకంగా విషాదకరమైన సంవత్సరం అనే చెప్పాలి. ఎందుకంటే ఈ సంవత్సరంలోనే క్రికెట్కు చాలామంది దిగ్గజ క్రీడాకారులు గుడ్ బై చెప్పేశారు. ఇప్పుడు ఈ జాబితాలోకి ఛతేశ్వర్ పుజారా కూడా చేరాడు. తన వన్డే కెరీర్లో కేవలం 5 మ్యాచ్లు మాత్రమే ఆడిన పుజారా, టెస్ట్ క్రికెట్లో మాత్రం 103 మ్యాచ్లలో మొత్తం 7,195 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో పుజారా కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు.
Read Also: Sandalwood : టాలీవుడ్ ను చూసి ట్రాక్ తప్పుతున్న శాండిల్ వుడ్
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
కాగా, పుజారా రిటైర్మెంట్తో టీమిండియా టెస్ట్ క్రికెట్ ముగిసినట్లేనా అంటే అవుననే సమాధానాలు వినపడుతున్నాయి. ఎందుకంటే ఈ ఏడాది పుజారా కంటే ముందు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అశ్విన్ రిటైర్ అయ్యారు. అయితే ఈ ముగ్గురు కూడా ఇప్పటికి టీమిండియా విజయాలలో కీలకంగా వున్నారు. అంతేకాదు, టెస్టుల్లో టీమిండియా ఇన్నివిజయాలు సాధించిందంటే ఈ ముగ్గురు పాత్ర కచ్చితంగా ఉంటుంది. ఈ సీనియర్ ఆటగాళ్లలో ఒక్క జడేజానే టెస్టుల్లో కొనసాగుతున్నాడు. అతడి అనుభవమేంటో మొన్న జరిగిన ఇంగ్లాండ్ సిరీస్లో కూడా చూసారు. కాగా ఇప్పుడు పుజారా కూడా తప్పుకోవడంతో, టెస్టుల్లో ఆ స్థాయిలో ఆడే ప్లేయర్లు దొరకడం కష్టమని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడున్న యంగ్ ప్లేయర్లు ఒకట్రెండు సిరీసుల్లో అదరగొడుతున్నా… అన్ని ఫార్మా్ట్లలో వారు రాణిస్తారా? వారి ఆటతీరును సుదీర్ఘకాలం ప్రదర్శిస్తారా? లేదా? అనేది కూడా వేచిచూడాల్సిన విషయమే..
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!