IND vs NZ 2nd Test: దాచడానికేమీ లేదు.. రాహుల్-సర్ఫరాజ్ మధ్య పోటీ ఉంది: కోచ్
- గురువారం నుంచి పూణేలో రెండో టెస్ట్
- తుది జట్టుపై స్పందించిన కోచ్
- రాహుల్-సర్ఫరాజ్ మధ్య పోటీ ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టులో ఓడిన భారత్.. రెండో టెస్టులో విజయం సాధించాలని చూస్తోంది. పూణేలో గురువారం నుంచి రెండో టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా మార్పులు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా తుది జట్టులో స్థానం కోసం సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్, యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ల మధ్య గట్టి పోటీనెలకొంది. ఇది వాస్తవమేనని, అందులో దాచడానికి ఏమీ లేదని టీమిండియా సహాయ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటె తెలిపాడు.
ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో టెన్ డస్కాటె మాట్లాడుతూ… ‘నిజమే.. మిడిల్ ఆర్డర్లో గట్టి పోటీ నెలకొంది. దాన్ని దాచి పెట్టాల్సిన అవసరం లేదు. బెంగళూరు టెస్ట్ మ్యాచ్లో సర్ఫరాజ్ ఖాన్ అద్భుత ప్రదర్శన చేశాడు. లోకేష్ రాహుల్ విషయంలో మాకు ఆందోళనేమీ లేదు. అతడు బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. రాహుల్ మానసిక స్థితి కూడా బాగుంది. అయితే రెండో టెస్ట్ మ్యాచ్కు ఉన్న ఆరు బ్యాటింగ్ స్థానాల్లో ఏడుగురి నుంచి ఎలా సర్దుబాటు చేయాలో చూడాలి. పిచ్ని పరిశీలించి.. జట్టుకు ఉపయోగపడే మంచి నిర్ణయం తీసుకోవాలి’ అని అన్నాడు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
Also Read: David Warner Retirement: రిటైర్మెంట్ను వెనక్కి తీసుకుంటా.. వార్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
మెడ నొప్పి కారణంగా తొలి టెస్టుకు యువ బ్యాటర్ శుభ్మన్ గిల్ దూరం కావడంతో.. సర్ఫరాజ్ ఖాన్ జట్టులోకి వచ్చాడు. మొదటి ఇన్నింగ్స్లో డకౌట్ అయినా.. రెండో ఇన్నింగ్స్లో 150 పరుగుల టాప్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు కేఎల్ రాహుల్ రెండు ఇన్నింగ్స్ల్లో వరుసగా 0, 12 రన్స్ చేశాడు. బెంగళూరు టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఓడిపోవడంతో.. రాహుల్ మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. పూణే టెస్టుకు గిల్ అందుబాటులోకి వస్తే.. రాహుల్పై వేటు వేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరి ఆస్ట్రేలియా లాంటి కీలక సిరీస్ ఉన్న నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!