IND vs ENG: పంత్ స్థానంలో తమిళనాడు కీపర్కు పిలుపు.. ఇషాన్ కిషన్ను ఏమైంది?!
- టీమిండియాకు భారీ ఎదురు దెబ్బ
- ఐదవ టెస్టుకు రిషబ్ పంత్ దూరం
- పంత్ స్థానంలో జగదీశన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Narayan Jagadeesan is likely to replace Rishabh Pant: ఇంగ్లండ్తో సిరీస్లో టీమిండియాకు భారీ ఎదురు దెబ్బతగిలింది. గాయపడిన రిషబ్ పంత్ ఇక నాలుగో టెస్టులో కీపింగ్ చేయడు. గాయమైనప్పటికీ జట్టు కోసం పంత్ రెండో రోజు బ్యాటింగ్కు వచ్చాడు. మొదటి రోజు 37 పరుగుల వద్ద రిటైర్డ్హర్ట్గా వెనుదిరిగిన అతడు.. రెండోరోజు బ్యాటింగ్కు వచ్చి 54 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. గాయమైన పాదానికి మూన్ బూట్ (ఆర్థోపెడిక్ బూట్) ధరించి వచ్చిన పంత్ అసౌకర్యంగా కనిపించాడు. ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. తీవ్ర గాయమైనా జట్టు కోసం బ్యాటింగ్ చేసిన పంత్పై ప్రశంసలు కురుస్తున్నాయి.
అయితే రిషబ్ పంత్ ఐదవ టెస్టుకు దూరం కానున్నాడు. బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ.. జరిగేది ఇదే. పంత్ పాదంలో చీలిక వచ్చినట్లు స్కానింగ్లో తేలిందని తెలుస్తోంది. గాయం నుంచి కోలుకోవడానికి కనీసం ఆరు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారట. ఇక పంత్ సిరీస్లో ఆడే అవకాశం లేకపోవడంతో బీసీసీఐ సెలక్టర్లు ముందు జాగ్రత్త చర్యగా ఐదవ టెస్టు కోసం తమిళనాడు కీపర్ నారాయణ్ జగదీశన్ను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. జగదీశన్ 52 ఫస్ట్క్లాస్ మ్యాచ్ల్లో 47.50 సగటుతో 3373 రన్స్ చేశాడు. గత రంజీ సీజన్లో674 పరుగులు బాదాడు. పంత్ స్థానంలో టీమిండియా ఆటగాడు ఇషాన్ కిషన్ను ఎంపిక చేస్తారని ముందుగా భావించారు. ఇషాన్ కూడా గాయంతో బాధపడుతుండడంతో జగదీశన్కు కలిసొచ్చింది.
Also Read
- NEET UG 2026 అభ్యర్థులకు బిగ్ షాక్.. పరీక్ష రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం
- Assam CM Himanta Biswa Sarma: రెండోసారి అస్సాం ముఖ్యమంత్రిగా 'హిమంత శర్మ' ప్రమాణ స్వీకారం..!
- Why Did AIADMK Split: అన్నాడీఎంకే చీలికకు అసలు కారణం ఇదే.. పళనిస్వామి 'మాస్టర్ ప్లాన్'ను బట్టబయలు చేసిన షణ్ముగం!
- GT vs SRH Playing 11: మొదట ప్లే-ఆఫ్ చేరేది ఎవరో.!
Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
నాలుగో టెస్టులో రెండో రోజు ఆట ముగిసేసమయానికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. ఓపెనర్లు బెన్ డకెట్ (94; 100 బంతుల్లో 13×4), జాక్ క్రాలీ (84; 113 బంతుల్లో 13×4, 1×6)లు ధాటిగా ఆడారు. క్రీజులో రూట్ (11), పోప్ (20) ఉన్నారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 264/4తో మొదటి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 358 పరుగులకు ఆలౌటైంది. ఇక మూడో రోజులో భారత్ బౌలర్లు చెలరేగే దానిపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. జస్ప్రీత్ బుమ్రా జట్టును ఆడుకుంటాడో చూడాలి.
తాజావార్తలు
-
NEET UG 2026 అభ్యర్థులకు బిగ్ షాక్.. పరీక్ష రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం
-
Assam CM Himanta Biswa Sarma: రెండోసారి అస్సాం ముఖ్యమంత్రిగా ‘హిమంత శర్మ’ ప్రమాణ స్వీకారం..!
-
RJ Balaji: ‘వీర భద్రుడు’ రిలీజ్కు ముందు కొత్త వివాదం.. ఆర్జే బాలాజీపై ఫ్యాన్స్ ఫైర్!
-
Mouni Roy: విడాకుల బాటలో మరో బాలీవుడ్ జంట..నాలుగేళ్లకే దాంపత్యంలో కలతలు
-
Why Did AIADMK Split: అన్నాడీఎంకే చీలికకు అసలు కారణం ఇదే.. పళనిస్వామి ‘మాస్టర్ ప్లాన్’ను బట్టబయలు చేసిన షణ్ముగం!
ట్రెండింగ్
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..