IND vs WI: ముగిసిన తొలిరోజు ఆట.. డబుల్ సెంచరీకి చేరువలో యశస్వి!
- అరుణ్ జైట్లీ మైదానంలో భారత్, వెస్టిండీస్ రెండో టెస్టు
- ముగిసిన తొలిరోజు ఆట
- 2 వికెట్ల నష్టానికి 318 పరుగుల చేసిన భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో మొదటి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా మొదటి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 318 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (173; 253 బంతుల్లో 22 ఫోర్లు) భారీ సెంచరీతో చెలరేగాడు. యశస్వితో పాటు కెప్టెన్ శుబ్మన్ గిల్ (20) క్రీజులో ఉన్నాడు. సాయి సుదర్శన్ (87) హాఫ్ సెంచరీ చేయగా.. కేఎల్ రాహుల్ (38) పర్వాలేదనిపించాడు. విండీస్ బౌలర్ జోమెల్ వారికన్ రెండు వికెట్స్ పడగొట్టాడు.
Also Read: AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ నిర్ణయాలు.. రూ.1.17 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం!
Also Read
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
- Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత జట్టుకు యశస్వి జైస్వాల్ మంచి ఆరంభాన్నిచ్చాడు. తొలి టెస్టులో సెంచరీ చేసిన మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (38) అతడికి సహకరించాడు. జట్టు స్కోర్ 58 వద్ద వారికన్ బౌలింగ్లో రాహుల్ స్టంపౌట్గా వెనుదిరిగాడు. అనంతరం సాయి సుదర్శన్ కూడా బాగా ఆడాడు. జైస్వాల్ బౌండరీల మోత మోగించడంతో 145 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ చేసేలా కనిపించిన సుదర్శన్ 87 రన్స్ వద్ద వారికన్ బౌలింగ్లోనే ఎల్బీగా ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో జైస్వాల్, గిల్ ఉన్నారు. రెండోరోజు గిల్ కూడా రాణిస్తే తొలి ఇన్నింగ్స్లో భారత్ భారీ స్కోరు చేస్తుంది. తొలి టెస్టులో విండీస్ ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే.
Placement 🤝 Timing
Captain Shubman Gill and Yashasvi Jaiswal finding the gaps to perfection 👌
5⃣0⃣-run stand up for the 3⃣rd wicket ✅
Updates ▶ https://t.co/GYLslRzj4G#TeamIndia | #INDvWI | @IDFCFIRSTBank | @ShubmanGill | @ybj_19 pic.twitter.com/mrifjfqTsd
— BCCI (@BCCI) October 10, 2025
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..