IND vs NZ: నేడే భారత్, న్యూజిలాండ్ తొలి టెస్టు.. వాతావరణం, పిచ్ రిపోర్ట్ డీటెయిల్స్!
- భారత్-న్యూజిలాండ్ తొలి టెస్టు
- జోరుమీదున్న టీమిండియా
- మ్యాచ్కు వర్షం ముప్పు
- పిచ్ సీమర్లకు అనుకూలించే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs NZ Pitch and Weather Conditions: స్వదేశంలో మరో టెస్టు సిరీస్ లక్ష్యంగా భారత్ పోరుకు సిద్ధమైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా న్యూజిలాండ్తో తొలి టెస్టు నేటి నుంచే ఆరంభం కానుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తోన్న భారత్ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. డబ్ల్యూటీసీ 2023-25 ఫైనల్లో చోటుపై కన్నేసిన రోహిత్ సేన.. సిరీస్ను క్లీన్స్వీప్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు శ్రీలంక చేతిలో ఓడిన న్యూజిలాండ్.. జోరుమీదున్న టీమిండియాను ఏ మేరకు అడ్డుకుంటుందో చూడాలి.
శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ మంచి ఫామ్లో ఉన్నారు. మరోవైపు రిషబ్ పంత్ పునరాగమనంలో ఆకట్టుకున్నాడు. లోకేష్ రాహుల్ కూడా పరుగులు చేస్తున్నాడు. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్ అందుకుంటే తిరుగుండదు. గిల్ మెడ పట్టేయడంతో అతడు ఆదుకుంటే.. సర్ఫరాజ్ ఖాన్ జట్టులోకి వస్తాడు. బౌలింగ్లో అశ్విన్, జడేజా, బుమ్రా, సిరాజ్ అదరగొడుతున్నారు. అదనపు స్పిన్నర్ను తీసుకోవాలా లేదా ఫాస్ట్ బౌలర్ను ఆడించాలా అన్నది నేడు తేలనుంది.
Also Read
- China vs US: AI ఏ అగ్రరాజ్యానికీ సొంతం కాదు.. అమెరికాకు చైనా వార్నింగ్..
- Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. పోలీస్శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
- Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
- Ganesh Procession Tragedy: వినాయకుడి ఊరేగింపులో విషాదం.. జనరేటర్ ఫ్యాన్కు జుట్టు చిక్కుకుని బాలిక మృతి
న్యూజిలాండ్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా భారత్లో టెస్టు సిరీస్ నెగ్గలేదు. ఆటగాళ్లు సరైన ఫామ్లో లేని నేపథ్యంలో ఈసారి కూడా కష్టమే. లంకలో స్పిన్కు దాసోహమైన కివీస్ బ్యాటర్లు ఎలా పుంజుకుంటారో చూడాలి. సీనియర్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్కు అందుబాటులో లేకపోవడం వారికి పెద్ద లోటే. బెంగళూరులో పరిస్థితులు అనుకూలిస్తే కివీస్ పేసర్లు మ్యాట్ హెన్రీ, ఒరూర్కె, సౌథీ భారత బ్యాటర్లకు సవాలు విసరగలరు.
ఈ టెస్టు మ్యాచ్కు వర్షం ముప్పు పొంచింది. మొదటి 2-3 రోజుల ఆటకు తీవ్ర అంతరాయం కలిగే అవకాశముంది. బెంగళూరులో భారీ వర్షం వల్ల మంగళవారం ఇరు జట్ల ప్రాక్టీస్ సెషన్ కూడా తుడిచిపెట్టుకుపోయింది. అయితే చిన్నస్వామి స్టేడియంలో డ్రైనేజ్ సౌకర్యం బాగుండడం సానుకూలాంశం. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పిచ్ సీమర్లకు అనుకూలించే అవకాశముంది.
జట్లు (అంచనా):
భారత్: రోహిత్, జైస్వాల్, గిల్, కోహ్లీ, పంత్, రాహుల్, జడేజా, అశ్విన్, ఆకాశ్/కుల్దీప్, బుమ్రా, సిరాజ్.
న్యూజిలాండ్: కాన్వే, లేథమ్, యంగ్, రవీంద్ర, మిచెల్, బ్లండెల్, ఫిలిప్స్, బ్రాస్వెల్, సౌథీ, అజాజ్, ఒరూర్కె.
తాజావార్తలు
-
China vs US: AI ఏ అగ్రరాజ్యానికీ సొంతం కాదు.. అమెరికాకు చైనా వార్నింగ్..
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Sigma Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో సందీప్ కిషన్ ‘సిగ్మా’ భారీగా రిలీజ్.. మైత్రి, ఎన్వీఆర్ చేతికి థియేట్రికల్ రైట్స్!
-
Mamitha Baiju : ఏడాది తిరగకుండా.. రూ. 1000 కోట్ల క్లబ్లో మమిత బైజు
-
Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. పోలీస్శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!