IND vs NZ Semi Final 2023: భారత్, న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్కు బెదిరింపు.. వాంఖడే స్టేడియం భారీ భద్రత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai Police Receive Threat Message Ahead Of IND vs NZ Semi Final 2023 Match: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో సెమీస్ పోరుకు సర్వం సిద్ధమైంది. బుధవారం మధ్యాహ్నం ముంబైలోని వాంఖడే మైదానంలో జరిగే తొలి సెమీ ఫైనల్ మ్యాచ్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. లీగ్ దశలో 9 మ్యాచ్ల్లో గెలిచి సత్తాచాటిన టీమిండియా.. సెమీస్లోనూ అదే జోరును కొనసాగించాలనే కసితో ఉంది. ఈ సెమీస్ గెలిచి 2019 పరాభవానికి న్యూజిలాండ్పై ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది. మరోవైపు సెమీస్లో గెలిచి అందని ద్రాక్షగా ఉన్న వన్డే ప్రపంచకప్కు మరింత చేరువ కావాలని న్యూజిలాండ్ భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్కు బెదిరింపులు రావడం ప్రస్తుతం కలకలం రేపింది.
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగే సయమంలో వాంఖడే స్టేడియంలో దారుణమైన ఘటన చోటుచేసుకోనుంది అని ఓ గుర్తుతెలియని వ్యక్తి ఎక్స్ (ట్విటర్)లో బెదిరింపులకు పాల్పడ్డాడని ముంబై పోలీసులు తెలిపారు. తన పోస్ట్లో ముంబై పోలీసులను ట్యాగ్ చేసిన ఆ వ్యక్తి.. తుపాకీ, హ్యాండ్గ్రనేడ్, బుల్లెట్ ఉన్న ఫొటోను షేర్ చేశాడు. దాంతో దీంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. వాంఖడే స్టేడియం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో గట్టి నిఘాను ఏర్పాటు చేశారు.
Also Read
- Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
Also Read: IND vs NZ Semi Final 2023: ఒక్క డబుల్ డిజిట్ లేదు..సెమీస్ అంటే ‘కింగ్’ కోహ్లీకి వణుకా?
వన్డే ప్రపంచకప్ 2023 మ్యాచ్లకు బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. అక్టోబరు 14న జరిగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ సమయంలోనూ ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. అహ్మాదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంపై దాడి చేస్తామంటూ అప్పుడు ఓ ఈ-మెయిల్ వచ్చింది. ముందస్తు జాగ్రత్తగా పటిష్ట భద్రతను ఏర్పాటు చేసిన పోలీసులు.. ఆపై నిందితుడిని అరెస్టు చేశారు. ఇప్పుడు భారత్, న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్కు బెదిరింపు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మైదానంలో హాయిగా మ్యాచ్ ఎంజాయ్ చేద్దామనుకున్న అభిమానులకు ఈ న్యూస్ షాక్ ఇచ్చిందనే చెప్పాలి.
తాజావార్తలు
-
UPI Safety: ఈ చిన్న పొరపాట్లు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావొచ్చు.. యూపీఐ వాడేవారు తప్పక తెలుసుకోవాలి.!
-
Kings and Queens Pub: కూకట్పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్పై పోలీసుల ఆకస్మిక దాడులు.. 9 మంది అదుపులోకి
-
Raviteja : ‘ఇరుముడి’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. సరైన డేట్ లాక్ చేసిన మేకర్స్
-
Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
-
Nana Patekar Slap Incident : నానాపటేకర్ గారు నన్ను చెంపదెబ్బ కొట్టింది నిజమే.! ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!