NTV Telugu Site icon

IND vs NZ Semi Final 2023: భారత్, న్యూజిలాండ్‌ సెమీ ఫైనల్ మ్యాచ్‌కు బెదిరింపు.. వాంఖడే స్టేడియం భారీ భద్రత!

Ind Vs Nz 1st Semi Final

Ind Vs Nz 1st Semi Final

Mumbai Police Receive Threat Message Ahead Of IND vs NZ Semi Final 2023 Match: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో సెమీస్ పోరుకు సర్వం సిద్ధమైంది. బుధవారం మధ్యాహ్నం ముంబైలోని వాంఖడే మైదానంలో జరిగే తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్‍ జట్లు తలపడనున్నాయి. లీగ్ దశలో 9 మ్యాచ్‍ల్లో గెలిచి సత్తాచాటిన టీమిండియా.. సెమీస్‍లోనూ అదే జోరును కొనసాగించాలనే కసితో ఉంది. ఈ సెమీస్ గెలిచి 2019 పరాభవానికి న్యూజిలాండ్‍పై ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది. మరోవైపు సెమీస్‍లో గెలిచి అందని ద్రాక్షగా ఉన్న వన్డే ప్రపంచకప్‌కు మరింత చేరువ కావాలని న్యూజిలాండ్‌ భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌కు బెదిరింపులు రావడం ప్రస్తుతం కలకలం రేపింది.

భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగే సయమంలో వాంఖడే స్టేడియంలో దారుణమైన ఘటన చోటుచేసుకోనుంది అని ఓ గుర్తుతెలియని వ్యక్తి ఎక్స్‌ (ట్విటర్)లో బెదిరింపులకు పాల్పడ్డాడని ముంబై పోలీసులు తెలిపారు. తన పోస్ట్‌లో ముంబై పోలీసులను ట్యాగ్‌ చేసిన ఆ వ్యక్తి.. తుపాకీ, హ్యాండ్‌గ్రనేడ్‌, బుల్లెట్‌ ఉన్న ఫొటోను షేర్‌ చేశాడు. దాంతో దీంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. వాంఖడే స్టేడియం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో గట్టి నిఘాను ఏర్పాటు చేశారు.

Also Read: IND vs NZ Semi Final 2023: ఒక్క డబుల్ డిజిట్ లేదు..సెమీస్ అంటే ‘కింగ్‌’ కోహ్లీకి వణుకా?

వన్డే ప్రపంచకప్ 2023 మ్యాచ్‌లకు బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. అక్టోబరు 14న జరిగిన భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ సమయంలోనూ ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంపై దాడి చేస్తామంటూ అప్పుడు ఓ ఈ-మెయిల్‌ వచ్చింది. ముందస్తు జాగ్రత్తగా పటిష్ట భద్రతను ఏర్పాటు చేసిన పోలీసులు.. ఆపై నిందితుడిని అరెస్టు చేశారు. ఇప్పుడు భారత్, న్యూజిలాండ్‌ సెమీ ఫైనల్ మ్యాచ్‌కు బెదిరింపు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మైదానంలో హాయిగా మ్యాచ్ ఎంజాయ్ చేద్దామనుకున్న అభిమానులకు ఈ న్యూస్ షాక్ ఇచ్చిందనే చెప్పాలి.