IND W vs ENG W: వరల్డ్కప్ ముందు టీమిండియాకు డేంజర్ బెల్.. ఇంగ్లండ్ చేతిలో సిరీస్ ఓటమి.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND W vs ENG W: మహిళల టీ20 ప్రపంచకప్ 2026కు ముందు భారత మహిళల జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లండ్తో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో తొలి మ్యాచ్లో ఘన విజయం సాధించినా, ఆ తర్వాతి రెండు మ్యాచ్ల్లో ఓటమిపాలై సిరీస్ను 2-1 తేడాతో చేజార్చుకుంది. టాంటన్ వేదికగా జరిగిన మూడో, నిర్ణయాత్మక టీ20లో ఇంగ్లండ్ మహిళల జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది.
మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్ మొదట బ్యాటింగ్ చేయడంతో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. అయితే ఆరంభంలోనే వికెట్లు కోల్పోయిన భారత జట్టు మూడు కీలక వికెట్లు చేజార్చుకుంది. క్లిష్ట పరిస్థితుల్లో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ బాధ్యతాయుతంగా ఆడుతూ అజేయంగా 56 పరుగులు చేసింది. ఆమెకు జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మలు చక్కటి సహకారం అందించడంతో భారత్ పోరాడే స్కోర్ను సాధించింది.
Also Read
- Andhra Pradesh Job Calendar: ఏపీలో రెండో దశ జాబ్ క్యాలెండర్.. సీఎస్ కీలక సమావేశం..
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- Clash Between Punganur TDP Activits: కొట్టుకున్న పుంగనూరు తెలుగు తమ్ముళ్లు.. సమావేశం రద్దు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కు కూడా ప్రారంభం అంతగా కలిసిరాలేదు. భారత బౌలర్లు పవర్ప్లే లోనే మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్ను 38/3 స్కోర్కు పరిమితం చేశారు. దీంతో మ్యాచ్ భారత్ వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపించింది. అయితే ఆ తర్వాత ఎలిస్ క్యాప్సీ, హీథర్ నైట్ అద్భుత బ్యాటింగ్ తో మ్యాచ్ను పూర్తిగా మలుపుతిప్పారు. ఎలిస్ క్యాప్సీ కేవలం 43 బంతుల్లో 82 పరుగులు చేసి తన కెరీర్ లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ లలో ఒకటిని నమోదు చేసింది. మరోవైపు అనుభవజ్ఞురాలు హీథర్ నైట్ 70 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చింది.
ఈ ఇద్దరూ కలిసి నాలుగో వికెట్కు 137 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత బౌలర్లను పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టారు. చివరకు ఇంగ్లండ్ 18.3 ఓవర్లలోనే 184/4 స్కోర్ చేసి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో ఇంగ్లండ్ ఎనిమిదేళ్ల తర్వాత భారీ టీ20 ఛేజ్ను నమోదు చేసింది. మహిళల టీ20 ప్రపంచకప్కు ముందు జరిగిన ఈ సిరీస్ భారత జట్టుకు కీలకమైన పరీక్షగా భావించబడింది. అయితే వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓటమి చవిచూడడంతో జట్టు సన్నాహకాల్లో ఇంకా మెరుగుపరచాల్సిన అంశాలు ఉన్నాయని ఈ సిరీస్ స్పష్టంచేసింది. మరోవైపు ఇంగ్లండ్ మాత్రం ఒత్తిడిని తట్టుకుని అద్భుతంగా పుంజుకుని సిరీస్ను సొంతం చేసుకుని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది.
తాజావార్తలు
-
Sumalatha: డాన్సర్స్ అసోసియేషన్లో ఎలాంటి విభేదాలు లేవు.. అసలేం ఏం జరిగిందో చెప్పిన జానీ మాస్టర్ భార్య
-
Jason Sanjay: దళపతి ప్లేస్ను కొడుకు రిప్లేస్ చేస్తాడా? డైరెక్టర్ నుంచి హీరోగా మారుతున్న విజయ్ కొడుకు
-
Andhra Pradesh Job Calendar: ఏపీలో రెండో దశ జాబ్ క్యాలెండర్.. సీఎస్ కీలక సమావేశం..
-
Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
-
Clash Between Punganur TDP Activits: కొట్టుకున్న పుంగనూరు తెలుగు తమ్ముళ్లు.. సమావేశం రద్దు
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!