Champions Trophy 2025: భారత జట్టులోకి ముగ్గురు రీ ఎంట్రీ!
- ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ 2025
- జనవరి 22 నుంచి ఇంగ్లండ్తో టీ20 సిరీస్
- భారత జట్టులోకి ముగ్గురు రీ ఎంట్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీ కంటే ముందు భారత్ స్వదేశంలో ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడనుంది. ఇంగ్లండ్తో ఐదు టీ20లు, మూడు వన్డేలు టీమిండియా ఆడనుంది. ఈ రెండు సిరీస్లకు బీసీసీఐ సెలెక్టర్లు త్వరలోనే జట్లను ప్రకటించనున్నారు. ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసే జట్టునే.. ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో ఆడించే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు సిరీస్లలో కొన్ని నెలలుగా భారత జట్టుకు దూరంగా ఉన్న ముగ్గురు రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్, అర్ష్దీప్ సింగ్లు ఇంగ్లండ్ వన్డే సిరీస్కు ఎంపిక అవుతారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ముగ్గురు విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్నారు. మంచి ఫామ్ మీదున్నారు కూడా. ఇటీవల దేశవాళీ క్రికెట్లో శ్రేయస్ అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం జనవరి 12 వరకు ప్రొవిజనల్ జట్లను ప్రకటించాల్సి ఉంది. అయితే ఫిబ్రవరి 13 వరకు జట్టులో మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇటీవల వరుసగా విఫలమవుతున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ఎంపికపై అందరి దృష్టి నెలకొంది.
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
ప్రస్తుతం వెన్ను నొప్పితో బాధపడుతున్న ఫాస్ట్బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్ సిరీస్కు దూరమయ్యే అవకాశముంది. పనిభారం దృష్ట్యా అతడికి రెస్ట్ ఇవ్వనున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో బుమ్రా 151 ఓవర్లు వేశాడు. మెల్బోర్న్ టెస్టులో ఏకంగా 53.2 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఇంగ్లండ్ సిరీస్కు రెస్ట్ ఇచ్చి.. ఛాంపియన్స్ ట్రోఫీల ఆడించాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు అతడిని వైస్ కెప్టెన్గా నియమిస్తారని సమాచారం. ఇక ఇంగ్లండ్తో టీ20 సిరీస్ జనవరి 22 నుంచి, వన్డే సిరీస్ ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభం కానున్నాయి.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..