IND vs NZ: నేడే భారత్, న్యూజిలాండ్ తొలి టెస్టు.. వాతావరణం, పిచ్ రిపోర్ట్ డీటెయిల్స్!
- భారత్-న్యూజిలాండ్ తొలి టెస్టు
- జోరుమీదున్న టీమిండియా
- మ్యాచ్కు వర్షం ముప్పు
- పిచ్ సీమర్లకు అనుకూలించే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs NZ Pitch and Weather Conditions: స్వదేశంలో మరో టెస్టు సిరీస్ లక్ష్యంగా భారత్ పోరుకు సిద్ధమైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా న్యూజిలాండ్తో తొలి టెస్టు నేటి నుంచే ఆరంభం కానుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తోన్న భారత్ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. డబ్ల్యూటీసీ 2023-25 ఫైనల్లో చోటుపై కన్నేసిన రోహిత్ సేన.. సిరీస్ను క్లీన్స్వీప్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు శ్రీలంక చేతిలో ఓడిన న్యూజిలాండ్.. జోరుమీదున్న టీమిండియాను ఏ మేరకు అడ్డుకుంటుందో చూడాలి.
శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ మంచి ఫామ్లో ఉన్నారు. మరోవైపు రిషబ్ పంత్ పునరాగమనంలో ఆకట్టుకున్నాడు. లోకేష్ రాహుల్ కూడా పరుగులు చేస్తున్నాడు. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్ అందుకుంటే తిరుగుండదు. గిల్ మెడ పట్టేయడంతో అతడు ఆదుకుంటే.. సర్ఫరాజ్ ఖాన్ జట్టులోకి వస్తాడు. బౌలింగ్లో అశ్విన్, జడేజా, బుమ్రా, సిరాజ్ అదరగొడుతున్నారు. అదనపు స్పిన్నర్ను తీసుకోవాలా లేదా ఫాస్ట్ బౌలర్ను ఆడించాలా అన్నది నేడు తేలనుంది.
Also Read
- EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
- Sugar Price Hike: ఇథనాల్ కాదు.. చక్కెర ధరలు పెరగడానికి కారణాలు ఇవే.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
- Amravati: వెంటిలేటర్లో పేలుడు.. NICUలో మంటలు.. ముగ్గురు నవజాత శిశువులు మృతి.!
- Modi-Trump: మోడీ–ట్రంప్ భేటీలో ట్విస్ట్.. ‘ప్రశ్నలు వద్దు’ అన్న భారత్, ట్రంప్ మాత్రం అడిగేశారు!
న్యూజిలాండ్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా భారత్లో టెస్టు సిరీస్ నెగ్గలేదు. ఆటగాళ్లు సరైన ఫామ్లో లేని నేపథ్యంలో ఈసారి కూడా కష్టమే. లంకలో స్పిన్కు దాసోహమైన కివీస్ బ్యాటర్లు ఎలా పుంజుకుంటారో చూడాలి. సీనియర్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్కు అందుబాటులో లేకపోవడం వారికి పెద్ద లోటే. బెంగళూరులో పరిస్థితులు అనుకూలిస్తే కివీస్ పేసర్లు మ్యాట్ హెన్రీ, ఒరూర్కె, సౌథీ భారత బ్యాటర్లకు సవాలు విసరగలరు.
ఈ టెస్టు మ్యాచ్కు వర్షం ముప్పు పొంచింది. మొదటి 2-3 రోజుల ఆటకు తీవ్ర అంతరాయం కలిగే అవకాశముంది. బెంగళూరులో భారీ వర్షం వల్ల మంగళవారం ఇరు జట్ల ప్రాక్టీస్ సెషన్ కూడా తుడిచిపెట్టుకుపోయింది. అయితే చిన్నస్వామి స్టేడియంలో డ్రైనేజ్ సౌకర్యం బాగుండడం సానుకూలాంశం. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పిచ్ సీమర్లకు అనుకూలించే అవకాశముంది.
జట్లు (అంచనా):
భారత్: రోహిత్, జైస్వాల్, గిల్, కోహ్లీ, పంత్, రాహుల్, జడేజా, అశ్విన్, ఆకాశ్/కుల్దీప్, బుమ్రా, సిరాజ్.
న్యూజిలాండ్: కాన్వే, లేథమ్, యంగ్, రవీంద్ర, మిచెల్, బ్లండెల్, ఫిలిప్స్, బ్రాస్వెల్, సౌథీ, అజాజ్, ఒరూర్కె.
తాజావార్తలు
-
Gold Price Today: మరోసారి భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. రూ.1.63 లక్షలు దాటిన గోల్డ్ ధర
-
Shoriful Islam History: 140 ఏళ్లలో ఇదే తొలిసారి.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ స్టార్!
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
Miss Universe India 2026:19 ఏళ్ల కేరళ భామకు మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం.. అంతర్జాతీయ వేదికపై కూడా బరిలోకి!
-
Sugar Price Hike: ఇథనాల్ కాదు.. చక్కెర ధరలు పెరగడానికి కారణాలు ఇవే.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
ట్రెండింగ్
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క